Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
- కేవలం రూ.20 కోసం చిన్న గొడవ
- సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని చంపిన మామా-అల్లుడు
- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Loses Life After Trying to Calm RS 20 Dispute in Anantapur: కేవలం రూ.20 కోసం ప్రారంభమైన చిన్న గొడవ.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గొడవను ఆపేందుకు, ఇరువురిని సర్దిచెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని మామా-అల్లుడు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందు నాయక్, గోపి నాయక్ అనే మామా-అల్లుళ్లు కూరగాయలు కొనుగోలు చేసేందుకు మార్కెట్కు వెళ్లారు. అక్కడ కూరగాయల వ్యాపారితో రూ.20 విషయంలో వివాదం తలెత్తింది. మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. అక్కడే టీ స్టాల్ నిర్వహిస్తున్న చంద్రశేఖర్ ఈ ఘర్షణను గమనించి వారిని ఆపేందుకు ప్రయత్నించాడు. ఇరువర్గాలకు సర్ది చెప్పి వివాదాన్ని ముగించాలని సూచించాడు. అయితే మద్యం మత్తులో ఉన్న గోవిందు నాయక్, గోపి నాయక్ ఆగ్రహంతో చంద్రశేఖర్పైనే దాడికి దిగారు.
Also Read
- కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
- Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
- Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
- Raids: మాదాపూర్లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
గోవిందు, గోపి కలిసి చంద్రశేఖర్ ఛాతిపై పలుమార్లు బలంగా పిడిగుద్దులు గుద్దడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడికక్కడే కుప్పకూలిన చంద్రశేఖర్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులైన గోవిందు, గోపి నాయక్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేవలం రూ.20 వివాదం చివరకు ఒక వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
తాజావార్తలు
-
కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
-
Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
-
Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
-
Raids: మాదాపూర్లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
-
Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్దే.. కఠిన చర్యలకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!