Employees: ప్రభుత్వంలో ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు.. నేతల స్పందన ఇలా..
Employees: పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్. 16 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉంటే.. అందులో 3 వేల కోట్ల బిల్స్ చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే ఉన్నాం అన్నారు.. కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి.. ఆ ప్రభావం ఏపీ మీద కూడా పడింది.. ఆ క్రమంలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం అన్నారు. వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం అని తెలిపారు. ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మార్చి నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.. ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
అయితే, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా ఛాయ్, బిస్కట్ సమావేశం కాదు.. పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. డీఏ బకాయిలను రెండు క్వార్టర్లల్లో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.. మొత్తంగా రూ. 16 వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉంటే.. రూ. 3 వేల కోట్లు క్లియర్ చేస్తామన్నారని.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు.. కోవిడ్ వల్ల ఒకటో తేదీన జీతాలివ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పింది.. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు కోవిడ్ ప్రభావం ఉంటుందని సెటైర్లు వేశారు. ఇక, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ.. పెండింగ్ డీఏలపై కసరత్తు చేయలేదని ప్రభుత్వం చెప్పింది.. పెండింగ్ డీఏల బకాయిలే ఎక్కువగా ఉంటాయి. రూ. 3007 కోట్లను ఈ నెలాఖరులోగా విడుదల చేస్తామని చెప్పిందని వెల్లడించారు. మరి కొన్ని నవంబర్ నెలాఖరులోగా రూ. 1800 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్నారు. పెండింగ్ డీఏల విషయంలో చర్చించుకుని చెబుతామన్నారు.. పీఆర్సీ ఎరియర్స్ పై చర్చించి చెబుతామన్నారని తెలిపారు..
ఇక, సీపీఎస్ రద్దు మీద చాలా సేపు చర్చించామని వెల్లడించారు బొప్పరాజు.. మార్చి 2022లోగా సీపీఎస్ అంశంపై స్పష్టత ఇస్తామన్నారు.. కానీ, 2023 మార్చి వచ్చేసింది.. సీపీఎస్ ఉద్యోగులకు చెందిన వాటాను తిరిగి చెల్లిస్తామని హామీనిచ్చారని తెలిపారు.. అయితే, మా ఉద్యమ కార్యాచరణ యథావిథిగా జరుగుతుందని తెలిపారు. త్వరలో మా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చిస్తాం.. కార్యవర్గ సమావేశంలో చర్చించి.. ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.. ఇక, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ డీఏలను ఉగాదిలోగా చెల్లించేలా ప్రభుత్వం హామీ ఇచ్చింది.. గత సమావేశాలకు భిన్నంగా ఈ సమావేశంలో ఆర్థికపరమైన అంశాలపై హామీ లభించిందన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో