CM YS Jagan: కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వైఎస్సార్ రైతు భరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు.. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు.. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు కచ్చితంగా వస్తుందన్న ఆయన.. గతంలో వైఎస్సార్ పాలనలో కూడా సమృద్ధిగా వర్షాలు పడేవి.. రైతులు సుభిక్షంగా ఉన్నారు.. మంచి మనసుతో పరిపాలన చేస్తే దేవుడు కూడా కరుణిస్తాడు.. ఈ సమయంలో కుప్ తో సహా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయన్నారు.. అయితే, 2014 నుండి 19 వరకు కరువు తాండవించేది అని గుర్తుచేశారు.. గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో కరువు జాడ లేదన్న సీఎం.. ఒక్క మండలం కూడా కరువు మండలంగా మారలేదన్నారు.
Read Also: CM YS Jagan: రైతులకు సీఎం జగన్ గుడ్న్యూస్.. ఇవాళే ఆ సొమ్ము పంపిణీ
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఇక, రాష్ట్రంలో ఆహార ధాన్యాలు దిగుబడి పెరిగింది.. రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ చేస్తున్నాం అన్నారు సీఎం జగన్.. నాలుగేళ్లలో 2.94 కోట్ల టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు.. ఇప్పటి వరకు రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు కుటుంబానికి వేలు 67 వేలు అందించాం… రాష్ట్ర వ్యాప్తంగా రైతు కుటుంబాలకు 27 ,062 కోట్ల రూపాయల నిధులు జమ చేశామని తెలిపారు. మరోవైపు.. మాందుస్ తుఫాన్ తో నష్టపోయిన రైతులకు 77 కోట్ల రూపాయల నిధులు ఇచ్చామన్నారు.. గడిచిన నాలుగేళ్లలో 1,911 కోట్ల రూపాయలు ఇన్ఫుట్ సబ్సిడీగా నిధులు మంజూరు చేశామని.. ఆర్బీకేల ద్వారా రైతుల చేయి పట్టుకుని నడిపిస్తున్న ప్రభుత్వం మనది.. దేశంలోని అన్ని రాష్ట్రాలు మన ఆర్బీకేలను ఆదర్శం గా తీసుకున్నాయన్నారు. ఇక, 27,800 కోట్లతో రైతు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని వెల్లడించారు ఏపీ సీఎం..
రైతుల కోసం మొత్తం లక్షా నలభై ఐదువేల కోట్లు ఖర్చు పెట్టామన్న ఆయన.. మనం చేస్తున్న పనులకు అసూయపడుతున్న వారికి చెప్తున్న , అసూయకు అసలు మందు లేదు అని ఎద్దేవా చేశారు.. చంద్రబాబుది పెత్తం దార్ల పార్టీ.. మనది ప్రజల పార్టీ.. పెత్తందార్లకు, సామాన్య ప్రజలకు మధ్య పోటీగా అభివర్ణించారు సీఎం వైఎస్ జగన్.. రైతులను వంచించిన చంద్రబాబుకు రైతుల కోసం పని చేస్తున్న మీ బిడ్డకి మధ్య యుద్దం జరుగుతుంది.. కరువు తో ఫ్రెండ్ షిప్ చేసే చంద్రబాబుకు, వరుణిడి ఆశీస్సులు ఉన్న మీ బిడ్డ జగన్ ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తోందని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!