ప్రస్తుతం నెటిజన్లు రీల్స్ వ్యసనంగా మారారు. దీంతో రీల్స్ క్రియేట్ చేసే వాళ్లు కంటెంట్ కోసం చిత్ర విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా వైరల్ అవుతున్న ఈ వీడియోలో యువకులు డిఫరెంట్ గా ఆలోచించి రీల్ రూపొందించారు.
బీహార్లో మద్యంపై నిషేధం కొనసాగుతోంది. దీంతో కల్తీ మద్యం దందా, అక్రమ మద్యం రవాణా పెరుగుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 37 మంది మృతి చెందారు. ఈ కేసులో మొత్తం ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు.
సైబరాబాద్ పోలీసులు రెండు వేల సెల్ ఫోన్లు రికవరీ చేశారు. ఆరు నెలల కాలంలో రెండు వేల సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. చోరీ లేదా మిస్ అయిన సెల్ ఫోన్ లోని సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ చిన్నారులపై దాడికి దిగుతున్నాయి.
సీఐ రవికుమార్పై పొక్సో కేసు నమోదైంది.హనుమకొండ పీజీఆర్ అపార్ట్మెంట్ లో ఉంటూ..అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న 16 ఏళ్ల మైనర్ బలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆంధ్రా నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్న ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. ధూల్పేట్కు చెందిన గీతాబాయ్, శీలాబాయ్, క్రాంతిలను అరెస్ట్ చేశారు.
వేములవాడ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తాగిన మైకంలో తన పది నెలల శిశువుని రూ. లక్షకి విక్రయించింది. నిన్న సిరిసిల్ల కల్లు మండువాలో బేర సారాలు జరిగినట్లు సమాచారం.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ నాంపల్లిలోని స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ డిఫర్మేషన్ దాఖలు చేశారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ లను సాక్షులుగా పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాను అమెరికాలో 6 సంవత్సరాలు చదువుకున్నానని.. చదువు పూర్తి అయ్యాక ఇండియాకు తిరిగి వచ్చినట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.