Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల తీర్పు రిపీట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.. టీడీపీ, చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారన్న ఆయన.. మరోసారి టీడీపీకి ఘోర పరాజయం తప్పదన్నారు.. ఇక, సొంత ఇంటి కల నేర వెరుస్తున్న ప్రభుత్వం వైసీపీది.. 50 వేల మందికి పట్టాలు అమరావతిలో ఇవ్వాలని సంకల్పించామన్నారు.. సుప్రీం కోర్టు కూడా ఆర్ 5 జోన్ లో జరుగుతున్నది అభివృద్దే అనీ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు. […]
గోవాలో 7 వేలకు కొని… హైదరాబాద్ లో 18 వేలకు అమ్ముతున్నారు.. సీపీ వెల్లడి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. ప్రధాన నిందితుడు నైజీరియన్ తో పాటు ఐదుగురిని సైబరాబాద్ SOT పోలీసులు అదుపులో తీసుకున్నారు. నైజీరియన్ కు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ అదుపులో వున్నాడని పోలీసులు తెలిపారు. వారి వద్దనుంచి కోట్ల రూపాయల కొకైన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు. విదేశాల నుండి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్న ముఠాగా పోలీసులు గుర్తించారు. […]
Kakani Govardhan Reddy: చంద్రబాబు పర్యటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని.. రైతులను అడ్డం పెట్టుకుని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పంటలు నష్టానికి సంబంధించి ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది.. వాటి గురించి చంద్రబాబుకు తెలియదు అని ఎద్దేవా చేశారు. రైతుల బీమాకు సంబంధించి ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది.. చంద్రబాబు హయాంలో ఏ ఏ రైతు ప్రీమియం […]
Road Accident at Srisailam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది.. శ్రీశైలం శిఖరం సమీపంలో నల్లమల ఫారెస్ట్లోని ఘాట్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.. నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరానికి 5 కిలోమీటర్ల సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డు చిన్నారుట్ల దయ్యాల మలుపు దగ్గర టూరిస్ట్ బస్సు వేగంగా వచ్చిఅదుపు తప్పింది.. దీంతో బోల్తా కొట్టింది.. శ్రీశైలం మల్లన్న దర్శనార్థం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సండ్రుగుండ గ్రామం చెందిన 20 […]
SSC Supplementary Exams: ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. మొత్తంగా 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. గత ఏడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది.. పదవ తరగతి ఫలితాల్లో ఈసారి కూడా సత్తా చాటారు బాలికలు.. ఈ ఏడాది బాలికల్లో ఉత్తీర్ణత 75.38 శాతం.. బాలురుల్లో ఉత్తీర్ణత 69.27 శాతంగా ఉంది.. ఇక, 933 స్కూళ్లల్లో వంద శాతం పాస్.. 38 స్కూళ్లల్లో సున్నా శాతం ఫలితాలు.. ఫలితాల్లో […]
AP SSC Results 2023: ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ఫలితాలు విడుదల అయ్యాయి.. విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ 2023 ఫలితాలను విడుదల చేశారు.. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు 6,64,152 మంది ఉండగా.. పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య 6,09, 081గా ఉంది.. స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రియల్ 19 నుంచి 26వ తేదీ వరకు పూర్తి చేశాం.. 8 రోజుల్లో స్పాట్ వ్యాల్యుయేషన్ పూర్తి చేశామని.. రికార్డు స్థాయిలో […]
MP Margani Bharat: వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానంటూ మహానాడులో చెప్పగలవా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. చంద్రబాబు ఉభయగోదావరి జిల్లాల పర్యటనపై స్పందించిన ఆయన.. నిన్న చంద్రబాబు పర్యటన దండగ అన్నారు.. 58 లక్షల మందికి కిసాన్ రైతులకు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం.. కానీ, చంద్రబాబు హయాంలో జరిగిన బషీర్బాగ్ ఘటన ప్రజలు మర్చిపోలేదన్నారు.. పంట నష్టం కూడా ప్రభుత్వం అందిస్తుంది … చిట్స్ వ్యాపారం […]
Ramakrishna: విశాఖ స్టీల్ ప్లాంట్కు నష్టాల వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె. రామకృష్ణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎంపీలను కలుస్తామని ప్రకటించారు.. విశాఖ ఉక్కు ఉద్యమం 810 రోజులకు పైగా జరుగుతోందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టిందని విమర్శించారు.. గత ఏడాది 913 కోట్ల రూపాయల లాభాలు వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ […]
Kakinada Crime: జీవితంపై విసుగుచెంది కొందరు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ మరికొందరు.. ఇతర సమస్యలు ఎంతో మంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు చూస్తూనే ఉంటాం.. ఒకసారి ప్రాణాలతో బయటపడ్డారంటే.. మళ్లీ అలాంటి ప్రయత్నాలు చేసిన ఘటనలు చాలా తక్కువే ఉంటాయి.. కానీ, కాకినాడలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ.. చావలేదని ఆస్పత్రి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.. జీజీహెచ్ ఓపీ బ్లాక్పై నుంచి దూకు ప్రాణాలు తీసుకుంది సదరు మహిళ.. Read Also: […]
నేడే టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి.. టెన్త్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. అయితే, టెన్త్ పరీక్షలు రాసిన ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. ఈ రోజు పదవ తరగతి ఫలితాల విడుదల చేస్తారు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు టెన్త్ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో టెన్త్ ఫలితాలను ప్రకటించనున్నారు.. కాగా, […]