BJP MLA: సామాన్యుడి భూమి లాక్కున్న బీజేపీ ఎమ్మెల్యే.. సోదరులతో కలిసి బాధితుడి భార్యపై గ్యాంగ్ రేప్
- బీజేపీ ఎమ్మెల్యే, సోదరులపై కేసు నమోదు
- సామాన్యుడి భూమి లాక్కున్న ఎమ్మె్ల్యే
- మహిళపై సామూహిక అత్యాచారం
యూపీలోని బదౌన్లో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ షాక్యా, అతని సోదరులు సహా 16 మందిపై సామూహిక అత్యాచారం, భూకబ్జాలకు పాల్పడినట్లు కేసు నమోదయ్యాయి. ప్రత్యేక కోర్టు, ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు, అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లీలు చౌదరి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బిల్సీ ఎమ్మెల్యే, ముఠాపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సివిల్ లైన్స్ కొత్వాలి పోలీసులు, ప్రాసిక్యూషన్ కార్యాలయం నుంచి న్యాయ సలహా తీసుకున్నారు.
బాధితుడి ఆవేదన…
డిసెంబర్ 11న కోర్టు ఆదేశాల మేరకు బుద్వాయ్ రోడ్డులోని పూనమ్ లాన్ సమీపంలో తనకు భూమి ఉందని లలిత్ కుమార్ అనే బాధితుడు పిటిషన్లో పేర్కొన్నాడు. ఆ భూమిని తల్లి, అమ్మమ్మల పేరిట కొనుగోలు చేశాడు. తర్వాత అమ్మమ్మ చంద్రకాళి దానిని తన తండ్రి ఓంప్రకాష్కు కట్టబెట్టింది. 2022లో సతేంద్ర శక్య, ధరంపాల్ షాక్యా, హరిశంకర్ వ్యాస్, ఆనంద్, మనోజ్ గోయల్, విపిన్ కుమార్, అనెగ్పాల్ అనే వ్యక్తులు బాధితుడి ఇంటికి వచ్చారు. బిల్సీ ఎమ్మెల్యే హరీష్ షాక్యా భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్నారని చెప్పారు. భూమి అమ్మేందుకు ఆ కుటుంబం నిరాకరించింది. ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి భూమి కొనుగోలుపై మాట్లాడారు. దీంతో ఒక్కో ఎకరాకురూ.80 లక్షలు అని చెప్పారు. మొత్తం భూమి విలువ రూ.17 కోట్ల 38 లక్షల 40 వేలు అని ఆ కుటుంబం తెలిపింది. రూ.16.50 కోట్లతో భూమిని కొనుగోలు చేయాలని ఒప్పందం కుదిరింది. అలాగే అగ్రిమెంట్ సమయంలో 40 శాతం మొత్తం చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని డీడీ సమయంలో ఇవ్వాలని నిర్ణయించారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
బలవంతంగా భూమి లాక్కున్న ఎమ్మెల్యే..
ఎమ్మెల్యే హరీశ్ శాక్య హరిశంకర్ వ్యాస్ నుంచి లక్ష రూపాయలు కుటుంబానికి అందాయి. అరకొర డబ్బులు అందిన రెండు మూడు రోజులకే అగ్రిమెంట్ చేయాలని ఒత్తిడి తెచ్చారు. మొత్తం 40 శాతం నగదు అందిన తర్వాతే అగ్రిమెంట్ చేసుకుంటామని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో మొత్తం ముఠా బాధితురాలి కుటుంబంపై హత్య, అత్యాచారం వంటి తప్పుడు కేసులు నమోదు చేయించారు. వారిని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. దీని తర్వాత బిల్సీ ఎమ్మెల్యే ఇంట్లో బలవంతంగా ఒప్పందం కుదుర్చుకుని బెదిరింపులకు పాల్పడి డిక్లరేషన్ డీడీ వేయించుకున్నారు. ఇలా రూ.16.50 కోట్ల విలువైన భూమిని రూ.4 కోట్ల 33 లక్షల 20 వేల ఐదు వందలకు లాక్కున్నారు.
ఇంటికి పిలిపించి మహిళపై అత్యాచారం..
కాగా బాధితురాలి కుటుంబాన్ని ఎమ్మెల్యే ఇంటికి పిలిపించి సంతకం చేయించుకున్నాడు. ఈ సందర్భంగా బాధితుడి భార్యపై ఎమ్మెల్యే తన నివాసంలో సహచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండేళ్లుగా బాధిత కుటుంబీకుల మాటను పోలీసులు వినకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైంది. కద్రాబాదు తహసీల్ డేటాగంజ్ నివాసి బిల్సీ ఎమ్మెల్యే హరీష్ శక్య, కద్రాబాదు తహసీల్ డేటాగంజ్ నివాసి సతేంద్ర శక్య (ఎమ్మెల్యే సోదరుడు, అకౌంటెంట్), ధరంపాల్ శాక్య (ఎమ్మెల్యే సోదరుడు), ఎమ్మెల్యే మేనల్లుడు, తదితరులపై కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!