Deepika Padukone to dub in Telugu for Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీలతో పాటు విలక్షణ నటుడు కమల్హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న కల్కి […]
Telugu Actress Sunaina Ice Meditation Photos: హీరోయిన్గా రాణించాలంటే.. అందం, ఫిట్నెస్ చాలాచాలా ముఖ్యం. అందుకే ప్రతిఒక్క హీరోయిన్ అందం, ఫిట్నెస్ కోసం పడరాని పాట్లు పడుతుంటారు. నిత్యం వ్యాయామం, యోగాలు అంటూ కసరత్తులు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో చాలామంది హీరోయిన్స్ ఐస్బాత్ చేస్తున్నారు. ఒంటిలోని నరాలను బలపరచుకోవడం ఐస్బాత్ చేస్తున్నారు. అయితే తెలుగు హీరోయిన్ సునైనా బిన్నంగా ఐస్ మెడిటేషన్ చేస్తున్నారు. ఓ టబ్లో ఐస్ ముక్కల నడుమ హీరోయిన్ సునైనా […]
Sai Praneeth announces retirement from badminton: భారత షట్లర్ బీ సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని 31 ఏళ్ల ప్రణీత్ ఇన్స్టా వేదికగా వెల్లడించాడు. గత కొణతకాలంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. అమెరికాలో ఒక క్లబ్కు సేవలు అందించబోతున్నట్లు తన ప్రణీత్ వివరించాడు. ‘డియర్ బ్యాడ్మింటన్ థాంక్యూ. బ్యాడ్మింటన్తో […]
కాళేశ్వరం ఎలా కుంగిపోయిందో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతే అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీఆర్ఎస్లో తెలంగాణ సెంటిమెంట్ లేదని, ఆ పార్టీ ఇప్పుడు నిలబడటమే కష్టంగా ఉందన్నారు. కమ్యూనిస్టులు ఉంటేనే ఇండియా కూటమికి బలం అని కూనంనేని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో తమ స్నేహం కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా కమ్యూనిస్టులు ఏకం కావాలని, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ… ‘ప్రజపంథా […]
CM Revanth Reddy Speech in Adilabad: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగలన్నదే తమ విధానం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మా ప్రభుత్వం వైరుధ్యం పెట్టుకోదని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరుతున్నానన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే అని, అభివృద్ధి విషయంలో మాత్రం కాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆదిలాబాద్లో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధానికి సీఎం స్వాగతం […]
PM Modi Says My life is dedicated to the Nation: తన జీవితం ఓ తెరచిన పుస్తకం అని, దేశం కోసమే తన జీవితం అంకితం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన ఇంటిని వదిలిపెట్టి ఓ లక్ష్యం కోసం వచ్చానన్నారు. మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చడమే తన లక్ష్యం అని ప్రధాని మోడీ చెప్పారు. సోమవారం ఆదిలాబాద్లో కోట్ల విలువైన […]
PM Modi Speech in Adilabad: తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం సహకరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పేదలు, దళితుల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు చేపట్టిందని.. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలు నిదర్శనం అని అన్నారు. ఆదిలాబాద్లో రూ.7వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి […]
PM Modi unveils projects worth 56000 Crore in Telangana: తెలంగాణలో 56 వేలకోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం రామగుండం ఎన్టీపీసీ రెండో యూనిట్ను ఆరంబించారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణకు 85 శాతం విద్యుత్ సరఫరా అవుతుంది. ప్రధాని ఆరంభించిన ప్రాజెక్టులలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లతో తెలంగాణను కలిపే రెండు హైవే […]
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులను హతమార్చిన ఓ తండ్రి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత గ్రామంలో అప్పులు ఎక్కువ కావడంతో మనోవేదానికి గురైన అతడు.. పిల్లలను చంపి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో రవి (35) అనే వ్యక్తి జీఎస్ఎన్ ఫౌండేషన్ పేరుతో మనీ స్కాం […]
KTR React on LRS: మార్చి 6వ తేదీలోగా తెలంగాణ ప్రభుత్వం దిగిరాక పోతే తాము న్యాయ పోరాటం చేస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటపై కాంగ్రెస్ నేతలు ఎందుకు కట్టుబడి లేరని ప్రశ్నించారు. మార్చ్ 31 లోపు ఎల్ఆర్ఎస్ కట్టమని ఎందుకు అంటున్నారు?, 20 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై వేసేందుకు సిద్ధం అయ్యారు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ను […]