ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని స్థాయిల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలను ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వ టీచర్లలో బోధనా సామర్థ్యం పెంచేందుకు ఈసారి శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పటికే.. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మారాయి. మంచి భవనాలు, రంగురంగుల బొమ్మలతో గోడలు, అత్యాధునిక వసతులతో క్లాస్ రూమ్లు, నాణ్యమైన విద్యాబోధన, పైగా ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశ పెట్టారు.
పిల్లలు అల్లరి చేయడం కామన్. ఎదిగే పిల్లలు అమ్మ ఒడిని దాటి బయటి పరిసరాల్ని అర్థం చేసుకునే సమయంలో ఇలాంటివి సహజమే. ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు. తమకు నచ్చింది తెచ్చివ్వాలని పట్టుదలకు పోతుంటారు. ఇవన్నీ తల్లిదండ్రులకు కోపం తెప్పిస్తాయి. కొందరు తల్లిదండ్రులు మాత్రం పిల్లలు ఎంత అల్లరి చేసినా భరిస్తారు. కొంత మంది మాత్రం అస్సలు భరించలేరు. చిన్న పిల్లలపై దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఓ ఘటన కర్ణాటకలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తల్లి దారుణానికి ఒడిగట్టింది.
వేసవి సెలవులు ముగిశాయి. పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇక ఎప్పటిలాగానే బడి గంటలు మోగుతున్నాయి. సెలవుల్లో హాయి గా, ఆనందంగా గడిపిన చిన్నారులు ఇక భుజాన బ్యాగులు వేసుకుని బడికి వెళ్తున్నారు. ఇప్పటికే పిల్లలు, తల్లిదండ్రులు ఈ విద్యా ఏడాదికి సంబంధించిన స్టేషనరీ, బ్యాగులు, టిఫిన్ బాక్స్లు తదితర సామగ్రి కొనుగోళ్లతో నగరంలోని స్టాల్స్ కిటకిటలాడుతున్నాయి. అయితే.. పాఠశాలకు వెళ్తున్న మీ పిల్లలకు బ్యాగులు, పుస్తకాల వంటి సామగ్రితో పాటు కొన్ని అంశాలపై అవగాహన కొన్నింటికి దూరం చేయడం […]
భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునక్కాయ ఒకటి. చెట్టు వేరు నుంచి ఆకు వరకు అన్నీ ఉపయోగపడేవే. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. చిన్నారులలో ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి.
భారతదేశంలో లెక్కకు మించిన బైకులు అమ్మకానికి ఉన్నాయి. అయితే చాలామంది సరసమైన, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. మనం పోషించే బైక్స్ కాకుండా మనల్ని పోషించే బైక్స్ గురించి తెలుసుకుందాం..
భర్త దౌర్జన్యకాండతో విసిగి పోయానని ఇంట్లో అన్ని వస్తువులు ధ్వంసం చేశాడని, తనను రక్షించాలని ప్రాథేయపడుతూ ఈనెల ఎనిమిదో తేదీన పూర్ణానందం పేటకి చెందిన ఓ బాధితురాలు 112 కి ఫోన్ చేసింది. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న 112 సిబ్బంది, సమాచారం సేకరించి సత్యనారాయణపురం నుంచి ఓ పోలీస్ కానిస్టేబుల్, ఒక హోంగార్డు సంఘటన స్థలానికి పంపింది. బాధితురాలు తన ఇంట్లో వస్తువులు ధ్వంసం చేసిన తీరును పోలీసులకు క్షుణ్ణంగా వివరించింది. తనను రక్షించాలని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆ మహిళ ఆవేదన…
మీరు శక్తివంతమైన మిడ్-సెగ్మెంట్ స్పోర్ట్స్ బైక్ కోసం చూస్తున్నట్లయితే.. హోండా CBR650R E-క్లచ్ బెస్ట్ కావొచ్చు! తాజాగా ఈ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ మిడిల్-వెయిట్ స్పోర్ట్స్ బైక్ను మే నెలలో లాంచ్ చేశారు. దీనిని ప్రత్యేకంగా హోండా బిగ్ వింగ్ డీలర్షిప్ల ద్వారా విక్రయిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 10.40 లక్షల (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ప్రత్యేకతలను తెలుసుకుందాం..
కూటమి నాయకులు మట్టి, గ్రావెల్ మీద దోచుకుని లోకల్ జీఎస్టీ వేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందు మీద అధనంగా జీఎస్టీ ఏంటి? అని ప్రశ్నించారు. ప్రతి మద్యం బాటిల్ మీద రూ.10 అదనంగా తీసుకోవడం వాస్తవం కాదా? అని నిలదీశారు. ఎమ్మెల్యే ప్రమేయం లేకపోతే అధనపు వసూళ్లు ఆపాలని డిమాండ్ చేశారు.
జూలై నుంచి పాఠశాలలపై నిత్య పర్యవేక్షణ ఉండనుంది. జూలై నుంచి ప్రతి పాఠశాలలో అధికారులు పర్యటన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అకడమిక్ క్యాలండర్ ప్రకారం సిలబస్ ఫాలో అవుతున్నారా? లేదా? ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన ఎలా చేస్తున్నారనే అంశాలను పరిశీలించనున్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు – పిల్లల సాంకేతిక, విద్యా నైపుణ్యాల స్థాయి ఏ మేరకు ఉంది. స్టూడెంట్ ఎసైన్ బుక్ పై పరిశీలన ఉండనుంది. PM-POSHAN (MDM) అమలు, మధ్యాహ్న భోజన పథకం పాఠశాలల్లో సక్రమంగా అమలు అవుతోందా? అనే అంశాన్ని తనిఖీ…
తిరుపతి రూరల్ (మం) దామినీడులో నాగాలమ్మ ఆలయం కూల్చివేతపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ సూచన మేరకు ఆర్డీవో, డిఎస్పీ ఇరువురితో సమాలోచన జరిపారు. కూల్చి వేసిన ప్రాంగణాన్ని యధావిధిగా గ్రామస్థులకు వదిలేయాలని కృష్ణమూర్తి నాయుడుకి ఆదేశాలు జారీ చేశారు. నేలమట్టం చేసిన ప్రాంతంలోనే తిరిగి ఆలయాన్ని పునర్ నిర్మించాలని సూచించారు. నెలరోజుల్లో ఆలయ నిర్మాణాన్ని యధావిధిగా నిర్మిస్తానని కృష్ణమూర్తి నాయుడు అంగీకరించారు.