పూణేలో 22 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ పై జరిగిన అత్యాచారం కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి అపరిచితుడు కాదని, ఆ మహిళకు తెలిసిన వ్యక్తే అని పోలీసులు వెల్లడించారు. అత్యాచారం అనంతరం నిందితుడు తన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడని యువతి పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే.
ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక కల.. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి నిర్మాణం ప్రస్తుత పరిస్థితులో తలకు మించిన భారంగా మారింది. నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే సొంతిటి కల అందరికీ సాకారం కాకపోవచ్చు. అందరి వద్ద డబ్బు ఉండకపోవచ్చు. ఇంటి వ్యవహారం చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న పని. అందుకే చాలా మంది ఇంటి కోసం రుణం తీసుకుంటారు.
దేశంలో నిజమైన మధ్యతరగతి వర్గానికి చెందిన వారు ఎవరు? ఈ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ "రెడ్డిట్"లో చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి కారణం ఒక పోస్ట్. నిజానికి.. ఓ రెడ్డిట్ పోస్ట్ భారతదేశంలో ఆర్థిక తరగతి విభజనపై చర్చకు దారితీసింది. ఓ యూజర్ తన ఇంటి పనిమనిషి కుటుంబం తన కంటే ఎక్కువ సంపాదిస్తోందని, పన్ను కూడా చెల్లించడం లేదని రాసుకొచ్చాడు. ఇది ప్రస్తుతం దేశంలో మధ్యతరగతి ఎవరు అనే ప్రశ్నను లేవనెత్తుతుంది?
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దాడి చేసి ముగ్గురిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన వారిలో కంపెనీ కీలక ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ కు చెందిన ప్రసాదిత్యా కంపెనీతో మాలికి చెందిన డైమండ్ ఫ్యాక్టరీకి పార్టనర్ షిప్ ఉంది.
అస్సాంలోని కాచార్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రికి వెళ్లితే వైద్యుడు తన అనుమతి లేకుండా జననాంగాలను తొలగించారని రోగి ఆరోపించారు. బాధితుడి వయసు కేవలం 28 ఏళ్లు కావడం ఆందోళన కరంగా మారింది. మణిపూర్లోని జిరిబామ్ జిల్లాకు చెందిన అతికూర్ రెహమాన్ సిల్చార్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చాడు. రోగి జననేంద్రియ ఇన్ఫెక్షన్ బాధితుడు. పరీక్షించిన వైద్యుడు బయాప్సీ పరీక్ష నిర్వహించాడు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించారు. అధికారంలోకి రాగానే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ అమెరికాకు పునర్ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నారు. కానీ పెరుగుతున్న అప్పును నియంత్రించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు.
మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా వివాదం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. మసీదును వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయం హిందూ పక్షానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.
నేడు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో అల్లూరి 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. క్షత్రియ సేవా సమితి(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుతున్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) 2025 ఫలితాలను ప్రకటించింది. ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ cuet.nta.nic.inలో విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంట్రీ చేసి స్కోర్కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాల యూజీ కోర్సులలో ప్రవేశం పొందుతారు.
రాజస్థాన్లో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉదయం ప్రార్థన సమయంలో ఇస్లామిక్ శ్లోకాలు (కల్మా) పఠించమని హిందూ విద్యార్థులను ఉపాధ్యాయులు బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోటలోని బక్షి స్ప్రింగ్డేల్స్ స్కూల్లో జరిగిన ఈ సంఘటన హిందూ సంస్థలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే భారీ నిరసనలు చేపడతామని సంఘాల సభ్యులు హెచ్చరించారు. అయితే, ఆ ఫుటేజ్ చాలా సంవత్సరాల పాతదని పాఠశాల సిబ్బంది తెలిపారు.