Gogikar Sai Krishna
Author- NTV Telugu-
రాజేంద్రనగర్లో దోపిడీ దొంగల హల్ హల్
రాజేంద్ర నగర్లోని కాటేదాన్ లో దోపిడీ దొంగల గ్యాంగ్ హల్ హల్ సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓల్డ్ కర్నూల్ రోడ్డు వద్ద యాసిన్ అనే ఆటో డ్రైవర్కు తుపాకీ చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు లోనై యాసిన్ ఆటోను విడిచిపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో యాసిన్ వెంటబడ్డ దొంగల ముఠా అతనిపై దాడి చేసి రూ.3200లతో పాటు అతని మొబైల్ ఫోన్ లాక్కొని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు యాసిన్ వెంటనే మైలార్దేవ్పల్లి పోలీసులకు […] -
ప్రమాదపు అంచుల్లో సహజ సంజీవని.. కాపాడుకుందాం :టీఎస్ ప్రభుత్వం
సహజ సంజీవని, కల్పతరువు, ఆరోగ్య ప్రదాత, ఆరోగ్య మంజరి ఇలా ఎన్నో పేర్లు ఉన్న వేప చెట్టు ఇప్పుడు ప్రమాదపు అంచుల్లో ఉందని.. దానిని కాపాడుకుందామని పిలుపునిచ్చింది తెలంగాణ సర్కార్. వేపచెట్లకు డై బ్యాక్ వ్యాధి సోకి చనిపోతున్నాయని ఈ మేరకు వ్యవసాయ శాఖ తెలిపింది. ఫోమోప్సిస్ అజాడరిక్టే అనే శిలింద్రం సోకడ వల్ల ఇలా జరుగుతోందని వెల్లడించింది. రైతులు, ప్రజలు ఇంటిలో, పంటపొలాల వద్ద ఉన్న వేపచెట్టుకు ఈ వ్యాధి సోకకుండా బాధ్యతయుతంగా వ్యవహరించాలన్నారు. వేప […] -
ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన నక్కలకాలనీ..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చంద్రగిరి,పాకాల మండలాల్లో వర్ష భీభత్సం సృష్టించింది. నక్కలేరు వాగు ప్రవాహంతో కొత్తనెన్నూరు గ్రామం ప్రమాదంలో చిక్కుకుంది. పంటపొలాలను ముంచెత్తుతూ ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామచంద్రాపురం నుంచి తిరుపతికి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిరుచానూరు సమీపంలోని నక్కలకాలనీ నీట మునిగింది. దీంతో షికారీలు జాతీయ […] -
వేడి వేడి వెల్లుల్లి టీ తో ఆరోగ్యం అదుర్స్..
మంచుకురిసే వేళలో.. ఉదయాన్నే ఓ కప్పు టీయో, కాఫీయో తాగితే ఆ అనుభూతి గురించి టీ, కాఫీ తాగేవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఉదయం మనం తాగే టీ, కాఫీ కంటే వెల్లుల్లి టీ ఎంతో బెస్ట్ అంటున్నారు నిపుణులు. ప్రతి రోజు ఒక్క కప్పు వెల్లుల్లి టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. వెల్లుల్లిని మనం రోజు వంటలో ఉపయోగిస్తుంటాం. వెల్లుల్లి.. వంటకే ప్రత్యేక రుచిని తెస్తుంది. అలాగే వెల్లుల్లి టీ కూడా ప్రత్యేకమైన […] -
రెడ్ అలర్ట్ : చెన్నైను ముంచ్చెత్తుతున్న వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం వాయుగుండంగా మారి చెన్నైపై తన ప్రభావాన్ని చూపెడుతోంది. ఇప్పటికీ 10 రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షాలు కురియడంతో తమిళనాడులోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు సీఎం ఎంకే స్టాలిన్ చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన సంప్రదించాలని సూచిస్తూ.. కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంట్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు […] -
18వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. 45 రోజుల పాటు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ ఈ మహాపాదయాత్రం సాగనుంది. అయితే నేడు 18వ రోజు ప్రకాశం జిల్లా గుడ్లూరులో మహాపాదయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం నెల్లూరు జిల్లా రాజువారి చింతలపాలెం వద్ద నేటి పాదయాత్ర ముగియనుంది. 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్ర డిసెంబర్ 15న తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలో భారీ వర్షాలు […] -
నేడే ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా..
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహాధర్నాకు పిలుపు నిచ్చిన విషయం తెలసిందే… ఈ నేపథ్యంలో నేడు ఇందిరాపార్క్ వద్ద భారీ ఎత్తున్న టీఆర్ఎస్ శ్రేణులతో మహాధర్నా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ధర్నా ముగిసిన తర్వాత రాజ్ భవన్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందిరా పార్కు నుంచి పాదయాత్రగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు.. అయితే కేంద్ర ప్రభుత్వం […] -
చంద్రబాబు స్వీయ తప్పిదాలే టీడీపీ పతనానికి కారణం : మంత్రి కన్నబాబు
నేడు ఏపీలో నెల్లూరు కార్పోరేషన్తో పాటు పెండింగ్లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వైసీపీ జెండా ఎగరవేసింది. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో కూడా వైసీపీ తన సత్తా చాటింది. ఈ నేపథ్యంలో మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు స్వీయ తప్పిదాలే టీడీపీ పతనానికి కారణమని ఆరోపించారు. చంద్రబాబు అమరావతి ఒక్కటే తన ఎజెండా అనుకున్నారని, అందుకే మిగతా ప్రాంతాల ప్రజలు తగిన బుద్ధి […] -
ఆ సమస్యను సీఎం ముందు పెట్టిన టీచర్లు.. షాక్లో సీఎం..
మామూలుగా రాష్ట్ర ముఖ్యమంత్రులు బహిరంగ సభలు నిర్వహించడం పరిపాటే. అయితే అప్పుడప్పుడు వారి ముందే కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ఆ సమయంలో ఏ విధంగా స్పందించాలో తెలియక తెల్లముఖం వేసే సందర్భాలు చాలానే ఉంటాయి. అలాంటి ఘటనే ఇది.. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్కు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఓ సభలో పాల్గొన్న సీఎం అశోక్ టీచర్లకు ఏమైనా సమస్యలు ఉన్నాయా..? అని అడిగారు. దీనికి సమాధానంగా ఓ ఉపాధ్యాయుడు లేచి […] -
దర్శిలో టీడీపీ విజయ కేతనం..
ఏపీలో నెల్లూరు కార్పోరేషన్తో పాటు పెండింగ్లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు పోలింగ్ జరిగిన విషయం తెలసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తాజాగా ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ని టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ-టీడీపీ మధ్య హోరాహోరీగా ఎన్నికల పోరు సాగింది. మొత్తం 20 వార్డులకు గాను టీడీపీ 13 వార్డులు గెలుచుకొని దర్శి నగర పంచాయతీ చైర్మన్ […]
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!