Posani Krishna Murali: నన్ను హత్య చేసేందుకు లోకేష్ కుట్ర.. నేనే చచ్చిపోతే ఆయనదే బాధ్యత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posani Krishna Murali: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై సంచలన ఆరోపణలు చేశారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి.. నన్ను హత్య చేయటానికి లోకేష్ కుట్ర పన్నుతున్నాడన్న ఆయన.. కోర్టుకు హాజరయ్యేటప్పుడు నన్ను చంపాలని చూస్తున్నారు.. నేను చచ్చిపోతే నారా లోకేష్ దే బాధ్యత అంటూ ఆరోపించారు. లోకేష్ కంటే క్రెడిబులిటీ ఉన్న వాడిని.. సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వం నచ్చే జగన్ ను అభిమానిస్తున్నాను అని తెలిపారు.. నేను కేసు పెడతాను.. నిజం కావాలా? సాక్ష్యం కావాలా? అని ప్రశ్నించారు. బూతుల వల్ల సమాజం పాడవదా? అని ప్రశ్నించారు. బూతు పనుల వల్ల సమాజం పాడవుతుందన్నారు. అమరావతి ప్రాంతంలో రాజధాని భూముల కుట్రలు పన్నారన్న ఆయన.. నన్ను కూడా ఇక్కడ భూములు కొనమని అప్పుడు చెప్పారని గుర్తుచేసుకున్నారు. అమరావతి ప్రాంతంలో భూములు ఇవ్వటం వెనుక త్యాగాలు లేవు.. భూముల రేట్లు పెంచుకోవాలనే తాపత్రయం అంటూ విమర్శలు గుప్పించారు పోసాని.
ఇక, మీడియా సమావేశంలో నారా లోకేష్ మాట్లాడిన బూతుల వీడియోను ప్రదర్శించారు పోసాని కృష్ణమురళి.. నారా లోకేష్ నాపై పరువు నష్టం కేసు వేశారు.. లోకేష్ 18 ఎకరాలు కొన్నారని నేను అన్నానట.. తాను ఒక ఎకరం కూడా కొనలేదట.. నాలుగు కోట్ల నష్టపరిహారం, రెండు ఏళ్లు జైలు శిక్ష కూడా నాకు పడే అవకాశం ఉందట అని చెప్పుకొచ్చిన ఆయన.. లోకేష్ మృదు స్వభావి.. కారులో బైనాక్యులర్స్ పెట్టుకుని చీమలకు కూడా హాని కలగకుండా వెళతారట అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ అమ్మనా బూతులు తిడితే పరువు నష్టం దావా వేయకూడదా? అని ప్రశ్నించారు. కంతేరులో భూమి కొన్నాడని అనటం పరువు నష్టం అయ్యిందట.. లోకేష్ పీఏ చైతన్య నాకు ఫోన్ చేశాడు.. నాకు అనారోగ్యంగా ఉందని తెలిసి పరామర్శించటానికి వస్తాను అన్నాడు.. తర్వాత పది రోజులకు ఫోన్ చేసి టీడీపీలో చేరాలని మళ్లీ ఫోన్ చేశాడని గుర్తు చేసుకున్నారు.
Also Read
- Pakistan: జపాన్లో మసీదు వివాదం.. పాకిస్తాన్ పరువు పోయిందిగా..
- YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
- Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
- Central Cabinet: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్.. తెలంగాణలో ఆ రహదారులు ఇక 4 లైన్లుగా..
ఫారిన్ అమ్మాయిలతో మందు తాగి తందనాలు ఆడిన లోకేష్ నా పై పరువు నష్టం కేసు పెడతాడా? అంటూ మండిపడ్డారు పోసాని.. చంద్రబాబు అధికారంలోకి వస్తే లోకేష్ పోస్టింగ్లు ఇస్తాడట.. లోకేష్ వాళ్ల అమ్మ భువనేశ్వరి, భార్య ఆస్తులు లోకేష్వి కావా? అని ప్రశ్నించారు. హెరిటేజ్ సంస్థ పేరుతో భూములు కొన్నది వాస్తవం కాదా? లోకేష్ కు తెలియకుండా బ్రాహ్మణి హెరిటేజ్ లో డైరెక్టర్ అయ్యిందా? అంటూ నిలదీశారు. ఇక, చంద్రబాబు ఏ వ్యవస్థను ఆయినా నాకేస్తాడు అంటూ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో అమరావతి రైతులకు పోసాని ఛాలెంజ్ విసిరారు.. మాది చాలా పేద కుటుంబం.. డబ్బులు లేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. నేను కష్టపడి పైకి వచ్చి సంపాదించాను.. నా సంపాదన అంతా పేద వాళ్లకు ఇచ్చేస్తాను.. ప్రతిఫలంగా అమరావతి రైతులు కోర్టు కేసులు వెనక్కి తీసుకుంటారా? అంటూ బహిరంగ సవాల్ విసిరారు పోసాని కృష్ణమురళి.
తాజావార్తలు
-
Pakistan: జపాన్లో మసీదు వివాదం.. పాకిస్తాన్ పరువు పోయిందిగా..
-
YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
-
Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
-
Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!