ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) 2025 అవార్డు ప్రకటించారు. ఈ నామినేషన్లో మారుతీ డిజైర్, మారుతీ స్విఫ్ట్, మహీంద్రా థార్ రాక్స్, ఎమ్జీ విండ్సర్ ఈవీ, సిట్రోయెన్ బసాల్ట్, టాటా కర్వ్, కర్వ్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, BYD eMAX 7 పాల్గొన్నాయి. అయితే.. ఓ కారు మాత్రం వీటిన్నింటినీ అధిగమించించి ఈ అవార్డును సొంతం చేసుకుంది.
లంబోర్ఘిని తన చరిత్రలో ఘన విజయాన్ని సాధించింది. 2024లో కంపెనీ మొత్తం 10,687 వాహనాలను డెలివరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ లగ్జరీ కార్ల తయారీ సంస్థకు ఇది చారిత్రాత్మక విజయం.
వాతావరణ శాఖ150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, భారత ప్రభుత్వం 'అఖండ భారత్' కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. జనవరి 14న ఢిల్లీలోని భారత మండపంలో జరిగే ఈ సదస్సు కోసం అవిభక్త భారతదేశంలో భాగమైన పొరుగు దేశాలకు కూడా ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ పాల్గొంటుంది
మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ నగరంలోని ఓ ఇంట్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. ఈ మృతదేహం ఫ్రిజ్లో గుర్తించారు. పోలీసుల విచారణలో మృతురాలిని 30 ఏళ్ల ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతిగా గుర్తించారు. లివ్ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ప్రతిభ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె భాగస్వామి సంజయ్ పాటిదార్ ఈ హత్యకు పాల్పడ్డాడు.
అస్సాంలో 10 నెలల చిన్నారిలో 'హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్' (HMPV) ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. అస్సాంలో ఇది మొదటి కేసు. ఈ మేరకు శనివారం అధికారులు సమాచారం అందించారు. దిబ్రూఘర్లోని అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను లాంచ్ చేయగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో సోమవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.
తనకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి తనకు పిఠాపురం ప్రజలు ఘన విజయం ఇచ్చారని.. తన గాయాలకి పిఠాపురం ప్రజలు మందు వేశారని కొనియాడారు. జన్మంతా పిఠాపురం ప్రజలకి రుణపడి ఉంటానని తెలిపారు. నేడు పిఠాపురం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
తిరుపతి ఘటన బాధాకరమని మంత్రి సవిత అన్నారు. తొక్కిసలాట ఘటనపై ఆమె మాట్లాడుతూ.. "తిరుపతి ఘటనలో కుట్రపూరితంగా చేశారని అంటున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని కావాలని చేశారని అంటున్నారు. క్లారిటీ వచ్చాక ఈ విషయాలపై మాట్లాడతాం. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు.
దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. రేపటి నుంచి సికింద్రాబాద్ విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ లో కూడా కోచ్లు పెంచనున్నారు. ఇకపై రైళ్లో 3 ఎగ్జిక్యూటివ్ కోచ్లు, 17 చైర్ కార్లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్రయాణీకుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ఇందులో అన్రిజర్వ్డ్ కోచ్లు ఉన్నాయి. ఈ రైళ్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రాష్ట్రంలో రెండు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి సంఘటన అందరినీ కలచివేసిందన్నారు. “భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అందరూ కూడా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆరుగురు మంత్రులు తిరుపతికి వెళ్లి వారిని […]