Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rape Case Registered Against Bjp Mla In Up

BJP MLA: సామాన్యుడి భూమి లాక్కున్న బీజేపీ ఎమ్మెల్యే.. సోదరులతో కలిసి బాధితుడి భార్యపై గ్యాంగ్‌ రేప్

NTV Telugu Twitter
Published Date :December 21, 2024 , 7:24 pm
By RAMAKRISHNA KENCHE
  • బీజేపీ ఎమ్మెల్యే, సోదరులపై కేసు నమోదు
  • సామాన్యుడి భూమి లాక్కున్న ఎమ్మె్ల్యే
  • మహిళపై సామూహిక అత్యాచారం
BJP MLA: సామాన్యుడి భూమి లాక్కున్న బీజేపీ ఎమ్మెల్యే.. సోదరులతో కలిసి బాధితుడి భార్యపై గ్యాంగ్‌ రేప్
  • Follow Us :
  • google news
  • dailyhunt

యూపీలోని బదౌన్‌లో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ షాక్యా, అతని సోదరులు సహా 16 మందిపై సామూహిక అత్యాచారం, భూకబ్జాలకు పాల్పడినట్లు కేసు నమోదయ్యాయి. ప్రత్యేక కోర్టు, ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు, అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లీలు చౌదరి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బిల్సీ ఎమ్మెల్యే, ముఠాపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సివిల్ లైన్స్ కొత్వాలి పోలీసులు, ప్రాసిక్యూషన్ కార్యాలయం నుంచి న్యాయ సలహా తీసుకున్నారు.

బాధితుడి ఆవేదన…
డిసెంబర్ 11న కోర్టు ఆదేశాల మేరకు బుద్వాయ్ రోడ్డులోని పూనమ్ లాన్ సమీపంలో తనకు భూమి ఉందని లలిత్ కుమార్ అనే బాధితుడు పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఆ భూమిని తల్లి, అమ్మమ్మల పేరిట కొనుగోలు చేశాడు. తర్వాత అమ్మమ్మ చంద్రకాళి దానిని తన తండ్రి ఓంప్రకాష్‌కు కట్టబెట్టింది. 2022లో సతేంద్ర శక్య, ధరంపాల్ షాక్యా, హరిశంకర్ వ్యాస్, ఆనంద్, మనోజ్ గోయల్, విపిన్ కుమార్, అనెగ్‌పాల్ అనే వ్యక్తులు బాధితుడి ఇంటికి వచ్చారు. బిల్సీ ఎమ్మెల్యే హరీష్ షాక్యా భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్నారని చెప్పారు. భూమి అమ్మేందుకు ఆ కుటుంబం నిరాకరించింది. ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి భూమి కొనుగోలుపై మాట్లాడారు. దీంతో ఒక్కో ఎకరాకురూ.80 లక్షలు అని చెప్పారు. మొత్తం భూమి విలువ రూ.17 కోట్ల 38 లక్షల 40 వేలు అని ఆ కుటుంబం తెలిపింది. రూ.16.50 కోట్లతో భూమిని కొనుగోలు చేయాలని ఒప్పందం కుదిరింది. అలాగే అగ్రిమెంట్ సమయంలో 40 శాతం మొత్తం చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని డీడీ సమయంలో ఇవ్వాలని నిర్ణయించారు.

బలవంతంగా భూమి లాక్కున్న ఎమ్మెల్యే..
ఎమ్మెల్యే హరీశ్ శాక్య హరిశంకర్ వ్యాస్ నుంచి లక్ష రూపాయలు కుటుంబానికి అందాయి. అరకొర డబ్బులు అందిన రెండు మూడు రోజులకే అగ్రిమెంట్ చేయాలని ఒత్తిడి తెచ్చారు. మొత్తం 40 శాతం నగదు అందిన తర్వాతే అగ్రిమెంట్ చేసుకుంటామని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో మొత్తం ముఠా బాధితురాలి కుటుంబంపై హత్య, అత్యాచారం వంటి తప్పుడు కేసులు నమోదు చేయించారు. వారిని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. దీని తర్వాత బిల్సీ ఎమ్మెల్యే ఇంట్లో బలవంతంగా ఒప్పందం కుదుర్చుకుని బెదిరింపులకు పాల్పడి డిక్లరేషన్ డీడీ వేయించుకున్నారు. ఇలా రూ.16.50 కోట్ల విలువైన భూమిని రూ.4 కోట్ల 33 లక్షల 20 వేల ఐదు వందలకు లాక్కున్నారు.

ఇంటికి పిలిపించి మహిళపై అత్యాచారం..
కాగా బాధితురాలి కుటుంబాన్ని ఎమ్మెల్యే ఇంటికి పిలిపించి సంతకం చేయించుకున్నాడు. ఈ సందర్భంగా బాధితుడి భార్యపై ఎమ్మెల్యే తన నివాసంలో సహచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండేళ్లుగా బాధిత కుటుంబీకుల మాటను పోలీసులు వినకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైంది. కద్రాబాదు తహసీల్ డేటాగంజ్ నివాసి బిల్సీ ఎమ్మెల్యే హరీష్ శక్య, కద్రాబాదు తహసీల్ డేటాగంజ్ నివాసి సతేంద్ర శక్య (ఎమ్మెల్యే సోదరుడు, అకౌంటెంట్), ధరంపాల్ శాక్య (ఎమ్మెల్యే సోదరుడు), ఎమ్మెల్యే మేనల్లుడు, తదితరులపై కేసులు నమోదయ్యాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 16 people
  • badaun
  • bjp mla
  • BJP MLA Harish Shakya
  • case

తాజావార్తలు

  • Venkatarami Reddy: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను సస్పెండ్‌ చేయాలి.. వైసీపీ డిమాండ్‌

  • Sonia Gandhi: ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతపై స్పందించిన సోనియా గాంధీ..

  • Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయం.. ట్రిపులైన పెన్షన్లు!

  • Nagarjuna : కుబేరలో నాదే మెయిన్ రోల్.. నాగార్జున కామెంట్స్

  • Nani : ఆ విషయంలో.. సెంటిమెంట్‌ను పక్కన పెట్టిన న్యాచురల్ స్టార్ !

ట్రెండింగ్‌

  • iPhone 16: ఇది కలనా.. నిజమా..? ఐఫోన్ 16 ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్స్ ఏంటి భయ్యా..!

  • VIVO Y400 Pro 5G: 6.77 అంగుళాల కర్వుడ్ స్క్రీన్‌, 5500mAh భారీ బ్యాటరీ లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చేసిన వివో Y400 ప్రో..!

  • OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions