TG SSC Halltickets Download Link: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థులకు విద్యాశాఖ తీపికబురు అందించింది. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న SSC పబ్లిక్ పరీక్షల హాల్ టిక్కెట్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE) అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఈ ఏడాది విద్యార్థుల సౌకర్యార్థం సాంకేతికతను జోడించి, హాల్ టిక్కెట్లను పొందే ప్రక్రియను మరింత […]
మానవత్వం ముసుగులో వచ్చి మాయమాటలతో మోసగించే ముఠాలు కోనసీమ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. సాయం చేయడానికి వెళ్లిన ఒక వృద్ధుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ఇద్దరు యువకులు ఆయన పెన్షన్ సొమ్మును తస్కరించిన ఘటన అమలాపురంలో చోటుచేసుకుంది. అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన చవటపల్లి సత్యనారాయణ (80) అనే విశ్రాంత ఉపాధ్యాయుడు, తన నెలవారీ పెన్షన్ సొమ్ము రూ. 20,000లను బ్యాంకు నుండి విత్ డ్రా చేసుకున్నారు. ఆయన డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తున్న సమయం నుండే […]
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణం అయిపోయాయి. అయితే, ఉదయం లేవగానే మనం అనుసరించే కొన్ని చిన్న మార్పులు మెదడును ప్రశాంతంగా ఉంచి, రోజంతా సానుకూల దృక్పథంతో ఉండేలా చేస్తాయి. దీని కోసం ప్రముఖ నిపుణులు ఆరు సూత్రాలను వివరించారు. 1. ఫోన్కు దూరంగా ఉండండి (Digital Detox) ఉదయం లేవగానే నోటిఫికేషన్లు, మెయిల్స్ లేదా సోషల్ మీడియా చూడటం వల్ల మెదడుపై వెంటనే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే కనీసం మొదటి 30 నిమిషాల […]
తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉత్కంఠకు తెరపడింది. అధికార కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్రెడ్డి పేరును అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. వీరు రేపు (గురువారం) తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను […]
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దేశ రాజధానిలో జరిగిన ఈ సమావేశం సుమారు గంటకు పైగా కొనసాగింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ , మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణపై ఈ భేటీలో కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని మావోయిస్టుల అంశం చర్చకు వచ్చింది. మావోయిస్టుల లొంగుబాటు (Surrender) , వారికి పునరావాసం కల్పించే అంశాలపై ఇరువురు నేతలు […]
Tata Sierra : భారతీయ కార్ల చరిత్రలో ‘టాటా సియెర్రా’కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 90వ దశకంలో అడ్వెంచర్ , స్టైల్కు మారుపేరుగా నిలిచిన ఈ కారును గుర్తుచేస్తూ, ‘డెల్లీ వాచ్ కంపెనీ’ (DWC) ఒక అద్భుతమైన టైమ్పీస్ను రూపొందించింది. ఈ వాచ్ డిజైన్ , ఫీచర్లు కారు పాత జ్ఞాపకాలను నెమరువేసేలా ఉన్నాయి. కారు డిజైన్తో కూడిన వాచ్ ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ను చూస్తే టాటా సియెర్రా కారు గుర్తుకు రావడం ఖాయం. […]
తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. అభ్యర్థుల ఎంపికపై బుధవారం కాంగ్రెస్ అధిష్టానం కీలకమైన జూమ్ మీటింగ్ను నిర్వహించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు ఆశావహుల పేర్లు చర్చకు వచ్చినప్పటికీ, ఇద్దరి పేర్లు ప్రముఖంగా […]
బీజేపీ హైకమాండ్ తీరుపై తెలంగాణ నేతలు గుర్రుగా ఉన్నారా? ఎంత చేసినా ఇంతేనా అని నిష్టూరంగా మాట్లాడుతున్నారా? ఏం… మాకేం తక్కువ, ఎందుకిలా చిన్నచూపు చూస్తున్నారంటూ ఒకింత నిలదీత స్వరం వినిపిస్తున్నారా? ఇంతకీ… ఏ విషయంలో టీజీ బీజేపీ నాయకులకు ఢిల్లీ పెద్దల మీద కోపం వస్తోంది? 8మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్ర నాయకులు ఏం కోరుకుంటున్నారు? నామినేటెడ్ పదవుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. పార్టీ కేంద్రంలో అధికారంలోకి […]
ఎండలు తీవ్రమవుతున్న వేళ మన శరీరం చెమట రూపంలో అధికంగా నీటిని , లవణాలను కోల్పోతుంది. మనం కోల్పోయిన నీటిని తిరిగి అందించకపోతే డీహైడ్రేషన్ బారిన పడతాం. చాలామంది దాహం వేసే వరకు నీరు తాగరు, కానీ దాహం వేయడమే డీహైడ్రేషన్ ప్రారంభమైందని చెప్పే మొదటి సంకేతం. శరీరంలో నీటి శాతం తగ్గిందని తెలిపే ఇతర ముఖ్యమైన లక్షణాలను డాక్టర్ సునీల్ బోహ్రా వివరించారు. డీహైడ్రేషన్ను గుర్తించే ముఖ్య లక్షణాలు శరీరంలో నీరు తగ్గినప్పుడు కనిపించే మొదటి […]
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెత ఆ టెంపుల్కు పర్ఫెక్ట్గా సరిపోతుందా? తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్నాక కూడా ఏడాదిగా అడుగు ముందుకు పడకపోవడానికి కారణం ఏంటి? ఆ…. ఏముంది… ఆలయ పాలకమండలేగా, అంతా మంచి నీళ్ళ ప్రాయం అనుకున్న చోట కత్తి మీద సాము ఎందుకు చేయాల్సి వస్తోంది? ఏ టెంపుల్ విషయంలో అంతలా పీటముడి పడింది? ఎందుకు పడింది? యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలన్న […]