Crime: పాత బాయ్ ఫ్రెండ్ తిరిగి రావడంతో.. కొత్త స్నేహితుడైన ఎస్సైని హత్య చేసిన మహిళా కానిస్టేబుల్..
- మధ్యప్రదేశ్లో హృదయ విదారక ఘటన
- పాత బాయ్ ఫ్రెండ్ తిరిగి రావడంతో.. కొత్త ప్రియుడైన ఎస్సైని హత్య చేసిన మహిళా కానిస్టేబుల్
- మధ్యప్రదేశ్ లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రాజ్గఢ్ జిల్లాలోని బియోరాలో ఓ మహిళా కానిస్టేబుల్ తన ప్రియుడితో కలిసి ఎస్ఐని కారుతో ఢికొట్టి చంపేసింది. ఈ కేసు తర్వాత మహిళా కానిస్టేబుల్తో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపార్ట్మెంట్లో భాగంగా ఎస్ఐ దీపాంకర్ లేడీ కానిస్టేబుల్ పల్లవి సోలంకితో మాట్లాడేవాడని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆమె ప్రియుడు కరణ్ సింగ్కు అనుమానం వచ్చింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మంగళవారం ఎస్ఐ దీపాంకర్ గౌతమ్ తన ఇంట్లో ఉండగా… కుట్రలో భాగంగా భోపాల్ బైపాస్ వైపు రావాలని కరణ్, పల్లవి పిలిచారు. కరణ్, అతి వేగంతో కారు నడుపుతూ.. దీపాంకర్ బైక్ ను ఢీకొట్టాడు. తర్వాత అతన్ని చాలా దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ సమయంలో ఎస్ఐ దీపాంకర్ గౌతమ్ మృతి చెందాడు. దీని తరువాత, పోలీసులు మహిళా కానిస్టేబుల్, ప్రియుడిపై సెక్షన్ 103 (1), 3 (5) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు.
READ MORE: Telangana: సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read
- Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
బియోరా-దేవాస్ హైవేపై దేహత్ పోలీస్ స్టేషన్ వైపు బైక్పై వెళ్తున్న దీపాంకర్ను కారుతో ఢీకొట్టారని పోలీసులు తెలిపారు. దీపాంకర్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. 30 మీటర్ల మేర కారుతో ఈడ్చుకెళ్లారు. దీంతో దీపాంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన అనంతరం అక్కడే ఉన్న వ్యక్తులు ఎస్ఐని అంబులెన్స్లో సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కారు నంబర్ను గుర్తించిన పోలీసులు నిందితులు పల్లవి, కరణ్ అని తేలింది. పోలీసులు రెండు పోలీస్ స్టేషన్లకు పిలిపించి అర్థరాత్రి వరకు విచారించారు. నిందితులిద్దరూ ఎస్ఐని హత్య చేసినట్లుగా అంగీకరించినట్లు దేహత్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ గోవింద్ మీనా తెలిపారు. తన ప్రేమ మధ్య ఎస్ఐ వస్తున్నాడని చెప్పాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
READ MORE: Sanjauli Mosque Row: సిమ్లాలో వివాదంగా ‘సంజౌలి మసీదు’.. ప్రజలపై లాఠీఛార్జ్..
కాగా.. మహిళా కానిస్టేబుల్ పల్లవి, కరణ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని సమాచారం. కొద్దిరోజుల క్రితం పరస్పరం గొడవల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఈ సమయంలో పల్లవి దీపాంకర్తో స్నేహం చేసింది. ఈ విషయం తెలుసుకున్న కరణ్ తిరిగి పల్లవి దగ్గరకు వెళ్లాడు. ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఎస్ఐ దీపాంకర్ను దారి నుంచి తప్పించాలని ఇద్దరూ ఆలోచించారు. మంగళవారం దీపంకర్ను కలవాలని పల్లవి పిలిచి కారుతో ఢీకొట్టి చంపేశారు.
తాజావార్తలు
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
-
West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
-
Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!