Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగుల పని-వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను పెంపొందించడం, అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా నేతృత్వంలోని ప్రభుత్వం కీలక పరిపాలనా సంస్కరణను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సరికొత్త కార్యాలయ వేళలను ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇప్పటివరకు ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉన్న ఆఫీస్ సమయాన్ని మార్పు చేస్తూ.. ఇకపై పనిదినాల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు పొడిగించారు. ఈ అదనపు పనివేళలకు బదులుగా.. ఉద్యోగులకు ఊరటనిస్తూ అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో కేవలం రెండు, నాలుగో శనివారాలు మాత్రమే సెలవుగా ఉండేవి. వారంతంలో రెండు రోజులు పూర్తి సెలవు దొరకడం వల్ల ఉద్యోగులు కుటుంబంతో గడపడానికి, మానసిక ఉల్లాసానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read
- Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
ఉద్యోగుల హర్షం..
ఈ నిర్ణయంపై త్రిపుర సచివాలయ సీనియర్ అధికారి దులాల్ దేబ్ , ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి డాక్టర్ క్వీన్ శర్మ స్పందిస్తూ.. ఇది ఎంతో మంచి నిర్ణయమని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ, ఇతర రాష్ట్రాల ఉద్యోగుల తరహాలోనే తాము కూడా ఈ కొత్త వేళలకు అలవాటు పడతామని, జాతీయ స్థాయి జీతభత్యాలు ఆశించినప్పుడు ఆ స్థాయి పనితీరును ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తెలంగాణ ఉద్యోగుల డిమాండ్..
త్రిపుర ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ విధానంపై ఆసక్తి చూపిస్తున్నారు. “వారంలో ఐదు రోజులు అదనపు సమయం పనిచేయడానికైనా మేము సిద్ధమే, కానీ శనివారం కూడా సెలవు ఇస్తే కుటుంబ బాధ్యతలను చక్కబెట్టుకోవడానికి, మానసిక ఒత్తిడి దూరం చేసుకోవడానికి ఎంతో మేలు జరుగుతుంది” అని తెలంగాణ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. త్రిపుర తరహా విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే బాగుంటుందని ఇక్కడి ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. మొత్తానికి.. పరిపాలనా సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిన త్రిపుర ప్రభుత్వ నిర్ణయం.. ప్రభుత్వ రంగంలో ఒక కొత్త బెంచ్మార్క్గా నిలవనుంది.
తాజావార్తలు
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
-
Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
-
Samsung Galaxy Z Fold 8: 50MP కెమెరా, 4800mAh బ్యాటరీతో.. సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 విడుదల
-
Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!