Asaduddin Owaisi: హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చే శారు.. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశ పార్లమెంట్లో అన్ని వర్గాల ఎంపీలు ఎన్నికై వస్తారు.. కానీ, ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా ఓ లీడర్ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదని విమర్శించారు.. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని పార్టీల నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు.. 70 ఏళ్లుగా మమ్మల్ని ఇదే విధంగా దోచుకున్నారని […]
Lord Shiva Sahasranama Stotram Live: మాఘమాసం సోమవారం నాడు ఈ స్తోత్రం వింటే కోటి జన్మల పుణ్యం.. సిరిసంపదలు చేకూరుతాయని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించేందుకు కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=SD4qam_FhVg
Sri Shiva Stotra Parayanam Live: సోమవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే పితృ దోషం, కాల సర్ప దోషం నుండి బయటపడి మోక్షాన్ని పొందుతారని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించేందుకు కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=qTk8x8mRQKk
* నేడు టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి.. బాలీవుడ్ నటుడు సునిల్శెట్టి కుమార్తె అతియాతో పెళ్లి.. * అమరావతి: జోవో నంబర్ 1పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ.. * విశాఖ: ఉమ్మడి విశాఖ జిల్లాకు చేరుకున్న 45వేల కోవిషీల్డ్ వ్యాక్సిన్స్.. నేటి నుంచి బూస్టర్ డోస్ పంపిణీ కోసం స్పెషల్ డ్రైవ్.. ఒక్కో ఆరోగ్య కేంద్రానికి 500 వ్యాక్సిన్ల వరకు కేటాయింపు… * విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈనెల 30న ప్రజాగర్జన బహిరంగ […]
Gudivada Amarnath: మూడు రాజధానులపై ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విపక్షాలు వ్యతిరేకిస్తున్నా.. ముందుకు సాగుతూనే ఉన్నారు.. ఇక, విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పై ప్రభుత్వం మరోసారి దూకుడు పెంచింది. ఈ దిశగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి సరిగ్గా రెండు నెలల్లో పరిపాలన రాజధాని కార్యకలాపాలు విశాఖపట్నం నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటించారు. దీంతో మరోసారి రాజధాని ముహూర్తంపై రాజకీయ ఆసక్తి రేకెత్తిస్తోంది. […]
Love Today Scene Repeat: సినిమా స్టోరీలు నిజ జీవితంలో రిపీట్ అయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. కొందరు సినిమాల్లోని సీన్లను ఫాలో అయిపోతుంటారు.. అవి కొన్ని సార్లు మంచి చేస్తే.. ఇంకా కొన్నిసార్లు గుట్టును విప్పి రచ్చ చేస్తాయి.. ఇక, ఈ మధ్యకాలంలో లవ్ టుడే సినిమా సంచలనమే సృష్టించింది.. ప్రేమికులు ఒకరి సెల్ఫోన్ ఒకరు మార్చుకుంటే ఏమవుతుందన్న కథ చుట్టే ఈ సినిమా తిరుగుతుంది.. పూర్తిగా ఒకరి గురించి ఒకరికి తెలుసు అనుకుంటున్న ప్రేమికుల […]
రేపే కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష.. ఇవి పక్కా పాటించాల్సిందే.. ఆంధ్రప్రదేశ్లో పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించడానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీఎస్ఎల్పీఆర్బీ) కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది. అయితే, అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష సెంటర్లోకి […]
Wipro Layoffs: ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.. ఆర్థికమాంద్యం ఎఫెక్ట్తో దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగులను తగ్గించుకునే పనిలోపడిపోయాయి.. ఇప్పటికే ఐటీ రంగంలో లక్షలాది మంది ఉద్యోగులు కోల్పోయారు.. ఫ్రెషర్లను కూడా వదలడం లేదు.. ఖర్చు తగ్గించుకోవడం ఒకటైతే.. నైపుణ్యం లేనివారిని కూడా ఇంటికి పంపిస్తున్నాయి ఆయా సంస్థలు. తాజాగా, ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వందలమంది ఫ్రెషర్లకు షాకిచ్చింది. పేలవమైన పనితీరు కారణంగా ఫ్రెషర్స్ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొంది.. దేశంలోని […]
GVL Narasimha Rao: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బీజేపీ ప్రజా పోరు యాత్ర ఉంటుంది.. 2024లో భారతీయ జనతా పార్టీ అనే రైలు అతివేగంగా, అత్యంత అద్భుతంగా ప్రయాణిస్తుంది.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ధీటుగా బీజేపీ పరుగులు పెట్టబోతోంది అని వ్యాఖ్యానించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. గుంటూరు రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఎంపీ నిధుల నుండి ఏర్పాటు చేసిన స్టీల్ బెంచిలను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో […]