డిప్యూటీ సీఎం పదవి చాలా కాలం నుంచి ఉంది. చాలా మంది ముఖ్యులు ఈ బాధ్యతను స్వీకరించారు. చాలా సంకీర్ణ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎం పదవి ఉండేది. అనుగ్రహ నారాయణ్ సిన్హా భారతదేశపు మొదటి డిప్యూటీ సీఎంగా రికార్డు కెక్కారు.
ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో 23 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పదవిపై చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి వరిస్తుందని అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.
ఆధార్-రేషన్ కార్డు లింక్ పై కేంద్రం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆధార్-రేషన్ కార్డు లింక్ చేసుకోని వారికి మరో అవకాశం కల్పించింది. జూన్ 30తో ఉన్న గడువును మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.
సాధారణంగా పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో తక్కువ జనాభా నివసిస్తుంటారు. అభివృద్ధి కూడా తక్కువే కాబట్టి పన్నులు కూడా తక్కువ మొత్తంలోనే చెల్లిస్తారు. కాని రాజస్థాన్ లోని ఓ గ్రామంలో పరిస్థితి భిన్నంగా ఉంది. పట్టణాలతో పోలిస్తే జనాభాలో తక్కువే అయినా.. వారు పన్నులు కోట్లులో చెల్లిస్తారు.
వర్షాకాలం మొదలైంది. ఈ సమయంలో బైక్లపై లాంగ్ డ్రైవ్లు వెళ్లడానికి కొందుకు ఇష్ట పడుతుంటారు. రోజువారీ అవసరాలకు బైక్పై తిరిగే వారు మాత్రం అసౌకర్యాలు ఎదుర్కొంటారు. అయితే ఈ సీజన్లో ఎవరైనా సరే వాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
ఎర్రకోట దాడి కేసులో పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. దేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఎర్రకోటపై దాదాపు 24 ఏళ్ల క్రితం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
జూలై 4న బ్రిటన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడున్న బ్రిటన్ హిందువులు భవిష్యత్తు ప్రభుత్వం కోసం తమ డిమాండ్లకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేశారు. 32 పేజీల మేనిఫెస్టోను విడుదల చేయడం ఇదే మొదటి సారి.
ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. జీ7 సదస్సు కోసం ప్రధాని మోడీ ఇటలీ పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ఖలిస్తాన్ మద్దతుదారులు హర్దీప్ సింగ్ నిజ్జర్ నినాదాలు సైతం కనిపించాయి.
భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు మంగళవారం (జూన్ 11) 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనా 6.6%గా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రపంచ బ్యాంకు ప్రకారం.. వస్తు తయారీ, రియల్ ఎస్టేట్లో మరింత వృద్ధి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.6 […]