గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గడం లేదు. కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడింది. అయితే ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా చేపట్టాయి. అయితే ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. కానీ మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. […]
అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్ సీఎం మేనల్లుడుని ఈడీ అరెస్ట్ చేయడం పంజాబ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈడీ అరెస్ట్ చేసిన పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హాని ను వైద్య పరీక్షల తరువాత మొహాలీలోని ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. భూపిందర్ సింగ్ పై అక్రమ మైనింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఈడీ అధికారులు భూపిందర్ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించి రూ. 8 […]
వచ్చే 18 నెలల్లో కరీంనగర్, వరంగల్, ఖమ్మం మరియు హైదరాబాద్ మధ్య మరో 1,400 మంది ఉద్యోగులను చేర్చుకునే ప్రణాళికను హెల్త్ టెక్నాలజీ సేవల సంస్థ ఎక్లాట్ హెల్త్ ప్రకటించింది. వాషింగ్టన్ DCలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న సంస్థ, తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ డెలివరీ కేంద్రాలను కలిగి ఉంది. దీనికి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ గల్ఫ్ క్యాపిటల్ మద్దతు ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఎక్లాట్ ఇప్పటికే 200 మంది ఉద్యోగులను కలిగి ఉన్న […]
మరో బ్యాంకు కుప్పకూలింది. మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెన్స్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ లైసెన్సును రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రద్దు చేసింది. బ్యాంకింగ్ కార్యకలాపాలను సీజ్ చేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. నేటి నుంచే అంటే ఫిబ్రవరి 3, 2022 నుంచే ఇది అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది. గురువారం దీనిపై ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, తాము గతేడాదినే కొన్ని ఆంక్షలు విధించినట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ నిర్ణయంతో ఆరు […]
హైదరాబాద్లో కాకుండా న్యూఢిల్లీలో ‘మిలియన్ మార్చ్’ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్ యువజన విభాగం ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. తమ హయాంలో ఎన్ని ఖాళీలున్నాయో వెల్లడించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 15 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దేశంలోని అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి టైమ్ ఫ్రేమ్ […]
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్చిలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. గత సంవత్సరం, కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి కారణంగా, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు హోమ్ ఆధారిత అసైన్మెంట్లుగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. సాధారణ స్ట్రీమ్ల విద్యార్థులకు పూర్తి మార్కులు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు విద్యార్థులు తమ కళాశాలల్లోనే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. “ఇప్పుడు ఫిజికల్ క్లాసుల కోసం కాలేజీలు తిరిగి తెరవబడినందున, సంబంధిత కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ ఏడాది మొత్తం సిలబస్లో 70 శాతం […]
మేషం :- దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. పండ్లు, పూలు, కొబ్బరి వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు వంటివి తప్పవు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. వృషభం :- నిరుద్యోగులు ఉద్యోగయత్నాలలో విజయం సాధిస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఎదుటివారిని […]
త్వరలో అండమాన్ నికోబార్లో జరగనున్న మునిసిపల్, పంచాయతీ ఎన్నికల కోసం టీడీపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయి. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఏఎన్టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ బుధవారం పోర్టు బ్లెయిర్లో గాంధీ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా పోర్టు బ్లెయిర్ మునిసిపాలిటీలోని 2, 5, 16 వార్డుల్లో టీడీపీ పోటీ […]
అనంతపురం జిల్లాలోని హిందూపురంలో నేడు ఎమ్మెల్యే బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టనున్నారు. హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ తో బాలకృష్ణ మౌన దీక్షకు దిగనున్నారు. ఈ సందర్బంగా పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. నేడు అమరావతిలో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై స్టీరింగ్ కమిటీ చర్చించనుంది. నేడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. అయితే గోరఖ్ పూర్ […]
ఏపీలో పీఆర్సీ పై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్బంగా ఎన్టీవీ తో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు వల్లే చలో విజయవాడకు అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిని వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదని, చలో విజయవాడ ను పాజిటివ్ గానూ చూడటం లేదు… నెగెటివ్ చూడటం లేదని ఆయన అన్నారు. బంతి ఉద్యోగ సంఘాల కోర్టు లోనే ఉందని, ప్రభుత్వం చర్చలకు ఎప్పుడూ సిద్ధమేనని ఆయన […]