Yerragondapalem: యర్రగొండపాలెంలో టెన్షన్ టెన్షన్.. 144 సెక్షన్ విధింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yerragondapalem: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్థానిక ఇజ్రాయెల్ పేటలో ఇరువర్గాల ఘర్షణకు దిగాయి.. దీంతో మహిళలు సహా పది మందికి పైగా గాయాలయ్యాయి. గ్రామంలోని పోలేరమ్మ ఆలయానికి ముందు కాలనీ పేరిట ఆర్చి నిర్మానానికి ఏర్పాట్లు చేయటంతో వివాదం తలెత్తింది. ఆర్చి నిర్మాణాన్ని మరో వర్గం వ్యతిరేకిస్తుండటంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి యత్నించారు.. రాళ్ళ దాడిలో కానిస్టేబుల్ కి తీవ్రగాయలు కావటంతో హాస్పిటల్ కి తరలించారు. ఆర్చి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పిల్లర్ బాక్సులు ధ్వంసం చేయటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు..
Read Also: Vikram: వైవిధ్యంతోనే విక్రమ్ పయనం!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇక, యర్రగొండపాలెంలో నాలుగు రోజులపాటు 144 సెక్షన్ అమలు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి యర్రగొండపాలెం లోని ఇజ్రాయెల్ పేటలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకుని ఘర్షణకు దిగారు. దీంతో ఓ కానిస్టేబుల్ సహా పది మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. స్థానిక పోలేరమ్మ ఆలయానికి ముందు ఆర్చి నిర్మాణాన్ని ప్రారంభించటంతో వివాదం తలెత్తింది. ఆర్చి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పిల్లర్ బాక్సులు మరో వర్గం వారు ధ్వంసం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. రాళ్ళ దాడులు, ముఖ ద్వార నిర్మాణం ప్రారంభించిన ప్రాంతాన్ని సబ్ కలెక్టర్ సేతు మాధవన్ పరిశీలించారు. మతఘర్షణలు జరగకుండా జిల్లా నుండి ప్రత్యేక బలగాలను రప్పిస్తున్నారు. విషయం తెలుసుకుని ఇరువర్గాలతో మాట్లాడిన మంత్రి సురేష్ సంయమనం పాటించాలని కోరారు. ఇరు వర్గాలు కూర్చుని మాట్లాడుకుని ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆర్చి నిర్మాణం ప్రారంభించాలని సూచించారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!