WPL 2024: ఒక పరుగు తేడాతో బెంగళూరు ఓటమి.. ప్లేఆఫ్స్కు ఢిల్లీ క్యాపిటల్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Women won by 1 run vs Royal Challengers Bangalore in WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ గెలుపొందింది. ఈ సీజన్లో ఢిల్లీకి ఇది ఐదో విజయం కాగా.. బెంగళూరుకు నాలుగో ఓటమి. 7 మ్యాచ్ల్లో 10 పాయింట్లతో ఢిల్లీ ప్లేఆఫ్స్లో ప్రవేశించింది. ఏడాది ఢిల్లీ రన్నరప్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ (29), షెఫాలీ వర్మ (23) తొలి వికెట్కు 54 పరుగులు చేశారు. స్వల్ప వ్యవధిలో లానింగ్, షెఫాలీ ఔటైనా.. ఢిల్లీ జోరు తగ్గలేదు. జెమీమా రోడ్రిగ్స్ (58; 36 బంతుల్లో 8×4, 1×6), అలీస్ క్యాప్సీ (48; 32 బంతుల్లో 8×4) చెలరేగారు. ఇద్దరు ఫోర్లు, సిక్స్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. జెమీమా 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ అందుకుంది. జెమీమా అవుట్ కావడంతో ఢిల్లీ 200 స్కోరు చేయలేకపోయింది. బెంగళూరు బౌలర్ శ్రేయంక పాటిల్ (4/26) రాణించింది.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
Also Read: Oscar Awards 2024: ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీ జూనియర్!
భారీ ఛేదనలో బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ స్మృతి మంధాన (5) నిరాశపరిచింది. ఎలీస్ పెర్రీ (49; 32 బంతుల్లో 7×4, 1×6), సోఫీ మోలనూ (33; 30 బంతుల్లో 5×4) జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరు 10.5 ఓవర్లలో రెండో వికెట్కు 89 పరుగులు జత చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో పెర్రీ, మోలనూ ఔట్ అయ్యారు. వికెట్స్ పడినా సోఫీ డివైన్ (26), రిచా ఘోష్ (51; 29 బంతుల్లో 4×4, 3×6) ధాటిగా ఆడి బెంగళూరును వెనకబడిపోకుండా చూశారు. అయితే డివైన్ ఔట్ కావడంతో ఆర్సీబీకి గట్టి దెబ్బ తగిలింది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే రిచా సిక్స్ బాదింది. తర్వాతి 3 బంతులకు 2 పరుగులే వచ్చాయి. అయిదో బంతికి రిచా సిక్స్ కొట్టడంతో చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి వచ్చింది. రిచా జోరు మీద ఉండడంతోఆర్సీబీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే చివరి బంతికి సరైన షాట్ ఆడని రిచా.. పరుగు తీసే క్రమంలో రనౌట్ అయింది. దాంతో ఢిల్లీ ఒక పరుగు తేడాతో గెలుపొందింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?