వాటికన్ సిటీలో పర్యటనలో భారత రాష్ట్రపతి. నేడు పోప్ ఫ్రావిన్స్ అంత్యక్రియల్లో భారత్ తరుఫున పాల్గొననున్న ద్రౌపది ముర్ము. నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ఎచ్చర్లలో మత్స్యకార భృతి పంపిణీ చేయనున్న చంద్రబాబు. మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున సాయం. 1,29,178 మత్య్సకార కుటుంబాలకు లబ్ధి. నేడు కాకినాడలో మంత్రి బీసీ జనార్థన్రెడ్డి పర్యటన. యాంకరేజ్ పోర్ట్, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ పరిశీలించనున్న మంత్రి. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న మంత్రి జనార్థన్రెడ్డి. […]
Jagadish Reddy : కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఎస్ఏ (NDSA) నివేదికను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆయన వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్ల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27న జరగబోయే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. మేము బీఆర్ఎస్ రజతోత్సవ సభగా ప్రకటించామని, కానీ ప్రజలు దీన్ని కాంగ్రెస్ పార్టీ పాలనపై వ్యతిరేకతగా చూస్తున్నారని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సభ పార్టీ […]
Liquor : నిత్యం ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల్లో కల్తీని చూస్తున్న ప్రజలకు, చివరకు మద్యం కూడా కల్తీ అవుతోందన్న వార్త షాక్కు గురిచేస్తోంది. తాజాగా, లింగంపల్లి ప్రాంతంలో ఒక బార్లో అక్రమంగా మద్యాన్ని కల్తీ చేస్తూ ఉండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఉన్న ట్రూప్స్ బార్ యొక్క లైసెన్స్ […]
బెజవాడలో 10 మంది ఉగ్రవాదులు?.. ఉగ్ర కదలికలపై పోలీసుల ఆరా.. బెజవాడలో ఉగ్ర కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సిమి(SIMI) సానుభూతి పరుల గురించి 2 నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాల నుంచి బెజవాడ పోలీసులకు సమాచారం అందింది. కేంద్ర నిఘా సంస్థ నలుగురు అనుమానితులు గురించి సమాచారం ఇచ్చింది. మరో ఆరుగురు అనుమానితులను స్థానిక పోలీసులు గుర్తించారు. మొత్తం 10 మంది కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. 10 మంది గొల్లపూడి, అశోక్ నగర్, […]
Bharat Summit : పెట్టుబడులు, న్యాయం, ప్రపంచ శాంతి, అహింస అనే మహత్తర లక్ష్యాలతో ప్రతిష్టాత్మక భారత్ సమ్మిట్ – 2025 నేడు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ), నోవాటెల్లో రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ సమ్మిట్కు విచ్చేసిన వివిధ దేశాల ప్రతినిధులకు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అపూర్వ […]
Asaduddin Owaisi : పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. అయితే, ఆ నీటిని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిల్వ చేస్తుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం, ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. “బైసరన్ మైదానంలో సీఆర్పీఎఫ్ జవాన్లను ఎందుకు మోహరించలేదు? దాడి జరిగిన తర్వాత అక్కడికి చేరుకోవడానికి ఎందుకు ఆలస్యమైంది?” అని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదులు మతం […]
CM Renvanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో జరుగుతున్న ఓ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలన్న ఆదేశాల నుంచి హైకోర్టు ఆయనకు మినహాయింపునిచ్చింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ఎక్సైజ్ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి అధికారిక కార్యక్రమాల వల్ల కోర్టుకు హాజరుకావడం సాధ్యం కాదని ఆయన తరఫు న్యాయవాదులు […]
Supspend : హైదరాబాద్ బాలానగర్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు. అవినీతి ఆరోపణలతో ఎస్ఐను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు. ఎస్ఐ లక్ష్మీనారాయణపై పలు అవినీతి అరోపణలు. ఓ మహిళ కేసు విషయంలో ముగ్గురిని అకారణంగా కొట్టినట్లు ఆరోపణలు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లో బాధితుల ఫిర్యాదు. హైదరాబాద్లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు […]
Goutham Rao : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌతమ్ రావు ఓటమి అనంతరం తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తన కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకుందని ఆరోపిస్తూ, ఎలక్షన్ కమిషన్ ముందు ఈ విషయాన్ని ఉంచనున్నట్లు తెలిపారు. “ఓటు వేయొద్దని మీ పార్టీ నేతలే చెబితే, మీరు రేపు ప్రజలను ఓటు వేయమని ఎలా అడుగుతారు?” అని ప్రశ్నించారు గౌతమ్ రావు. అలాగే, ఎంఐఎం […]
ఎట్టకేలకు సొంతగడ్డపై విజయం.. ప్లేఆఫ్స్కు చేరువైన ఆర్సీబీ! ఐపీఎల్ 2025లో ఎట్టకేలకు సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు రుచిని చవిచూసింది. 18వ సీజన్లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల ఛేదనలో రాజస్థాన్ 9 వికెట్లకు 194 పరుగులే చేయలిగింది. ఐపీఎల్ 2025లో ఆరో విజయంను ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరువైంది. మరో రెండు విజయాలు సాధిస్తే […]