BJP MLA: సామాన్యుడి భూమి లాక్కున్న బీజేపీ ఎమ్మెల్యే.. సోదరులతో కలిసి బాధితుడి భార్యపై గ్యాంగ్ రేప్
- బీజేపీ ఎమ్మెల్యే, సోదరులపై కేసు నమోదు
- సామాన్యుడి భూమి లాక్కున్న ఎమ్మె్ల్యే
- మహిళపై సామూహిక అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని బదౌన్లో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ షాక్యా, అతని సోదరులు సహా 16 మందిపై సామూహిక అత్యాచారం, భూకబ్జాలకు పాల్పడినట్లు కేసు నమోదయ్యాయి. ప్రత్యేక కోర్టు, ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు, అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లీలు చౌదరి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బిల్సీ ఎమ్మెల్యే, ముఠాపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సివిల్ లైన్స్ కొత్వాలి పోలీసులు, ప్రాసిక్యూషన్ కార్యాలయం నుంచి న్యాయ సలహా తీసుకున్నారు.
బాధితుడి ఆవేదన…
డిసెంబర్ 11న కోర్టు ఆదేశాల మేరకు బుద్వాయ్ రోడ్డులోని పూనమ్ లాన్ సమీపంలో తనకు భూమి ఉందని లలిత్ కుమార్ అనే బాధితుడు పిటిషన్లో పేర్కొన్నాడు. ఆ భూమిని తల్లి, అమ్మమ్మల పేరిట కొనుగోలు చేశాడు. తర్వాత అమ్మమ్మ చంద్రకాళి దానిని తన తండ్రి ఓంప్రకాష్కు కట్టబెట్టింది. 2022లో సతేంద్ర శక్య, ధరంపాల్ షాక్యా, హరిశంకర్ వ్యాస్, ఆనంద్, మనోజ్ గోయల్, విపిన్ కుమార్, అనెగ్పాల్ అనే వ్యక్తులు బాధితుడి ఇంటికి వచ్చారు. బిల్సీ ఎమ్మెల్యే హరీష్ షాక్యా భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్నారని చెప్పారు. భూమి అమ్మేందుకు ఆ కుటుంబం నిరాకరించింది. ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి భూమి కొనుగోలుపై మాట్లాడారు. దీంతో ఒక్కో ఎకరాకురూ.80 లక్షలు అని చెప్పారు. మొత్తం భూమి విలువ రూ.17 కోట్ల 38 లక్షల 40 వేలు అని ఆ కుటుంబం తెలిపింది. రూ.16.50 కోట్లతో భూమిని కొనుగోలు చేయాలని ఒప్పందం కుదిరింది. అలాగే అగ్రిమెంట్ సమయంలో 40 శాతం మొత్తం చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని డీడీ సమయంలో ఇవ్వాలని నిర్ణయించారు.
Also Read
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
బలవంతంగా భూమి లాక్కున్న ఎమ్మెల్యే..
ఎమ్మెల్యే హరీశ్ శాక్య హరిశంకర్ వ్యాస్ నుంచి లక్ష రూపాయలు కుటుంబానికి అందాయి. అరకొర డబ్బులు అందిన రెండు మూడు రోజులకే అగ్రిమెంట్ చేయాలని ఒత్తిడి తెచ్చారు. మొత్తం 40 శాతం నగదు అందిన తర్వాతే అగ్రిమెంట్ చేసుకుంటామని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో మొత్తం ముఠా బాధితురాలి కుటుంబంపై హత్య, అత్యాచారం వంటి తప్పుడు కేసులు నమోదు చేయించారు. వారిని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. దీని తర్వాత బిల్సీ ఎమ్మెల్యే ఇంట్లో బలవంతంగా ఒప్పందం కుదుర్చుకుని బెదిరింపులకు పాల్పడి డిక్లరేషన్ డీడీ వేయించుకున్నారు. ఇలా రూ.16.50 కోట్ల విలువైన భూమిని రూ.4 కోట్ల 33 లక్షల 20 వేల ఐదు వందలకు లాక్కున్నారు.
ఇంటికి పిలిపించి మహిళపై అత్యాచారం..
కాగా బాధితురాలి కుటుంబాన్ని ఎమ్మెల్యే ఇంటికి పిలిపించి సంతకం చేయించుకున్నాడు. ఈ సందర్భంగా బాధితుడి భార్యపై ఎమ్మెల్యే తన నివాసంలో సహచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండేళ్లుగా బాధిత కుటుంబీకుల మాటను పోలీసులు వినకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైంది. కద్రాబాదు తహసీల్ డేటాగంజ్ నివాసి బిల్సీ ఎమ్మెల్యే హరీష్ శక్య, కద్రాబాదు తహసీల్ డేటాగంజ్ నివాసి సతేంద్ర శక్య (ఎమ్మెల్యే సోదరుడు, అకౌంటెంట్), ధరంపాల్ శాక్య (ఎమ్మెల్యే సోదరుడు), ఎమ్మెల్యే మేనల్లుడు, తదితరులపై కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!