Anam Ramanarayana Reddy: టీటీడీ అధికారి సక్రమంగా విధులు నిర్వహించలేదు: దేవాదాయ శాఖ మంత్రి
- ఓ వైపు అభివృద్ధి పనులకు శ్రీకారం
- మరోవైపు తొక్కిసలాట ఘటన
- ఈ ఘటనపై మోడీతో సహా అందరూ విచారం
- ఇలాంటి ఘటనలు మళ్లి జరగకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో రెండు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి సంఘటన అందరినీ కలచివేసిందన్నారు. “భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అందరూ కూడా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆరుగురు మంత్రులు తిరుపతికి వెళ్లి వారిని పరామర్శించాం. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై అప్పటికప్పుడే ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. తిరుపతిలో టీటీడీకి సంబంధించి పర్యవేక్షణ చేయాల్సిన సంయుక్త కార్య నిర్వహణ అధికారి గౌతమి సక్రమంగా విధులు నిర్వహించలేదు. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో జేఈవోను ప్రశ్నించారు. దర్శన టోకెన్ల కౌంటర్లను సక్రమంగా పర్యవేక్షించలేదు. కౌంటర్ల వద్ద ఇంచార్జ్ గా ఉన్న పోలీస్ అధికారి కూడా విధుల్లో లేరు. అందువల్లే కొందరు అధికారులను బదిలీ చేయడంతో పాటు ఇద్దరిని సస్పెండ్ చేశారు.వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లను తిరుమల నుంచి కిందికి ఎందుకు మార్చారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.” అని మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: Canada New PM: మార్చ్ 9న కెనడాకు కొత్త ప్రధాని
Also Read
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి ఆనం తెలిపారు. “రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ బాధితులను పరామర్శించేందుకు తిరుపతికి వచ్చారు. ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారని.. ఆయన వెళ్లిన తర్వాత రమ్మని జగన్ కు అధికారులు సూచించారు. కానీ జగన్ అహంకారాన్ని ప్రదర్శిస్తూ… పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి వందలాది మంది ఆసుపత్రిలోకి వచ్చారు. ఐసీయూ రూములలోకి వెళ్ళవద్దని డాక్టర్లు వారిస్తున్నా వాళ్ళని పట్టించుకోలేదు. ఐదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కు ఐసీయూ ప్రోటోకాల్ గురించి తెలియదా?
చెప్పిన సమయం కంటే జగన్ ఆలస్యంగా వచ్చారు. అయినా అధికారులు ఆయనకు సహకరించారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. పేషెంట్ లకు పెట్టిన సెలైన్ బాటిళ్లను కూడా తోసేశారు. ఇలా వ్యవహరించడం సరికాదు.” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!