కర్ణాటక బస్సులో ఏపీ మంత్రుల ప్రయాణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నేడు బెంగళూరులో పర్యటిస్తోంది. కర్నాటక మంత్రులు, అధికారులతో ఈ పధకం అమలు జరుగుతున్న తీరును సబ్ కమిటీ తెలుసుకుంటోంది. బెంగళూరులో ప్రధాన డిపోలను కమిటీ పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణిలు కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. సాయంత్రం 5 గంటలకు సీఎం సిద్దరామయ్యను ఏపీ మంత్రుల […]
బీసీలను గత ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తనను, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును అన్యాయంగా జైలులో పెట్టారని మండిపడ్డారు. గత ప్రభుత్వం తప్పిదం వలన అన్ని ఆగిపోయాయని విమర్శించారు. త్వరలో నాగబాబు మంత్రి వర్గంలోకి వస్తారని, ఇక మార్పులు ఉండకపోవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో రైస్ పుల్లింగ్ జరిగిందని, తప్పు చేయకపోతే పేర్ని నాని ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. కాకినాడలో ఎన్టీవీతో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… […]
ప్రతి ఆరు నెలలకు ఓసారి జాబ్ మేళా నిర్వహిస్తాం అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. తాను వార్డు స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగానని, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. జీతం తక్కువైనా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఎమ్మెల్యే పులివర్తి నాని జాబ్ మేళాను ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ డీఆర్డీఏ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతోంది. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ హామీ […]
తాడిపత్రిలో జరిగిన నూతన సంవత్సర వేడుకలు రాజకీయ రచ్చగా మారాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు మాత్రమే అంటూ నిర్వహించిన వేడుకలప్తె బీజేపీకి చెందిన యామిని శర్మ, మాధవీ లతలు చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఈ ఇద్దరు మహిళా నాయకులప్తె జేసీ వర్గీయులు విరుచుకుపడ్డారు. నియోజకవర్గ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో టీడీపీ కౌన్సీలర్లు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో జేసీ ట్రావెల్స్కు సంబంధించి బస్సు దగ్థం […]
గోదావరి జిల్లాలో రేవ్ పార్టీలు కలకలంగా మారాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రేవు పార్టీ జరిగినట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పట్టణంలోని ఓ లేఔట్లో రేవు పార్టీ జరిగినట్టుగా నెట్టింట వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో కొంతమంది మహిళలు అర్ధనగ్న దుస్తులతో డాన్సులు చేస్తుండగా.. వారి మధ్య చాలామంది మందు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలతో […]
ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటు అంశంపై సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ఆన్లైన్ విధానంలో ఈ సమీక్షకు హాజరుకానున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 1.20 గంటలకు విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం చంద్రబాబు వెళ్ళనున్నారు. ఆశ్రమంలో వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. సీఎం […]
సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి: విశాఖపట్నం తీరంలో జరిగిన నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం (జనవరి 4) జరగనున్న నౌకాదళ వేడుకల సందర్భంగా.. అధికారులు గురువారం పూర్తిస్థాయి సన్నాహక విన్యాసాలు నిర్వహించారు. విమానాల నుంచి ప్యారాచూట్ల ద్వారా నావికులు దిగుతున్న క్రమంలో.. గాలి అనుకూలించకపోవడంతో రెండు ప్యారాచూట్ల ఒకదానికొకటి చిక్కుకున్నాయి. దీంతో పట్టుకోల్పోయిన ఇద్దరు నావికులు సముద్రంలో పడిపోయారు. అప్పటికే విశాఖ సముద్రంలో ఉన్న జెమినీ బోట్ల సిబ్బంది.. ఇద్దరు నావికులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. […]
విశాఖపట్నం తీరంలో జరిగిన నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం (జనవరి 4) జరగనున్న నౌకాదళ వేడుకల సందర్భంగా.. అధికారులు గురువారం పూర్తిస్థాయి సన్నాహక విన్యాసాలు నిర్వహించారు. విమానాల నుంచి ప్యారాచూట్ల ద్వారా నావికులు దిగుతున్న క్రమంలో.. గాలి అనుకూలించకపోవడంతో రెండు ప్యారాచూట్ల ఒకదానికొకటి చిక్కుకున్నాయి. దీంతో పట్టుకోల్పోయిన ఇద్దరు నావికులు సముద్రంలో పడిపోయారు. అప్పటికే విశాఖ సముద్రంలో ఉన్న జెమినీ బోట్ల సిబ్బంది.. ఇద్దరు నావికులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. నావికులు సురక్షితంగా బయటపడడంతో […]
ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మెనేజ్మెంట్ కళాశాల కామర్స్ ప్రొపెసర్ జాస్తి రవి కుమార్ శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం వీసీ ప్రొ. ఉమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొపెసర్ రవి కుమార్ ప్రస్తుతం ఓయూ జిల్లా పీజీ కేంద్రాల డెరైక్టర్గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా, యుఎఫ్ఆర్ఓ డెరైక్టర్గా, సీడీఈ జాయింట్ డెరైక్టర్గా, పరీక్షల విభాగం ఆడిషినల్ కంట్రోలర్గా, సెంటినరి ఉత్సవాల కోఆర్డినేటర్గా బాధ్యతలు […]
అందరూ అనుకున్నదే నిజమైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్టులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు స్థానం దక్కలేదు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతోన్న రోహిత్కు మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. దాంతో ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఐదవ టెస్టులో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు బుమ్రా చెప్పాడు. శుభ్మన్ గిల్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు. రోహిత్ స్థానంలో గిల్, ఆకాష్ దీప్ […]