Gurazala Mining Issues: పల్నాడులో మార్మోగుతోన్న కేజీఎఫ్ సినిమా పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurazala Mining Issues: కొన్ని సినిమా స్టోరీలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.. అందులో తీసుకున్న సెంటర్ పాయింట్.. అందరినీ కట్టిపడేస్తోంది.. ఇక, కేజీఎఫ్ సినిమా ఎంతో మంది ఆదరణ పొందింది.. రెండో భాగం కూడా వచ్చింది.. మూడో భాగం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.. అయితే, పల్నాడు జిల్లాలో కేజీఎఫ్ సినిమా పేరు మార్మోగుతోంది. గురజాల నియోజవర్గంలో కేజీఎఫ్ రేంజ్ లో మైనింగ్ సాగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. అవన్నీ కట్టుకథలంటూ కొట్టిపారేసిన వైసీపీ…టీడీపీ హయాంలోనే అక్రమ మైనింగ్ సాగిందని ఎదురుదాడికి దిగుతోంది.
Read Also: Employees: ప్రభుత్వంలో ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు.. నేతల స్పందన ఇలా..
Also Read
- OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
- Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
- OTR : ఎచ్చర్ల టీడీపీలో అసంతృప్తి.. "మా గోడు వినేవారు ఎవరు?" అంటున్న తమ్ముళ్లు
- OTR : ఉండిలో వైసీపీకి వరుస ఓటములు? ఐదోసారి ఇంచార్జ్ మార్పు వెనుక అసలు కథ!
పల్నాడు జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. గురజాల నియోజకవర్గంలోని అటవీ భూముల్లో అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని, కూలీల ప్రాణాలను పణంగా పెట్టి వేల కోట్లు సంపాదిస్తున్నారని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించడంతో దుమారం రేగింది. దీనికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఘాటుగానే జవాబు ఇస్తోంది. అసలు 2014 నుంచి 2019 వరకు గురజాల నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల దోపిడీ చేసింది టీడీపీ నాయకులేనని రివర్స్ అటాక్ చేస్తోంది. అక్రమ మైనింగ్ ఆరోపణలపై బహిరంగ చర్చకి సిద్ధమేనని కాసు మహేష్ రెడ్డి అంటుంటే, మాచవరం మండలం రేగుల గడ్డ అక్రమ తవ్వకాలపై నిగ్గుతేలుస్తామని టీడీపీ అంటోంది. రిజర్వ్ ఫారెస్ట్ లో కృష్ణానదిని పూడ్చి మరీ మైనింగ్ చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తోంది. మొత్తానికి అక్రమ మైనింగ్ పై టీడీపీ, వైసీపీ నేతల పరస్పర ఆరోపణలు పల్నాడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!