Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
- ధాన్య సేకరణలో తెలంగాణ రికార్డు
- 150 లక్షల టన్నుల వరి కొనుగోలు
- రైతులకు రూ.35,537 కోట్ల చెల్లింపులు
- 48–72 గంటల్లోనే డబ్బుల జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Record : తెలంగాణ రాష్ట్రం మరోసారి తనను తాను ‘భారతదేశపు అన్నపూర్ణ’గా నిరూపించుకుంది. అకుంఠిత దీక్ష, పటిష్టమైన ప్రణాళికలతో ఈ ఏడాది ధాన్య సేకరణలో గత రికార్డులన్నింటినీ బద్ధలుకొడుతూ అసాధారణమైన ప్రగతిని సాధించింది. అన్నదాతల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తూ, వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త చరిత్రను లిఖించింది.
రికార్డు స్థాయిలో 150 లక్షల టన్నుల వరి కొనుగోలు
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఏకంగా 150 లక్షల టన్నుల వరిని సేకరించి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ భారీ కొనుగోళ్ల ద్వారా లబ్ధి పొందిన 26.43 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 35,537 కోట్ల భారీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా జమ చేసింది. ఐదు పైసల అవినీతికి కూడా తావులేకుండా, దళారీల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద మొత్తాన్ని రైతుల అకౌంట్లలోకి చేర్చడం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం.
Also Read
8,575 కొనుగోలు కేంద్రాలతో పటిష్టమైన వ్యవస్థ
ఈ చారిత్రాత్మక ఘనవిజయానికి వెనుక రైతు సంక్షేమంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, పక్కా ప్రణాళికే ప్రధాన కారణం. రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని మారుమూల రైతులకు సైతం అందుబాటులో ఉండేలా ఈ సమగ్ర వ్యవస్థను తీర్చిదిద్దారు.
కేవలం 48 – 72 గంటల్లోనే శరవేగంగా చెల్లింపులు
వరి కొనుగోలు ప్రక్రియ కేవలం సేకరించడంతోనే ఆగిపోకుండా.. రవాణా, నిల్వ, మిల్లింగ్, , తుది చెల్లింపుల వరకు ప్రతి ఒక్క దశలోనూ వివిధ ప్రభుత్వ విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేశాయి. ఈ పటిష్టమైన నెట్వర్క్ కారణంగా రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన కేవలం 48 నుండి 72 గంటల వ్యవధిలోనే వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయి. గతంలో నెలల తరబడి డబ్బుల కోసం ఎదురుచూసిన రైతులకు ఈ శరవేగపు చెల్లింపుల వ్యవస్థ ఎంతో ఊరటనిచ్చింది.
“రైతుకు జరిగే మేలే తెలంగాణ సుభిక్షానికి సూచకం” అనే బలమైన నమ్మకంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాగునీటి లభ్యత పెంచడం నుండి, పండించిన పంటను మద్దతు ధరతో వేగంగా కొనుగోలు చేయడం వరకు ప్రభుత్వం చూపిస్తున్న ఈ చిత్తశుద్ధి వల్ల తెలంగాణ వ్యవసాయ రంగం మరింత సుసంపన్నం వైపు దూసుకుపోతోంది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!