ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రముఖ వ్యాపార వేత్త మఖేష్ అంబానీ కలిశారు. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జులై 12 న ప్రారంభం కానున్నాయి.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని జీటీబీ నగర్ చేరుకున్నారు. అక్కడ రోజువారీ కూలీలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఏం పనిచేస్తారో తెలుసుకున్న రాహుల్ మెటీరియల్ ఎక్కడ నుంచి తీసుకొస్తారని అడిగారు.
ప్రజలు ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు బాగా ఎడిక్ట్ అయ్యారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ రకరకాల వీడియోలు చేస్తూ..నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూస్, ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవటానికి తమ జీవితాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు.
జార్ఖండ్లో మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి హేమంత్ సోరెన్ అధిరోహించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మరోసారి విడిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయబోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ నెల ఆరో తేదీన భేటీ అవుదామవి రేవంత్ కు చంద్రబాబు ప్రతిపాదన పంపారు. తెలుగురాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులో 95 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం.. సాయంత్రం ఏడుగంటల సమయానికి దాదాపు 94.15 శాతం మేర పంపిణీ పూర్తి చేసింది.
ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించి విశ్వవిజేతగా మారింది. ఎట్టకేలకు భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది.
దేశంలో చెలామణి నుండి తొలగించబడిన రూ. 2000 (రూ. 2000 నోటు) పింక్ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక పెద్ద అప్డేట్ ఇచ్చింది. ఈ కరెన్సీ నోట్లు గత ఏడాది మే నెలలో చెలామణి నుంచి తొలగించినా.. ఇంకా ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న 100 శాతం నోట్లు తిరిగి రాలేదని తెలిపింది.
కన్నుల పండుగగా.. పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. స్వయంగా పింఛన్ దారుల వద్దకు వెళ్లిన మొద్దమొదటి సీఎం చంద్రబాబు అని పేర్కొన్నారు.