Sampath Kumar
Author- NTV Telugu-
Anantapur Crime: అనంతపురంలో దారుణం.. డిప్యూటీ తాహసీల్దార్ భార్య, కుమారుడు మృతి!
అనంతపురం నగరంలోని శారద నగర్లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా రామగిరి డిప్యూటీ తాహసీల్దార్ భార్య, కుమారుడు ఇద్దరు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. మూడున్నర ఏళ్ల బాలుడు సహర్షను తల్లి అమూల్య గొంతు కోసి చంపింది. కుమారుడిని హత్య చేశాక ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అనంతపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నారు. Also Read: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక […] -
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం!
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ3 సత్యప్రసాద్లు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో ఏసీబీ కోర్టులో ఈ ఇద్దరు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయగా.. కోర్టు డిస్మిస్ చేయటంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో ఈ ఇద్దరికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. […] -
Daily Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
సింహ రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. దూర ప్రాంతాల నుంచి కొన్ని శుభవార్తలు అందుతుంటాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సింహ రాశి వారికి కలిసొచ్చే దైవం శ్రీ పాండురంగ స్వామి వారు. నామ రామాయణంను పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారి సైనా ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు మీకు […] -
CM Chandrababu: రాజధాని రైతులతో సీఎం సమావేశం.. సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చే అవకాశం!
ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఏపీ సచివాలయంలో అమరావతి రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సచివాలయం ఐదో బ్లాక్లోని కాన్ఫెరెన్స్ హాల్లో వంద మంది రైతులతో సీఎం సమావేశమవ్వనున్నారు. రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై చంద్రబాబు చర్చించనున్నారు. రైతుల సమావేశంలో సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైతులకు ప్లాట్లు కేటాయింపు, జరీబు-మెట్ట భూములు, ఎసైన్డ్ భూములకు సంబంధించి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు […] -
Moto G57 Power Launch: 7000mAh బ్యాటరీ, 50MP AI కెమెరా.. 13 వేలకే మోటరోలా సూపర్ స్మార్ట్ఫోన్!
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘మోటోరొలా’ మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘మోటో జీ57 పవర్’ 5జీ పేరిట భారతదేశంలో లాంచ్ చేసింది. రూ.15 వేల లోపు బడ్జెట్లో ఈ ఫోన్ను తీసుకురావడం ప్రత్యేకం. ఈ ఫోన్ ప్రత్యేకంగా పవర్ యూజర్లు, దీర్ఘకాలిక గేమర్ల కోసం రూపొందించబడింది. మోటో జీ57 పవర్లో హైలైట్ ఏంటంటే.. 7000mAh బ్యాటరీ ఉండడం. ఇంత తక్కువ బడ్జెట్ ఫోన్లో కంపెనీ బిగ్ బ్యాటరీని ఇవ్వడం విశేషం. మోటో […] -
Sree Vishnu: ఇక సపోర్ట్ చేయం.. మరువ తరమా హీరోపై శ్రీ విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు!
హరిష్ ధనుంజయ.. నువ్ ఇంకా చిన్నోడివి కాదని, ఇంకొన్నాళ్లు పొతే మేము సపోర్ట్ చేయం అని హీరో శ్రీ విష్ణు సరదాగా అన్నారు. హరీష్కి మంచి టైమింగ్ ఉంటుందని, సరైన సినిమా పడితే ఎక్కడికో వెళ్లిపోతాడన్నారు. హరీష్ మొన్నటివరకు స్లోగా సినిమాలు చేశాడని, ఇకపై చాలా వేగంగా మూవీస్ చేయాలని కోరుకుంటున్నానన్నారు. హరీష్ 10 ఏళ్లుగా తనకు తెలుసని, ‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వస్తావా? రావా? అని సెట్టుకు వచ్చి కూర్చున్నాడని శ్రీ విష్ణు […] -
Maruva Tarama: ‘మరువ తరమా’ టీజర్, ట్రైలర్ చాలా నచ్చాయి.. ఏపీ డిప్యూటీ స్పీకర్!
కొత్త డైరెక్టర్ చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మరువ తరమా’. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్.వి. విజయ్కుమార్ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో హరిష్ ధనుంజయ హీరోగా నటించగా.. అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా కథానాయికలుగా నటించారు. ఈ మూవీ నవంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ […] -
Google Pixel 8a Offers: ఆఫర్లు బాబోయ్ ఆఫర్లు.. 53 వేల గూగుల్ పిక్సెల్ ఫోన్ 2 వేలకే!
మీరు కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో జరుగుతున్న సేల్ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ను నిర్వహిస్తోంది. నవంబర్ 23న మొదలైన ఈ సేల్ నవంబర్ 28 వరకు కొనసాగనుంది. ఈ సేల్లో శామ్సంగ్, ఎంఐ, ఒప్పో, రియల్మీ, మోటో, గూగుల్ పిక్సెల్ సహా ఇతర బ్రాండ్ల ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్పై మంచి ఆఫర్లు ఉన్నాయి. 53 […] -
WPL 2026 Auction: నేడు 2026 డబ్ల్యూపీఎల్ వేలం.. ఆ ఇద్దరు భారత స్టార్స్కు డబ్బే డబ్బు!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 వేలానికి రంగం సిద్ధమైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈరోజు వేలం జరగనుంది. మధ్యాహ్నం 3:30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐదు ఫ్రాంచైజీల్లో 73 స్థానాల కోసం 277 మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. 194 మంది భారత ప్లేయర్లలో 52 మంది క్యాప్డ్, 142 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. 66 మంది విదేశీ క్యాప్డ్ ప్లేయర్స్, 17 మంది విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్స్ […] -
Gautam Gambhir: ముగ్గురు దిగ్గజాలను తప్పించాడు.. గంభీర్ కూడా తప్పుకోవాలి కదా?
ఏడాది వ్యవధిలో సొంతగడ్డపై భారత్కు రెండు వైట్వాష్ పరాభవాలు ఎదురయ్యాయి. గతేడాది నవంబర్లో న్యూజిలాండ్ చేతిలో 0-3తో టెస్టు సిరీస్ ఓడిపోవడం భారత క్రికెట్ చరిత్రలోనే ఓ మాయని మచ్చ. ఏడాది తిరిగాక అదే నవంబర్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 0-2తో వైట్ వాష్కు గురైంది. సఫారీలతో తొలి టెస్టులో స్వల్ప తేడాతో ఓడిపోయినా.. రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఓడడం మాత్రం దారుణం అనే చెప్పాలి. 12 ఏళ్ల పాటు సొంతగడ్డపై ఒక్క […]
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!