Posani Krishna Murali: నన్ను హత్య చేసేందుకు లోకేష్ కుట్ర.. నేనే చచ్చిపోతే ఆయనదే బాధ్యత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posani Krishna Murali: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై సంచలన ఆరోపణలు చేశారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి.. నన్ను హత్య చేయటానికి లోకేష్ కుట్ర పన్నుతున్నాడన్న ఆయన.. కోర్టుకు హాజరయ్యేటప్పుడు నన్ను చంపాలని చూస్తున్నారు.. నేను చచ్చిపోతే నారా లోకేష్ దే బాధ్యత అంటూ ఆరోపించారు. లోకేష్ కంటే క్రెడిబులిటీ ఉన్న వాడిని.. సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వం నచ్చే జగన్ ను అభిమానిస్తున్నాను అని తెలిపారు.. నేను కేసు పెడతాను.. నిజం కావాలా? సాక్ష్యం కావాలా? అని ప్రశ్నించారు. బూతుల వల్ల సమాజం పాడవదా? అని ప్రశ్నించారు. బూతు పనుల వల్ల సమాజం పాడవుతుందన్నారు. అమరావతి ప్రాంతంలో రాజధాని భూముల కుట్రలు పన్నారన్న ఆయన.. నన్ను కూడా ఇక్కడ భూములు కొనమని అప్పుడు చెప్పారని గుర్తుచేసుకున్నారు. అమరావతి ప్రాంతంలో భూములు ఇవ్వటం వెనుక త్యాగాలు లేవు.. భూముల రేట్లు పెంచుకోవాలనే తాపత్రయం అంటూ విమర్శలు గుప్పించారు పోసాని.
ఇక, మీడియా సమావేశంలో నారా లోకేష్ మాట్లాడిన బూతుల వీడియోను ప్రదర్శించారు పోసాని కృష్ణమురళి.. నారా లోకేష్ నాపై పరువు నష్టం కేసు వేశారు.. లోకేష్ 18 ఎకరాలు కొన్నారని నేను అన్నానట.. తాను ఒక ఎకరం కూడా కొనలేదట.. నాలుగు కోట్ల నష్టపరిహారం, రెండు ఏళ్లు జైలు శిక్ష కూడా నాకు పడే అవకాశం ఉందట అని చెప్పుకొచ్చిన ఆయన.. లోకేష్ మృదు స్వభావి.. కారులో బైనాక్యులర్స్ పెట్టుకుని చీమలకు కూడా హాని కలగకుండా వెళతారట అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ అమ్మనా బూతులు తిడితే పరువు నష్టం దావా వేయకూడదా? అని ప్రశ్నించారు. కంతేరులో భూమి కొన్నాడని అనటం పరువు నష్టం అయ్యిందట.. లోకేష్ పీఏ చైతన్య నాకు ఫోన్ చేశాడు.. నాకు అనారోగ్యంగా ఉందని తెలిసి పరామర్శించటానికి వస్తాను అన్నాడు.. తర్వాత పది రోజులకు ఫోన్ చేసి టీడీపీలో చేరాలని మళ్లీ ఫోన్ చేశాడని గుర్తు చేసుకున్నారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఫారిన్ అమ్మాయిలతో మందు తాగి తందనాలు ఆడిన లోకేష్ నా పై పరువు నష్టం కేసు పెడతాడా? అంటూ మండిపడ్డారు పోసాని.. చంద్రబాబు అధికారంలోకి వస్తే లోకేష్ పోస్టింగ్లు ఇస్తాడట.. లోకేష్ వాళ్ల అమ్మ భువనేశ్వరి, భార్య ఆస్తులు లోకేష్వి కావా? అని ప్రశ్నించారు. హెరిటేజ్ సంస్థ పేరుతో భూములు కొన్నది వాస్తవం కాదా? లోకేష్ కు తెలియకుండా బ్రాహ్మణి హెరిటేజ్ లో డైరెక్టర్ అయ్యిందా? అంటూ నిలదీశారు. ఇక, చంద్రబాబు ఏ వ్యవస్థను ఆయినా నాకేస్తాడు అంటూ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో అమరావతి రైతులకు పోసాని ఛాలెంజ్ విసిరారు.. మాది చాలా పేద కుటుంబం.. డబ్బులు లేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. నేను కష్టపడి పైకి వచ్చి సంపాదించాను.. నా సంపాదన అంతా పేద వాళ్లకు ఇచ్చేస్తాను.. ప్రతిఫలంగా అమరావతి రైతులు కోర్టు కేసులు వెనక్కి తీసుకుంటారా? అంటూ బహిరంగ సవాల్ విసిరారు పోసాని కృష్ణమురళి.
తాజావార్తలు
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..