Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్లో సందడి.!
- లక్ష్మీస్ ఎంపీరియాలో ఘనంగా 5K రన్ నిర్వహణ
- యోగా దినోత్సవం, ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
- మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ జెండా ఊపి ప్రారంభం
- వర్షంలోనూ ఉత్సాహంగా పాల్గొన్న కమ్యూనిటీ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshmis Empiria : ప్రపంచ యోగా దినోత్సవం , ఫాదర్స్ డే (తండ్రుల దినోత్సవం) పురస్కరించుకుని మియాపూర్లోని ‘లక్ష్మీస్ ఎంపీరియా’ కమ్యూనిటీ ఆధ్వర్యంలో 5కే రన్ (5K Run) కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. సమాజంలో ఆరోగ్యం, ఫిట్నెస్ , పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ పరుగును చేపట్టారు. లక్ష్మీస్ ఎంపీరియా కమ్యూనిటీ ప్రెసిడెంట్ శ్రీను ముప్పరాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
జెండా ఊపి ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్
ఈ 5కే రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ హాజరయ్యారు. ఆయన జెండా ఊపి పరుగును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యంపై సమాజంలో అవగాహన పెంపొందించడం అందరి బాధ్యతని గుర్తు చేశారు. ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమేనని, పచ్చదనాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
వర్షాన్ని సైతం లెక్కచేయని రన్నర్స్
ఈ అవగాహన పరుగులో కమ్యూనిటీకి చెందిన చిన్నారులు, యువత, మహిళలు , వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహపరిచారు. కార్యక్రమం జరిగే సమయంలో వర్షపు వాతావరణం ఉన్నప్పటికీ, రన్నర్స్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎంతో జోష్తో పరుగెత్తారు. వాతావరణం ఎలా ఉన్నా ఆరోగ్యకరమైన జీవన విధానానికి తాము ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తామంటూ అందరూ ఉత్సాహంగా ముందుకు సాగారు.
ఘనంగా సహకరించిన స్పాన్సర్లు
ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావడానికి పలు ప్రముఖ విద్యా, వైద్య, ఆర్థిక సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరించి తమ పూర్తి సహకారాన్ని అందించాయి. ఇందులో ప్లాటినమ్ స్కూల్స్ (మయూరి నగర్), కాల్షియం హాస్పిటల్ (హైదర్నగర్), యాక్సిస్ బ్యాంక్ (జేపీ నగర్ శాఖ), ఎస్బీఐ (మయూరి నగర్), శ్రీకార జూనియర్ కాలేజ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ (మియాపూర్), లక్ష్మీ ఇన్ఫ్రా , క్యాస్కేడ్స్ ది నియోపోలిస్ (కోకాపేట్) సంస్థలు ఉన్నాయి. కమ్యూనిటీ సభ్యులంతా కలిసికట్టుగా పాల్గొనడంతో ఈ 5కే రన్ గ్రాండ్ సక్సెస్ అయింది.
తాజావార్తలు
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
-
Shwetha Menon: మలయాళ ‘అమ్మ’లో సంక్షోభం.. అధ్యక్షురాలు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!