హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది.. ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్న దేవేందర్ కుమారుడిగా చెబుతున్నారు.. కొండాపూర్ సెంట్రల్ పార్క్ లోని ఇంట్లో తల్లి తండ్రులతో కలిసి ఉంటున్న అక్షయ్.. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.. యువకుని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నా.. ఓ పాత కేసు ఆత్మహత్యకు కారణంగా ప్రచారం […]
బాలయ్య NBK 108 సినిమా ఓపెనింగ్ సెరిమొనిని డిసెంబర్ ఎనిమిదిన చేయడానికి డిసైడ్ అయ్యాడని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో తెరక్కనున్న ఈ సినిమాతో బాలయ్య మొదటిసారి నార్త్ ని వెళ్తున్నాడు.
దృశ్యం సినిమా ప్రయాణం మలయాళంలో మొదలై సౌత్ నుంచి నార్త్ వరకూ అన్ని ఇండస్ట్రీలకీ పాకింది. ఒక మర్డర్ చుట్టూ అల్లిన సస్పెన్స్ థ్రిల్లర్ ని జీతూ జోసఫ్ సూపర్బ్ గా రాసి డైరెక్ట్ చేస్తే, మెయిన్ లీడ్ ప్లే చేసిన ప్రతి హీరో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇండియాలోనే మోస్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకున్న దృశ్యం సీరిస్ నుంచి ఇప్పటికే రెండు పార్ట్స్ బయటకి వచ్చాయి. అయితే మోహన్ లాల్ నటించిన మలయాళ […]
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించింది.. దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్ దూకుడు పెంచింది.. అయితే, ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆయనకు బెదిరింపులు రావడంతో.. అదనపు భద్రత కూడా కేటాయించారు.. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగిన 20 రోజుల తర్వాత తొలిసారి రేపు సొంత నియోజకవర్గం తాండూరుకి రాబోతున్నారు ఎమ్మెల్యే […]
చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు బట్టలు ఊడదీసి కొడతాను అంటున్నాడు.. ప్రజలు గత ఎన్నికల్లో నీ బట్టలు ఊడదీసి కొట్టబట్టే కదా రోడ్డున పడ్డావు అంటూ సెటైర్లు వేశారు.. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంత దిగజారి మాట్లాడటం ఎప్పుడైనా చూశామా? రాయలసీమ ప్రజల మనోభావాలను మంటగలిపే విధంగా మాట్లాడటం కరెక్టేనా? అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేని […]
అన్నమయ్య ప్రాజెక్టు విషాదానికి ఏడాది గడిచింది.. ఈ ప్రాజెక్టు తెగిపోవడంతో అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.. ఏకంగా 39 మంది ప్రాణాలు కోల్పోగా.. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట, నందలూరు మండలాల పరిధిలోని పులపత్తూరు, మందపల్లె, తొగూరుపేట, గుండ్లూరు, రామచంద్రాపురం గ్రామాలు తీవ్రంగా నష్టాన్ని చవిచూశాయి.. బాధితులు రోడ్డున పడ్డారు. అయితే, అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు సాయం అందించేందుకు జనసేన పార్టీ.. రేణిగుంటలో ఇవాళ మీడియాతో మాట్లాడిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. అన్నమయ్య […]
ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటేనే బిందాస్.. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఇబ్బందులు వచ్చినా.. ఆ తర్వాత మళ్లీ నిలదొక్కుకున్నాయి ఐటీ సంస్థలు.. అయితే, ఇప్పుడు మళ్లీ ఐటీ ఉద్యోగులను కష్టాలు వెంటాడుతున్నాయి.. ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కేలా మెటా, ట్వి టర్, సేల్స్ ఫోర్స్ , మైక్రోసాఫ్ట్, స్ట్రైప్లు ఇలా దిగ్గజ సంస్థలు అన్ని ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి.. ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇచ్చేస్తున్నాయి.. ఇప్పుడు ఆ జాబితాలో మరో ఐటీ దిగ్గజ సంస్థ సిస్కో […]
ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోడీ నల్లధనాన్ని ఆపలేకపోతున్నారని విమర్శించారు.. నల్లధనాన్ని అరికట్టడంలో విఫలమైన ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. సింగరేణిని ప్రైవేటుపరం చేయడానికి నిబంధనలు వర్తింవని తెలిసి ప్రైవేటు పరం చేయమని ప్రధానమంత్రి అంటున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, ప్రైవేటు విమానాల్లో అక్రమ నగదు తరలిస్తున్నారని.. దేశంలోని ప్రైవేట్ విమానాలపై నియంత్రణ పెట్టాలని డిమాండ్ చేశారు నారాయణ.. ప్రతి […]
సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. పోసానిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద రాజమండ్రిలో కేసు నమోదు చేశారు పోలీసులు.. అయితే, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు యందం ఇందిరా… అయితే, ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. […]
లాస్ట్ ఛాన్స్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్ ఎటాక్ మొదలైంది.. ఇప్పటికే అసలు ఇంకా ఎక్కడి లాస్ట్ చాన్స్ అప్పుడే అయిపోయిందికదా.. ఇక, ఆయన జీవితంలో మళ్లీ సీఎం కాలేడంటూ కామెంట్లు చేస్తున్నారు ఏపీ మంత్రులు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి గుడివాడ అమర్నాథ్… చంద్రబాబు నాయుడుకి 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు.. ఇప్పుడు ప్రత్యేకంగా చివరి ఎన్నికలు ఏంటి? అని ప్రశ్నించారు.. […]