Crime: పాత బాయ్ ఫ్రెండ్ తిరిగి రావడంతో.. కొత్త స్నేహితుడైన ఎస్సైని హత్య చేసిన మహిళా కానిస్టేబుల్..
- మధ్యప్రదేశ్లో హృదయ విదారక ఘటన
- పాత బాయ్ ఫ్రెండ్ తిరిగి రావడంతో.. కొత్త ప్రియుడైన ఎస్సైని హత్య చేసిన మహిళా కానిస్టేబుల్
- మధ్యప్రదేశ్ లో ఘటన
మధ్యప్రదేశ్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రాజ్గఢ్ జిల్లాలోని బియోరాలో ఓ మహిళా కానిస్టేబుల్ తన ప్రియుడితో కలిసి ఎస్ఐని కారుతో ఢికొట్టి చంపేసింది. ఈ కేసు తర్వాత మహిళా కానిస్టేబుల్తో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపార్ట్మెంట్లో భాగంగా ఎస్ఐ దీపాంకర్ లేడీ కానిస్టేబుల్ పల్లవి సోలంకితో మాట్లాడేవాడని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆమె ప్రియుడు కరణ్ సింగ్కు అనుమానం వచ్చింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మంగళవారం ఎస్ఐ దీపాంకర్ గౌతమ్ తన ఇంట్లో ఉండగా… కుట్రలో భాగంగా భోపాల్ బైపాస్ వైపు రావాలని కరణ్, పల్లవి పిలిచారు. కరణ్, అతి వేగంతో కారు నడుపుతూ.. దీపాంకర్ బైక్ ను ఢీకొట్టాడు. తర్వాత అతన్ని చాలా దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ సమయంలో ఎస్ఐ దీపాంకర్ గౌతమ్ మృతి చెందాడు. దీని తరువాత, పోలీసులు మహిళా కానిస్టేబుల్, ప్రియుడిపై సెక్షన్ 103 (1), 3 (5) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు.
READ MORE: Telangana: సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read
- Viral: ఒక్క రాత్రి నగ్న పూజకు కూర్చొంటే రూ.30 లక్షలు.. యువతికి ఎర వేసిన కారు డ్రైవర్..
- Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
- B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
బియోరా-దేవాస్ హైవేపై దేహత్ పోలీస్ స్టేషన్ వైపు బైక్పై వెళ్తున్న దీపాంకర్ను కారుతో ఢీకొట్టారని పోలీసులు తెలిపారు. దీపాంకర్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. 30 మీటర్ల మేర కారుతో ఈడ్చుకెళ్లారు. దీంతో దీపాంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన అనంతరం అక్కడే ఉన్న వ్యక్తులు ఎస్ఐని అంబులెన్స్లో సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కారు నంబర్ను గుర్తించిన పోలీసులు నిందితులు పల్లవి, కరణ్ అని తేలింది. పోలీసులు రెండు పోలీస్ స్టేషన్లకు పిలిపించి అర్థరాత్రి వరకు విచారించారు. నిందితులిద్దరూ ఎస్ఐని హత్య చేసినట్లుగా అంగీకరించినట్లు దేహత్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ గోవింద్ మీనా తెలిపారు. తన ప్రేమ మధ్య ఎస్ఐ వస్తున్నాడని చెప్పాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
READ MORE: Sanjauli Mosque Row: సిమ్లాలో వివాదంగా ‘సంజౌలి మసీదు’.. ప్రజలపై లాఠీఛార్జ్..
కాగా.. మహిళా కానిస్టేబుల్ పల్లవి, కరణ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని సమాచారం. కొద్దిరోజుల క్రితం పరస్పరం గొడవల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఈ సమయంలో పల్లవి దీపాంకర్తో స్నేహం చేసింది. ఈ విషయం తెలుసుకున్న కరణ్ తిరిగి పల్లవి దగ్గరకు వెళ్లాడు. ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఎస్ఐ దీపాంకర్ను దారి నుంచి తప్పించాలని ఇద్దరూ ఆలోచించారు. మంగళవారం దీపంకర్ను కలవాలని పల్లవి పిలిచి కారుతో ఢీకొట్టి చంపేశారు.
తాజావార్తలు
-
Walking 10,000 Steps Daily: రోజుకు 10,000 అడుగులు నడవడం నిజంగా అవసరమా..? మోకాళ్లపై ప్రభావం ఏమిటి?
-
Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
-
Congress Comeback: ఐదు రాష్ట్రాల పోరులో అతిపెద్ద లబ్ధిదారు కాంగ్రెస్సే ! బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే..
-
EKDIN : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. డిజాస్టర్
-
West Asia Crisis: పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు.. ‘ఇరాన్ను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం’.. ట్రంప్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!