ఏప్రిల్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారని ప్రచారం జరుగుతోంది.. ముఖ్యమంత్రి వచ్చి విశాఖలో కూర్చుని పరిపాలన ప్రారంభిస్తే ఎవరు అడ్డుకోలేరు.. బీజేపీ మాత్రం విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అంగీకరించబోదని స్పష్టం చేశారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు.. ఋషికొండలో నిర్మాణాలు పూర్తయిన తర్వాత… ఇక్కడి నుంచే పరిపాలన ప్రారంభం కావొచ్చు అని అంచనా వేశారు. ఇక, రెండు వేల రూపాయల నోట్లు బ్యాంకుల్లో లేవు., మార్కెట్లలోను కనిపించడం లేదు… పెద్ద నోట్లను […]
ఏ ఎన్నికలైనా ప్రచారం హోరెత్తుతుంది.. ఇక, ప్రచారం తర్వాత ప్రలోభాల పర్వం కూడా జోరుగా సాగుతోంది.. మాకు ఓటు వేస్తే ఇంత ఇస్తాం.. ఈ పనులు చేసిపెడతాం అనే వాళ్లు చాలా మందే మోపయ్యారు.. అయితే, వీటికి దూరంగా ఉంటుంది ఓ గ్రామంలో.. అంటే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారంటే.. ఓట్లను కూడా బహిష్కరించారా? ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. అయితే, వీరు ఎన్నికల ప్రచారానికి మాత్రమే వ్యతిరేకంగా.. అందరూ ఓటు వేయాల్సిందే.. ఒకవేళ ఓటు వేయకపోతే […]
ఏదైనా ఆపదలో ఉన్నారంటే డయల్ 100.. ఏదైనా సమస్య వచ్చిందంటే డయల్ 100.. ఎవరినుంచైనా రక్షణ కావాలన్నా డయల్ 100.. అలా డయల్ 100కు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది.. అయితే, డయల్ 100కు వచ్చే కాల్స్పై కూడా కొందరు పోలీసు అధికారులు సరిగా స్పందించడం లేదు.. దీంతో, ఓ ఎస్ఐ, కానిస్టేబుల్పై వేటు పడింది… చిత్తూరు జిల్లా సోమల పోలీసుస్టేషన్ లో విధుల పట్ల నిర్లక్ష్యం వహిచారంటూ ఎస్సై లక్ష్మీకాంత్ను వీఆర్కు పంపించారు జిల్లా ఎస్పీ రిశాంత్ […]
అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యొక్క స్నాతకోత్సవ వేడుకలు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు.. అరోరాస్ కాలేజీ స్నాతక్ 2022 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి, సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు పట్టాలు అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ప్రెసిడెంట్ కరుణ గోపాల్, సీ.ఆర్. రావుస్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వెంకటరామన్, అరోరాస్ కళాశాల చైర్మన్ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోలేఖ రాశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.. ఇప్పటికే తన లేఖల ద్వారా పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఆయన… ఇవాళ లేఖలో.. అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.. రాప్తాడులో జాకీ పరిశ్రమ ఏర్పాటు చేస్తే సుమారు 6000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని లేఖలో పేర్కొన్న రామకృష్ణ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ […]
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.. ఎందుకంటే.. పసిడి ధరలు మరింత కిందకు దిగివచ్చాయి… వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇవాళ కూడా మరింత కిందకు దిగివచ్చాయి.. నిన్నటితో పోలిస్తే ఇవాళ స్వల్పంగా తగ్గింది పసిడి ధర.. ఇదే సమయంలో వెండి ధర పెరిగింది.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 దిగివచ్చింది.. ఇదే […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైఎస్సార్ జగనన్న శాశ్వ త భూహక్కు, భూరక్ష (రీ సర్వే ) పత్రాల పంపిణీని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇక, శ్రీకాకుళం జిల్లా పర్యటన కోసం ఇవాళ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్న ఆయన.. ఉదయం 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఉదయం […]
* ఏపీలోని పెండింగ్ సమస్యలపై కేంద్రం ఫోకస్.. నేడు ఉదయం 10.30 గంటలకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో జీవోసీ భేటీ * నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షపత్రాలు పంపిణీ చేయనున్న సీఎం * ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ * ఖమ్మం: నేడు రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో గొత్తికోయల చేతిలో పోడు […]
కరోనా మహమ్మారి ఎంట్రీ తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులపై ఎన్నో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.. అయితే, మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితిలు వస్తుండడంతో.. క్రమంగా ఆ రూల్స్ను అన్ని ఎత్తివేస్తూ వస్తున్నాయి వివిధ దేశాలు.. ఈ నేపథ్యంలో భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. అంతర్జాతీయ ప్రయాణికులు ఇకపై కోవిడ్ వ్యాక్సినేషన్కు సంబంధించిన స్వీయ డిక్లరేషన్ ఫారాలను ఎయిర్ సువిధ పోర్టల్లో పూరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్రం.. […]