Sampath Kumar
Author- NTV Telugu-
Tirumala: మూడు రోజులు పాటు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు!
తిరుమలలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. శ్రీవారి ఆలయం వెనుక వైపున ఉన్న వసంత మండపంలో ఈ వసంతోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 11) శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రథంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వసంతోత్సవాల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను టీటీడి అధికారులు రద్దు చేశారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా సాలకట్ల వసంతోత్సవాలు […] -
YS Jagan: నేడు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ!
ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు సమావేశం కానున్నారు. కర్నూలు, నంద్యాల చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ముఖ్య నేతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల ప్రెసిడెంట్లు సమావేశంలో పాల్గొననున్నారు. వైఎస్ జగన్ నిర్వహించే సమావేశంలో కర్నూలు, నంద్యాల జిల్లాల వైసీపీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
నేడు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ముఖ్య నేతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొననున్నారు. కర్నూలు జిల్లా వైసీపీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. నేడు సదుంలో ఎంపీ మిధున్ రెడ్డి పర్యటించనున్నారు. ఎంపీడీవో ఆఫీసులో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. నేడు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగులో బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పర్యటించనున్నారు. గావ్ […] -
Priyansh Arya: నమస్కారం సర్.. నా ఇన్నింగ్స్ ఎలా ఉంది!
‘ప్రియాంశ్ ఆర్య’.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న పేరు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్పై మెరుపు సెంచరీ (103; 42 బంతుల్లో 7×4, 9×6) చేయడమే ఇందుకు కారణం. ఐపీఎల్లో ఆడిన నాలుగో మ్యాచ్లోనే సెంచరీ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్గా ప్రియాంశ్ నిలిచాడు. అంతేకాదు అత్యంత వేగవంతమైన శతకం బాదిన అన్క్యాప్డ్ ప్లేయర్గా కూడా రికార్డు నెలకొల్పాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన […] -
PBKS vs CSK: ప్రీతి జింటా సెలబ్రేషన్స్.. ఎంఎస్ ధోనీ సీరియస్ లుక్!
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్, లక్నో, చెన్నైపై గెలిచిన పంజాబ్.. రాజస్థాన్ చేతిలో మాత్రం ఓడింది. ఇక ఏప్రిల్ 12న సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో ఢీకొనేందుకు సిద్దమైంది. అయితే మంగళవారం రాత్రి చైన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కో ఓనర్, బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు సంబంధించిన ఓ సోషల్ మీడియాలో వైరల్ […] -
Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య 8 బంతులే ఆడాడు.. పంజాబ్ కోచ్ ఆసక్తికర విశేషాలు!
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 39 బంతుల్లో శతకం బాధగా.. మొత్తంగా 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్లతో 103 చేశాడు. ప్రియాంశ్ చెలరేగడంతో పంజాబ్ భారీ స్కోర్ చేసి.. విజయం సాధించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రియాంశ్ హాట్ టాపిక్ అయ్యాడు. ఎవరిని కదిలించినా.. ప్రియాంశ్ గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ప్రియాంశ్ గురించి పంజాబ్ […] -
IPL 2025: ఊసరవెల్లి అంటూ.. లైవ్ టీవీలో సిద్ధూ, రాయుడు గొడవ!
టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కాంట్రవర్సీ వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్ 2024 సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్, ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పదే పదే విమర్శలు చేసి.. ఏకంగా హత్యా బెదిరింపులకు గురయ్యాడు. ఐపీఎల్ 2025లో హార్దిక్ పాండ్యా విషయంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్కు కౌంటర్ ఇచ్చాడు. ఇది జరిగి ఓ రోజు కూడా గడవకముందే లైవ్ టీవీలో మరో మాజీ […] -
Rohit Sharma: ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం!
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్కు హిట్మ్యాన్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) పరిశీలిస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో ఎంసీఎ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత జట్టుకు చేసిన సేవలకు గాను రోహిత్ను ప్రత్యేక గౌరవంతో గుర్తించాలని ఎంసీఎ భావిస్తోంది. ఈ మేరకు ఇండియన్ ఎక్స్ప్రెస్ తమ కథనంలో పేర్కొంది. వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్, వాక్వేలకు మాజీ అధ్యక్షులు […] -
Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు తులంపై ఎంత పెరిందంటే?
మగువలకు బంగారం ధరలు భారీ షాకిచ్చాయి. గత 4-5 రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650, 24 క్యారెట్లపై రూ.710 పెరిగింది. బులియన్ మార్కెట్లో బుధవారం (ఏప్రిల్ 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,900గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.90,440గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. Also […] -
Priyansh Arya: కుర్రాడికి ఎందుకు అంత డబ్బు అన్నారు.. కట్ చేస్తే సెంచరీతో దుమ్ములేపాడు!
ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడలేదు.. దేశవాళీలో పాతిక మ్యాచ్లు కూడా ఆడలేదు.. పైగా టీ20 ఫార్మాట్లో పెద్దగా అనుభవం లేదు.. అయినా ఓ కుర్రాడిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ.3.80 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఆ సమయంలో ‘కుర్రాడికి ఎందుకు అంత డబ్బు’ అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కట్ చేస్తే.. ఐపీఎల్ 2025లో మెరుపు సెంచరీతో దుమ్ములేపాడు. ప్రస్తుతం ఆ కుర్రాడి పేరు సోషల్ […]
తాజావార్తలు
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!