ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. అయితే నియోజకవర్గ కేంద్రాల్లో ఆయా ఎమ్మెల్యేలు పాల్గొనాలని కేసీఆర్ సూచించడంతో గజ్వేల్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆందోళ చేస్తే కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీది అని […]
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అంతేకాకుండా మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. అయితే దీనిపై స్పందించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోలీసులపై విమర్శలు చేశారు. మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుంటే శవయాత్రలు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని, పోలీసులా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ […]
కేంద్ర ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. దేశం బీజేపీ కారణంగా నాశనం అవుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా దేశంలో సెక్యులరిజాన్ని రక్షించేది కాంగ్రెస్ పార్టీనే అని, రాష్ర్టాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. రాష్ర్ట రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలని, రెండు రాజధానులు అనేది అవకాశవాధమని ఆయన అన్నారు. చంద్రబాబు, జగన్ ఒప్పుకొనే రాష్ర్ట రాజధాని మొదలుపెట్టారని ఆయన వెల్లడించారు. శ్రీబాగ్ ఒడంబడిక […]
మెల్బోర్న్లో 2018లో జరిగిన ప్రపంచకప్లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్గా చరిత్ర సృష్టించింది 25 ఏళ్ల హైదరాబాద్ జిమ్నాస్ట్, చెందిన బుద్ధార్ అరుణారెడ్డి. అయితే తాజాగా సోమవారం ఈజిప్ట్లోని కైరాలో జరిగిన హరోస్ కప్ అంతర్జాతీయ కళాత్మక టోర్నమెంట్లో హైదరాబాద్ జిమ్నాస్ట్ బుద్ధార్ అరుణారెడ్డి రెండు పతకాలను కైవసం చేసుకొని మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఫ్లోర్, వాల్ట్ ఈవెంట్లో అత్యున్నత గౌరవాన్ని సాధించి అరుణరెడ్డి రెండు స్వర్ణపతకాలను సాధించింది. గత సంవత్సరం […]
గత నెల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే పలు దేశాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. అయితే ఇటీవల భారత్లోకి కూడా ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించింది. భారత్లోని పలు రాష్ట్రాలకు వ్యాప్తి చెందిన ఒమిక్రాన్ వేరియంట్ దాని ప్రభావాన్ని చూపుతోంది. 20 రోజుల వ్యవధిలోనే దాదాపు 100కు పైగా ఒమిక్రాన్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి. […]
ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలంటూ తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యకప్రసారం కోసం కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.
క్రైస్తవులకు పర్వదినమైన క్రిస్మస్ను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం విందును ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ నగర్ వైపుకు వెళ్లే ట్రాఫిక్పై ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని ప్రకారం, బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్ అనుమతించబడదని, నాంపల్లి, చాపెల్ రోడ్ వైపు మళ్లించబడుతుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా, అబిడ్స్ రోడ్ నుండి ట్రాఫిక్ను బీజేఆర్ విగ్రహం వైపు అనుమతించరు. ఆ […]
ఈక్విటీ బెంచ్మార్క్ సెన్సెక్స్ సోమవారం ప్రారంభ ట్రేడ్లో 1,000 పాయింట్లకు పైగా క్షీణించింది. పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులపై ఆందోళనలు పెట్టుబడిదారులను భయపెట్టడంతో గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాల మధ్య అంతటా నష్టాలను చూసాయి. నిరంతర విదేశీ నిధుల ప్రవాహం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్పై ప్రభావం చూపింది. ప్రారంభ ట్రేడింగ్లో 30 షేర్ల ఇండెక్స్ 1,028.61 పాయింట్లు (1.80 శాతం) క్షీణించి 55,983.13 వద్దకు చేరుకుంది. అలాగే నిఫ్టీ 307.50 పాయింట్లు (1.81 శాతం) తగ్గి 16,677.70 వద్దకు చేరుకుంది. […]
కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా దేశంపై తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6,563 కొత్త కరోనా కేసులు రాగా, 132 మంది మరణించారు. అయితే నిన్న ఒక్క రోజు 8,077 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 82,267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇటీవల దేశంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే […]
ఇటీవల ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను ఇంటర్ బోర్డ్ అధికారులు విడుదల చేశారు. అయితే ఈ ఫలితాలలో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. టాప్ ర్యాంక్ విద్యార్థులు కూడా పాస్ కాకపోవడం గమనార్హం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు, విద్యాశాఖ తీరుపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే విద్యాశాఖ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై […]