బోయింగ్కు చెందిన స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారతీయురాలు సునీతా విలియమ్స్ ఇంకా కొంత కాలం పాటు అక్కడే ఉండాల్సి రావచ్చు. ఈ మిషన్ ను రూపొందించినప్పుడు తక్కువ రోజులే ఉంటుందని వెల్లడించారు.
మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. విచారణ సందర్భంగా.. కేజ్రీవాల్ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. దానిని కోర్టు అంగీకరించింది.
కర్ణాటకలో రాజకీయ దుమారం ఊపందుకుంది. ముఖ్యమంత్రిని మార్చే అవకాశం, మరో ముగ్గురు ఉపముఖ్యమంత్రుల డిమాండ్పై జరుగుతున్న చర్చల మధ్య.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకె శివకుమార్ శనివారం పార్టీ కార్యకర్తలు, నాయకులను ఈ అంశంపై బహిరంగ ప్రకటనలు జారీ చేయవద్దని కోరారు.
శనివారం ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన అంతరాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను ప్రభావితం చేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో ఈ అంశం ప్రకంపనలు సృష్టించింది. ఆన్లైన్ అంతరాయాలను పర్యవేక్షించే వెబ్సైట్ డౌన్డెటెక్టర్ ప్రకారం.. భారతదేశంలోని వేలాది మంది వినియోగదారులు మధ్యాహ్నం 12:02 గంటలకు ప్లాట్ఫారమ్ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈరోజు ఉదయం ఓ ప్రైవేట్ బాణసంచా తయారీ యూనిట్లో పేలుగు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరికొంతమంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి రానున్నాయి. 1860లో ఏర్పడిన ఇండియన్ పీనల్ కోడ్ (IPC) స్థానంలో ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ (BNS) వస్తుంది.
వర్షాకాలంలో పురుగులు, బొద్దింకలు, చిన్న చిన్న కీటకాల సమస్య విపరీతంగా పెరుగుతుంది. వర్షం పడ్డ వెంటనే పరిసరాల్లో నీరు నిలిచి బురదగా మారుతుంది. దీంతో దోమలు, కీటకాలు వృద్ధి చెందుతాయి.
హాంకాంగ్, షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (HSBC) కొన్ని కార్డు సంబంధిత సూచనలను పాటించనందుకు 29.6 లక్షల రూపాయల పెనాల్టీని విధించినట్లు ఆర్బీఐ(RBI) శుక్రవారం తెలిపింది.
ఈ రోజుల్లో ఫోన్ చాలా ముఖ్యమైన వస్తువుగా మారింది. చాలామంది ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు..అంతలా ఫోన్ మన జీవితంలో భాగమైంది. దాదాపు అన్ని పనులు ఫోన్ లోనే ఇప్పుడు పూర్తవుతున్నాయి.
నీట్ పేపర్ లీక్ కేసులో జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సాన్ ఉల్ హక్, సెంటర్ సూపరింటెండెంట్ ఇంతియాజ్లను సీబీఐ ఈరోజు అరెస్ట్ చేసింది. డాక్టర్ ఎహ్సాన్ ఉల్ హక్ నీట్ పరీక్ష జిల్లా కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు.