WPL 2026 Auction: నేడు 2026 డబ్ల్యూపీఎల్ వేలం.. ఆ ఇద్దరు భారత స్టార్స్కు డబ్బే డబ్బు!
- డబ్ల్యూపీఎల్ 2026 వేలంకు రంగం సిద్ధం
- 73 స్థానాల కోసం 277 మంది ప్లేయర్లు
- ఇద్దరు భారత స్టార్స్కు డబ్బే డబ్బు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 వేలానికి రంగం సిద్ధమైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈరోజు వేలం జరగనుంది. మధ్యాహ్నం 3:30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐదు ఫ్రాంచైజీల్లో 73 స్థానాల కోసం 277 మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. 194 మంది భారత ప్లేయర్లలో 52 మంది క్యాప్డ్, 142 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. 66 మంది విదేశీ క్యాప్డ్ ప్లేయర్స్, 17 మంది విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్స్ వేలంలో ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు 23 స్థానాల కోసం పోటీ పడనున్నారు. ఒక్కో జట్టు కనిష్టంగా 15 మందిని, గరిష్టంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చు.
డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో మార్క్యూ క్రీడాకారులు ఉన్నారు. భారతదేశానికి చెందిన దీప్తి శర్మ, రేణుకా సింగ్ లపై కాసుల వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరు ఐసీసీ 2025 మహిళల వన్డే ప్రపంచకప్లో రాణించారు. ముఖ్యంగా ఆల్రౌండర్ దీప్తి కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడొచ్చు. ప్రపంచకప్లో ఆడిన క్రాంతి గౌడ్, హర్లీన్ డియోల్, శ్రీ చరణి, ప్రతీక రావల్కు కూడా మంచి ధర పలికే అవకాశాలు ఉన్నాయి. స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్ కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీపడొచ్చు. అలానే విదేశీ ప్లేయర్స్ సోఫీ డివైన్, అమేలియా కెర్, ఎక్లెస్టోన్, మెగ్ లాన్నింగ్, లారా వోల్వార్డ్ట్, అలిస్సా హీలీలకు కూడా భారీ డిమాండ్ ఉండనుంది.
Also Read
- Vaibhav Vs Jaiswal: వైభవ్ సూర్యవంశీ వల్లే జైస్వాల్ ఫ్లాప్.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
- Hardik Pandya: MI వీడి చెన్నై సూపర్ కింగ్స్లోకి హార్దిక్ పాండ్యా.. 07:07 టైమ్పై సోషల్ మీడియాలో చర్చ..
- Venkatesh Iyer: సడన్గా వెంకటేశ్ అయ్యర్కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో కోహ్లీతో ఓపెనర్గా రంగంలోకి..
- Team India: జూన్లో టీమ్ ఇండియా బిజీ బిజీ.. టెస్టులు, టీ20లు, వన్డేలతో సహా ఆరు అంతర్జాతీయ మ్యాచ్లు!
Also Read: Gautam Gambhir: ముగ్గురు దిగ్గజాలను తప్పించాడు.. గంభీర్ కూడా తప్పుకోవాలి కదా?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 వేలం పట్టికలో అత్యధిక పర్స్ ఉన్న జట్టుగా యూపీ వారియర్స్ ఉంది. యూపీ వద్ద రూ.14.5 కోట్లు ఉన్నాయి. గుజరాత్ జెయింట్స్ వద్ద రూ.9 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.6.15 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ.5.75 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.5.7 కోట్లు ఉన్నాయి. వేలంలో యూపీ 17 స్లాట్లకు బిడ్ వేయనుంది. ఇందులో కనీసం ఐదుగురు విదేశీ ఆటగాళ్లు ఉంటారు. గుజరాత్ 16 స్లాట్లను కలిగి ఉండగా.. ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు స్థలం ఉంటుంది. ఆర్సీబీ 14 స్లాట్లు మిగిలి ఉండగా.. కనీసం నలుగురు విదేశీ ఆటగాళ్లు అవసరం. ఢిల్లీ, ముంబై ఒక్కొక్కటి 13 స్లాట్లను కలిగి ఉండగా.. విదేశీ ఆటగాళ్లకు నాలుగు స్లాట్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Water Tank Cleaning : వాటర్ ట్యాంక్లో చేపల వాసన వస్తోందా? ఈ ట్రిక్ ట్రై చేయండి.!
-
Peddi : ‘పెద్ది’ ఐటం సాంగ్.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది
-
ASUS VM441 AiO: ఆసుస్ నుంచి కొత్త AI డెస్క్టాప్.. ఆసుస్ VM441 AiO భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Family Planning : ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ఈ టెస్టులు మస్ట్!
-
Vaibhav Vs Jaiswal: వైభవ్ సూర్యవంశీ వల్లే జైస్వాల్ ఫ్లాప్.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?