Lord Hanuman: మనదేశంలో దాదాపు అన్ని గ్రామాల్లో కచ్చితంగా హనుమంతుడి గుడి ఉంటుంది. దేవుడిని నమ్మే ప్రతి ఒక్కరూ హనుమంతుడిని తప్పుకుండా ఆరాధిస్తారు. కానీ రెండు గ్రామాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏకంగా రామ ధూత హనుమంతుడిని బహిష్కరించాయి. వాస్తవానికి.. మన దేశంలోని దాదాపు అన్ని గ్రామాలు దేవుళ్లు, దేవతలకు అంకితమై ఉంటాయి. ఒక్కో ఊరిలో ఒక్కో గ్రామ దేవీదేవతలు ఉంటారు. కానీ కొన్ని అరుదైన గ్రామాలు మాత్రం భిన్నమైన సంప్రదాయాలను పాటిస్తున్నాయి. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్లోని బిస్రఖ్ గ్రామంలో రావణుడిని పూర్వీకుడిగా భావించి…
Nandyal: నంద్యాల పట్టణంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. రైతు నగర్లో నివాసం ఉంటున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నల్లమల భాస్కరన్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నల్లమల భాస్కరన్ స్వస్థలం తమిళనాడు. సుమారు పదిహేనేళ్ల క్రితం నంద్యాలకు వచ్చి వివాహం చేసుకున్న ఆయన రైతు నగర్లో స్థిరపడ్డారు. భాస్కరన్ సీఆర్పీఎఫ్ 42వ బెటాలియన్కు చెందిన 2005 బ్యాచ్ కానిస్టేబుల్గా విధులు…
Garikipati Narasimha Rao: యూట్యూబర్ అన్వేష్ ఇటీవల ప్రముఖ ప్రవచన కర్త, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావుపై నీచంగా మాట్లాడిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా అన్వేష్పై విరుచుకుపడింది. ఫాలోవర్స్ సైతం భారీగా తగ్గారు. దీంతో అన్వేష్ ఇటీవల క్షమాపణలు సైతం చెప్పాడు. అయితే.. తాజాగా గరికపాటి నరసింహారావుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై గరికపాటి పరోక్షంగా స్పందించారు. నేరస్థుడికి శిక్ష కంటే సమాజం ఛీత్కరించుకున్నప్పుడే మార్పు వస్తుందని వెల్లడించారు.
Vallabhaneni Vamsi: వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. బెజవాడ మాచవరం పోలీసులు వంశీపై హత్య యత్నం కేసు నమోదు చేశారు. నూతక్కి సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీ పై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. వంశీని అరెస్టు చేయవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వెకేషన్ బెంచ్ చేపడుతుందని…
Kollu Ravindra: మచిలీపట్నం పోర్టుపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక అప్డెట్ ఇచ్చారు. మచిలీపట్నం పోర్టు ఒక సంవత్సరంలో పూర్తి అవుతుందని తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోర్టు కనెక్టివిటీ కోసం రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. దాదాపు 400 కోట్లతో పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నామన్నారు. పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు ఎక్కడ ప్లే ఓవర్, అండర్ పాస్ లు ఉండాలని అధికారులు ప్రణాళికలు వేస్తున్నారని చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించాలని…
CNAP Service: ఇటీవల ట్రాయ్ (TRAI) వినియోగదారుల కోసం ఒక కొత్త సేవను ప్రారంభించింది. దీనిని కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) అంటారు. ఈ సేవ ద్వారా కొత్త నంబర్ నుంచి ఫోన్ వస్తే నంబర్తో పాటు పేరు సైతం స్క్రీన్పై కనిపిస్తుంది. అంటే ఇకపై కాల్ వచ్చినప్పుడు నంబర్ మాత్రమే కాదు.. ఆ నంబర్ ఎవరి పేరుతో రిజిస్టర్ అయిందో కనిపిస్తుంది. ఈ సేవను ఉపయోగించడానికి ఇంటర్నెట్ అవసరం లేదు. ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేయాల్సిన పనీ లేదు. సబ్స్క్రిప్షన్ కూడా అవసరం…
Tata Motors: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ 2026 ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రాలను దాటి దేశంలో రెండో అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీదారుగా నిలిచింది. నెక్సాన్ కాంపాక్ట్ SUVకు ఉన్న బలమైన డిమాండ్, తాజాగా మార్కెట్లోకి వచ్చిన సియెర్రా మోడల్ నుంచి వచ్చిన ప్రారంభ అమ్మకాలే దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వ వాహన నమోదు గణాంకాలు చెబుతున్నాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. FY26…
RCB Historic IPL 2025 Triumph: 2025 ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే కాదు.. ఆ జట్టును ప్రాణంగా ప్రేమించే అభిమానులకు కూడా జీవితాంతం గుర్తుండిపోయే సంవత్సరంగా నిలిచింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఎన్నో నిరాశలు, లెక్కలేనన్ని ఆశలు.. అన్నింటికీ ఈ ఏడాది ఒక తీపి ముగింపు పలికింది. “ఈ సాల కప్ నమ్దే” అనే నినాదం చివరకు నిజమైంది. ఐపీఎల్ ప్రారంభమయ్యే ప్రతిసారీ ఈ మాటతో ఊగిపోయే ఆర్సీబీ అభిమానులు, సీజన్ ముగిసే సరికి మౌనంగా నిలిచిపోయే సందర్భాలు ఎన్నో చూశారు.…
Cigarette Prices: న్యూ ఇయర్ వేళ సిగరెట్ ప్రియులకు చేదు వార్త వచ్చింది. సిగరెట్ ధరలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్, బీడీ, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా పన్ను నిర్ణయాల వల్ల ఈ ఉత్పత్తులపై వినియోగదారులకు అదనపు భారం పడనుంది. పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ విధించనుండగా, బీడీలపై 18 శాతం జీఎస్టీ అమల్లోకి…
Hyderabad: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పోలీసులు పదేపదే హెచ్చరికలు చేసినప్పటికీ మందుబాబులు మాత్రం లెక్కచేయకపోవడంతో భారీ సంఖ్యలో పట్టుబడ్డారు. మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 2731 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. పట్టుబడిన వారందరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 928, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 605 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ…