Assam: యువకుడి జీవితం నాశనం చేసిన వైద్యుడు.. అనుమతి లేకుండా జననాంగాల తొలగింపు..
- అస్సాంలోని కాచార్ జిల్లాలో షాకింగ్ ఘటన
- ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రికి వెళ్లిన రోగి
- జననాంగాలను తొలగించిన వైద్యుడు
- బాధితుడి వయసు కేవలం 28 ఏళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలోని కాచార్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వైద్యుడు యువకుడి జీవితం నాశనం చేశాడు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రికి వెళ్లితే వైద్యుడు తన అనుమతి లేకుండా జననాంగాలను తొలగించారని రోగి ఆరోపించారు. బాధితుడి వయసు కేవలం 28 ఏళ్లు కావడం ఆందోళన కరంగా మారింది. మణిపూర్లోని జిరిబామ్ జిల్లాకు చెందిన అతికూర్ రెహమాన్ సిల్చార్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చాడు. రోగి జననేంద్రియ ఇన్ఫెక్షన్ బాధితుడు. పరీక్షించిన వైద్యుడు బయాప్సీ పరీక్ష నిర్వహించాడు. బయాప్సీ సమయంలో తన అనుమతి లేకుండా శస్త్రచికిత్స ద్వారా తన జననాంగాలను తొలగించాడని రోగి గ్రహించాడు. బాధితుడు రెహమాన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది స్పందించడం లేదు. చికిత్స చేసిన వైద్యుడు కూడా కనిపించడం లేదు.
READ MORE: WCL 2025: మరోసారి WCL టోర్నీ.. టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
“జూన్ 19న, నా జననాంగాలలో ఇన్ఫెక్షన్ రావడంతో నేను సిల్చార్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాను. బయాప్సీ పరీక్ష కోసం వెళ్లమని డాక్టర్ నాకు సలహా ఇచ్చారు. నా బయాప్సీ పరీక్ష సమయంలో ఓ వైద్యుడు నా అనుమతి లేకుండా శస్త్రచికిత్స చేసి నా జననాంగాలను తొలగించారు. శస్త్రచికిత్స తర్వాత నేను మేల్కొని చూశాను. నా జననాంగాలను తొలగించినట్లు నాకు తెలిసింది. నా పర్మిషన్ లేకుండా ఎందుకు తొలగించారని వైద్యుడిని ప్రశ్నించాను. ఆయన సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఇక నా జీవితం ముగిసింది. నేను మానసికంగా ఆవేదన చెందుతున్నాను.” అని అతికూర్ రెహమాన్ ఆరోపించారు.
READ MORE: Election Commission: తెలంగాణలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు ఈసీ బిగ్ షాక్..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?