Bhatti Vikramarka : SIRను అడ్డంపెట్టుకుని అసలైన ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోంది
- SIRపై భట్టి ఫైర్
- AIతో ఓటర్ల గుర్తింపు?
- పౌరసత్వంపైనా ప్రభావం
- బీజేపీపై తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అడ్డం పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్షాల ఓట్లను గంపగుత్తగా తొలగిస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇవే:
‘SIR’ పేరుతో పద్ధతి ప్రకారం ఓట్ల తొలగింపు
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా , సవరణ (Special Intensive Revision – SIR) పేరుతో అసలైన ఓటర్ల హక్కులను కాలరాస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని, ఒక పద్ధతి ప్రకారం వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సరైన విచారణ జరపకుండానే విపక్షాల ఓట్లకు ఎసరు పెడుతున్నారని విమర్శించారు.
Also Read
సోషల్ మీడియా, ఏఐ (AI) టెక్నాలజీ వినియోగం
ఈ ఓట్ల తొలగింపు వెనుక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారంటూ భట్టి విక్రమార్క కీలక విషయాలను బయటపెట్టారు. సోషల్ మీడియాలో పోస్టులు, యాక్టివిటీ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే ఓటర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ద్వారా గుర్తిస్తున్నారని తెలిపారు. అలా గుర్తించిన వారి ఓట్లను ఉద్దేశపూర్వకంగా జాబితా నుండి తొలగించడం, హోల్డ్లో పెట్టడం వంటి కుట్రలకు తెరలేపారని తీవ్రంగా విమర్శించారు.
ఓటర్ల జాబితా నుండి పేర్లను తొలగించడం అనేది కేవలం ఒక వ్యక్తి ఓటు హక్కును కోల్పోవడమే కాదని డిప్యూటీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల నుండి ఒక దేశ పౌరుడి పేరును ఇలా అన్యాయంగా తొలగించడం వల్ల, భవిష్యత్తులో అది వారి భారతీయ పౌరసత్వానికే (Citizenship) పెద్ద ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.
ఇది కేవలం ఒక రాష్ట్రానికో లేదా ఒక ప్రాంతానికో పరిమితమైన అంశం కాదని, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ అప్రజాస్వామిక కార్యక్రమాన్ని నడుపుతోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమంగా లబ్ధి పొందడానికి, ప్రజల తీర్పును మార్చడానికే కేంద్ర పెద్దలు ఇటువంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై పౌరసమాజం, ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!