Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కు14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం
- కేజ్రీవాల్ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరిన సీబీఐ
- మూడు రోజుల కస్టడీ గడువు ముగియడంతో కోర్టులో హాజరు పరిచిన సీబీఐ
- మరి కాసేపట్లో తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్
మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. విచారణ సందర్భంగా.. కేజ్రీవాల్ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. దానిని కోర్టు అంగీకరించింది. మూడు రోజుల కస్టడీ గడువు ముగియడంతో కేజ్రీవాల్ను సీబీఐ శనివారం కోర్టులో హాజరుపరిచింది. కేజ్రీవాల్ను జైలుకు పంపాలంటూ దాఖలైన పిటిషన్పై ప్రత్యేక న్యాయమూర్తి సునైనా శర్మ తీర్పును రిజర్వ్లో ఉంచి, ఆ తర్వాత 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. మరి కాసేపట్లో సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లనున్నారు. మళ్లీ జులై 12న మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరచనున్నారు.
READ MORE: Top Upcoming Smartphones: జులైలో విడుదల కానున్న టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
మద్యం కుంభకోణానికి సంబంధించిన ప్రశ్నలకు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా సమాధానం ఇవ్వడం లేదని సీబీఐ తన దరఖాస్తులో పేర్కొంది. కొత్త మద్యం పాలసీలో లాభాల మార్జిన్ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడానికి గల కారణాలపై కూడా కేజ్రీవాల్ సరైన సమాధానం చెప్పలేదని స్పష్టం చేసింది. దేశంలో కరోనా రెండో వేవ్ విజృంభిస్తున్న తరుణంలో క్యాబినెట్లో మద్యం పాలసీని మార్చడం అవసరమా? అలాగే సౌత్ లాబీకి సంబంధించిన కేసులో నిందితులు ఢిల్లీలో మకాం వేసి కేజ్రీవాల్కు సన్నిహితుడైన విజయ్నాయర్తో టచ్లో ఉన్నారని సీబీఐ పేర్కొంది. అలాగే కొత్త మద్యం పాలసీని అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు తొందరపడిందని ప్రశ్నించింది. అరవింద్ కేజ్రీవాల్ను విచారించిన సమయంలో.. అతని సన్నిహితుడు విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో అనేకసార్లు సమావేశమయ్యారని ఆరోపించింది. కోట్లాది రూపాయల లంచం డిమాండ్ చేశారని, గోవా ఎన్నికలలో సుమారు 44.5 కోట్ల రూపాయల లంచాన్ని ఉపయోగించారని తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అర్జున్ పాండే మరియు గౌతమ్తో భేటీకి కారణం వంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని పేర్కొంది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో