Sampath Kumar
Author- NTV Telugu-
Rahul Dravid: నడవలేని స్థితిలో మైదానంలోకి రాహుల్ ద్రవిడ్.. దటీజ్ ‘ది వాల్’!
‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంకితభావానికి మారు పేరు ద్రవిడ్. ఆటగాడిగా భారత జట్టు తరఫున ఇది ఎన్నోసార్లు నిరూపించాడు. ఇప్పుడు కోచ్గానూ అదే నిబద్ధతను ప్రదర్శిస్తున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ద్రవిడ్.. గురువారం చేతి కర్రల సాయంతో టీమ్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. గాయమైన కాలికి స్పెషల్ బూట్ వేసుకుని.. కర్రల సాయంతో నడుచుకుంటూ మైదానంలోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను […] -
Delhi Capitals Captain: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా టీమిండియా ఆల్రౌండర్!
అందరూ ఊహించిందే నిజమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. అక్షర్ను కెప్టెన్గా ఎంపిక చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ తన ఎక్స్ ద్వారా తెలిపింది. ‘ఈరోజు కొత్త శకం ప్రారంభమంది’ అని పేర్కొంది. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టులో ఉన్నా.. సారథ్యం తీసుకొనేందుకు అతడు మొగ్గు చూపలేదు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా వ్యవహరించిన రిషబ్ పంత్.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్కు వెళ్లిపోయిన విషయం […] -
IND vs AUS: యువరాజ్ సింగ్ సిక్సర్ల మోత.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చిత్తు!
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (ఐఎమ్ఎల్) 2025లో ఇండియా మాస్టర్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం రాయపూర్ వేదికగా ఆస్ట్రేలియా మాస్టర్స్తో జరిగిన సెమీఫైనల్లో ఇండియా 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 221 పరుగుల ఛేదనలో ఆసీస్ 18.1 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియా తరఫున యువరాజ్ సింగ్ (59; 30 బంతుల్లో 1×4, 7×6) సిక్సర్ల మోత మోగించగా.. షాబాజ్ నదీమ్ (4/15) బంతితో మాయ చేశాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన షాబాజ్కు […] -
IPL 2025: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్పై రెండేళ్ల నిషేధం!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాక్ ఇచ్చింది. రెండేళ్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడకుండా నిషేధం విధించింది. బ్రూక్ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకోవడమే ఇందుకు కారణం. బ్రూక్పై నిషేధం ఐపీఎల్ 2025 నుంచే అమల్లోకి వస్తుంది. ఇంగ్లండ్ బ్యాటర్ 2027లో మరలా ఐపీఎల్లో ఆడవచ్చు. బీసీసీఐ ఈ విషయాన్ని ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి తెలియజేసిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ […] -
WPL 2025: ఎలిమినేటర్లో గుజరాత్ చిత్తు.. ఫైనల్లో ముంబై ఇండియన్స్!
డబ్ల్యూపీఎల్ 2025 ఎలిమినేటర్లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో గురువారం గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ ఛేదనలో గుజరాత్ 19.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ అయింది. డేనియలీ గిబ్సన్ (34; 24 బంతుల్లో 5×4, 1×6) టాప్ స్కోరర్. లిచ్ఫీల్డ్ (31; 20 బంతుల్లో 4×4, 1×6), భార్తీ ఫుల్మాలి (30; 20 బంతుల్లో 3×4, 1×6) మెరుపులు సరిపోలేదు. […] -
Virat Kohli: ఆ 14 ఏళ్ల అమ్మాయి కోహ్లీ కారణంగానే చనిపోయిందా?.. అసలు నిజం ఏంటంటే?
ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్ని ఓడించి.. మూడోసారి ట్రోఫీని అందుకుని రికార్డు సృష్టించింది. అయితే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక పరుగుకే ఔట్ అయ్యాడు. మైఖేల్ బ్రేస్వెల్ బౌలింగ్లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దాంతో విరాట్ ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కింగ్ ఔట్ అవ్వగానే ఓ 14 ఏళ్ల బాలిక గుండెపోటుకు గురై చనిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. […] -
IPL 2025: అయ్యర్ను కెప్టెన్గా ఎంపిక చేయకపోవడానికి కారణం అదే: వెంకీ
ఐపీఎల్ 2025 సీజన్కు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్గా టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేను ప్రాంచైజీ సీఈవో వెంకీ మైసూర్ నియమించారు. డాషింగ్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. 23.75 కోట్లు పెట్టి కొనుకున్న అయ్యర్ను సారథిగా ఎంపికవుతాడని ముందు నుంచి అందరూ అనుకున్నారు. అయితే సీఈవో వెంకీ అనూహ్యంగా రహానేను కెప్టెన్గా నియమించారు. భారీ మొత్తం వెచ్చించి కొనుకున్న అయ్యర్ను కెప్టెన్గా ఎంపిక చేయకపోవడంపై సీఈవో వెంకీ మైసూర్ […] -
Rohit Sharma: ఐపీఎల్ 2025 తర్వాతే రోహిత్ శర్మ నిర్ణయం!
ఇప్పటికే టీ20 ఫార్మాట్కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వన్డేలకూ గుడ్బై చెబుతాడని అంతా భావించారు. అయితే తాను రిటైర్మెంట్ తీసుకోవడం లేదంటూ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో మరో రెండేళ్ల పాటు హిట్మ్యాన్ కొనసాగే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్ 2027, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 ఫైనల్లోనూ ఆడతాడని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. వన్డే ప్రపంచకప్ తన కల అని రోహిత్ చాలాసార్లు చెప్పిన విషయం […] -
IPL 2025-Uppal Stadium: ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు.. రూ.5 కోట్లతో రినోవేషన్ పనులు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మ్యాచ్లు మార్చి 22 నుంచి ఆరంభం కానున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఈ సీజన్లో తన తొలి మ్యాచ్ను మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకొని ముమ్మర సాధన చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఐపీఎల్ కోసం ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు తీసుకొస్తోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని రూ.5 […] -
Gold Rate Today: గోల్డ్ లవర్స్కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పసిడి కనీవినీ ఎరుగని రీతిలో పెరిగి.. భారత మార్కెట్లో కొత్త రికార్డులు నెలకొల్పింది. నేటికీ బంగారం పెరుగుదల ఆగడం లేదు. ఈ క్రమంలోనే 89 వేలకు చేరువైంది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.490 పెరగగా.. నేడు రూ.600 పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.450, రూ.550 పెరిగింది. గురువారం (మార్చి 13) బులియన్ మార్కెట్లో […]
తాజావార్తలు
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!