ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ పోరు నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ క్రమంలో మిలిటెంట్ చెరలోని తమ బందీలను విడిపించేందుకు టెల్అవీవ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కొత్తగా రూపొందించిన ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE)ని పర్యవేక్షించడానికి ఎలాన్ మస్క్ని నియమించారు. ఈ నేపథ్యంలో బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మస్క్ ఫోన్లో చర్చలు జరిపినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఇండియాస్ హైయెస్ట్ ఓపెనింగ్స్తో పాటు.. హైయెస్ట్ కలెక్షన్స్ను టార్గెట్ చేశారు సుకుమార్, అల్లు అర్జున్. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి.. పుష్ప 2ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకోసం మూడేళ్ల సమయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టే.. సాలిడ్ అవుట్ పుట్ వచ్చినట్టుగా చిత్ర యూనిట్ హైప్ ఎక్కించింది. సినిమా రన్ టైం మూడు గంటల 20 నిమిషాలు ఉన్నా సరే.. అరె అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంటుంది అని ప్రూవ్ అయింది. అసలు ఈ సినిమా క్రేజ్…
భవిష్యత్తులో టీఎంసీ బాధ్యతలు చేపట్టనున్న మమతా బెనర్జీ వారసులు ఎవరు? ఈ ప్రశ్న పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తృణమూల్ కాంగ్రెస్ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఈ ప్రశ్న పదే పదే లేవనెత్తుతోంది. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. పార్టీలో సీనియర్ నేతలు, యువకుల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మమతా శుక్రవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.
పిల్లల్తో హోమ్ వర్క్ చేయించడం, పరీక్షలకు ప్రిపేర్ చేయించడం పేరెంట్స్కు పెద్ద టాస్క్. ఎందుకంటే వారిని పట్టుమని పది నిమిషాలైన కదురుగా కూర్చోబెట్టలేం. అటు ఇటు పరుగెత్తడం, కదలడం వంటివి చేస్తుంటారు. దీనికి కారణం పెద్దల కంటే పిల్లల్లో తక్కువ శ్రద్ధ ఉండటమే. పిల్లల గరిష్ట శ్రద్ధ వారి వయస్సు కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందట. చదువుపై శ్రద్ధ పెట్టేందుకు, పిల్లల్లో ఏకాగ్రత పెంచేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఇస్లామిక్ దేశం సిరియాలో అధికారం కోసం మళ్లీ హింస చెలరేగింది. ఇస్లామిక్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ (HTS) గత వారం అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, సైన్యంపై దాడి చేసింది. గురువారం హమా నగరాన్ని ఆక్రమించిన హెచ్టీఎస్ నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు శుక్రవారం మరో కీలక నగరం హోమ్స్ దిశగా సాగుతున్నాయి. దీని తరువాత.. సిరియాలో ఉద్రిక్తత పెరిగింది. హిట్ఎస్ దాడి కారణంగా.. ప్రభుత్వ సైన్యం కూడా వెనక్కి తగ్గింది. ఈ దాడి తర్వాత దాదాపు 14 ఏళ్లుగా సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధ పరిస్థితులు తారుమారయ్యాయి.
కెనడాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ భారతీయులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా భారతీయ విద్యార్థిని హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్నియాలో భారతీయ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. బాధితుడిని పంజాబ్కు చెందిన గురాసిస్ సింగ్గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే కొందరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థిని గుర్తించారు.
భారతదేశంలో హ్యుందాయ్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. హ్యుందాయ్ మోటార్ దేశంలోని అతిపెద్ద వాహనాల విక్రయ కంపెనీలలో ఒకటి. డిసెంబర్ 2024లో హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపులు ఇస్తోంది. హ్యుందాయ్ వెన్యూలో గరిష్ట ప్రయోజనాలు ఇస్తున్నారు. అదే సమయంలో కార్ల ధరలను జనవరి 1, 2025 నుంచి పెంచుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. అయితే.. ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు వర్తించే అవకాశం ఉంది!
ఈ నెలతో 2024 ముగిసి పోయి.. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో చాలా వాహన తయారీ సంస్థలు తమ కార్లు, బైక్ల ధరలను పెంచబోతున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతీ సుజుకీ కూడా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 2025 నుంచి కార్ల ధరలు నాలుగు శాతం వరకు పెరగవచ్చని మారుతీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కార్ మోడల్లను బట్టి మారుతి కార్ల ధరలో పెరుగుదల మారవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం పెద్ద షాక్ ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో దేశ వృద్ధి రేటుకు సంబంధించి ఆయన తన అంచనాను వెల్లడించారు. ఈ అంచనా ప్రకారం.. FY 25కి దేశ జీడీపీ వృద్ధి తక్కువగానే ఉండవచ్చు. ఈ సమావేశంలో 25 ఆర్థిక సంవత్సరానికి దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను గవర్నర్ 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించారు.
నేడు రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. సభ వాయిదా పడిన తర్వాత నిన్న సాధారణ తనిఖీల్లో భద్రతా అధికారులు ప్రస్తుతం అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు నంబర్ 222 నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ తెలిపారు. రూ.500, రూ.100 కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించినట్లు ధన్ఖర్ తెలిపారు. ఆ నోట్ల అసలైనవో.. నకిలీవో స్పష్టత లేదన్నారు. చట్ట ప్రకారం విచారణ జరుగుతుందన్నారు. డబ్బు ఎవరిది అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.