Minister Adimulapu Suresh: టీడీపీ కోటలు బీటలు వారుతున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Adimulapu Suresh: జగనన్నే మన భవిష్యత్ పేరుతో సాగుతోన్న కార్యక్రమంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ స్థాయిలో ప్రజల మధ్యకు వెళ్ళే సాహసం చేయలేదు.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందాయా లేదా అని ప్రజలను అడిగిన ప్రభుత్వం లేదు.. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీఎం వైఎస్ జన్ తప్ప అంటున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.. రెండో వారం మెగా పీపుల్స్ సర్వే ప్రారంభిస్తున్నాం.. టీడీపీ కోటలు అనుకునే నియోజకవర్గాల్లో బీటలు వారే విధంగా కార్యక్రమం ఉంటుందన్నారు.. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందన్న ఆయన.. జీఎస్డీపీ పెరుగుదలలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.. జగన్ ప్రభుత్వ పారదర్శకంగా జవాబుదారితనంతో చేస్తున్న పాలన వల్లే ఈ అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు ఆదిమూలపు సురేష్.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
మరోవైపు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. సంక్షేమ రథ సారధి జగన్ అని అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధి రేటును కేంద్ర ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయన్న ఆయన.. జగన్ ఇచ్చిన మాటను తప్పడు అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాడన్నారు.. అందుకే ప్రజలు మా నమ్మకం జగన్ అంటున్నారు.. కులమతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. గతంలో రాజకీయ పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓట్ బ్యాంకుగా చూసేవి.. కానీ, నిర్లక్ష్యానికి గురైన సామాజిక వర్గాలకు రాజకీయ సాధికారిత కల్పించిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మాత్రమే నంటూ ప్రశంసలు కురిపించారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!