Middle Class: పని మనిషి కుటుంబం సంపాదన నెలకు రూ. లక్ష.. అందరి మదిలో ఓ ప్రశ్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో నిజమైన మధ్యతరగతి వర్గానికి చెందిన వారు ఎవరు? ఈ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ “రెడ్డిట్”లో చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి కారణం ఒక పోస్ట్. నిజానికి.. ఓ రెడ్డిట్ పోస్ట్ భారతదేశంలో ఆర్థిక తరగతి విభజనపై చర్చకు దారితీసింది. ఓ యూజర్ తన ఇంటి పనిమనిషి కుటుంబం తన కంటే ఎక్కువ సంపాదిస్తోందని, పన్ను కూడా చెల్లించడం లేదని రాసుకొచ్చాడు. ఇది ప్రస్తుతం దేశంలో మధ్యతరగతి ఎవరు అనే ప్రశ్నను లేవనెత్తుతుంది?
READ MORE: Ambati Rambabu: మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా పాలన.. మాజీ మంత్రి ఫైర్
Also Read
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Union Budget 2026: భారత్ ఎంత అప్పు చేయనుందో తెలుసా? రుణాలపై మంత్రి కీలక ప్రకటన..
- Budget 2026: కొత్త పన్ను, కస్టమ్స్ రేట్లు తగ్గింపు, టీడీఎస్ సరళీకరణ.. బడ్జెట్లో కీలక మార్పులు
ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్న ఓ రెడ్డిట్ యూజర్ పనిమనిషి తన ఇంట్లో చాలా సంవత్సరాలుగా పనిచేస్తోందని చెప్పాడు. ఆమె మూడు ఇళ్లలో పనిచేస్తూ ప్రతి నెలా రూ. 30,000 సంపాదిస్తుంది. రోజువారీ కూలీ అయిన ఆమె భర్త రూ. 35,000 సంపాదిస్తాడు. అతని పెద్ద కొడుకు చీరల దుకాణంలో పనిచేస్తూ రూ. 30,000 సంపాదిస్తాడు. ప్రస్తుతం కుట్టు మిషన్ నేర్చుకుంటున్న చిన్న కూతురు రూ. 3000 సంపాదిస్తుంది. ఆమె పూర్తిగా పని నేర్చుకున్నాక.. రూ. 15,000 నుంచి 20,000 సంపాదించగలదు. చిన్న కొడుకు ప్రస్తుతం ప్లంబర్ శిక్షణ పొందుతున్నాడు. ఇప్పుడు ఏం సంపాధించడం లేదు. కానీ.. పని పూర్తిగా నేర్చుకున్న తర్వాత నెలకు రూ. 15,000 నుంచి రూ. 25,000 సంపాదించగలడు. ఈ విధంగా పని మనిషి కుటుంబం మొత్తం ఆదాయం నెలకు రూ. 98,000.
READ MORE:
కొన్ని నెలల అనంతరం ఈ కుటుంబ ఆదాయం నెలకు రూ. 1.3 నుంచి 1.35 లక్షలకు పెరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వీళ్ల సంపాదనపై ఎటువంటి పన్ను లేదు. వారు అద్దెకు రూ. 6000 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వ పథకాల కింద ఈ కుటుంబానికి ఉచిత రేషన్ కూడా లభిస్తుంది. కేంద్ర గృహనిర్మాణ పథకం కింద గ్రామీణ ప్రాంతంలో వారికి ఇల్లు కూడా అందించారు. వారసత్వంగా వచ్చిన భూమిని లీజుకు ఇచ్చి ప్రతి త్రైమాసికంలో రూ. 30,000 నుంచి రూ. 40,000 సంపాదిస్తున్నారు. “నేను ఆమె కుటుంబ సంపాదనపై సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే ఆమె తన జీవితమంతా కష్టపడి పనిచేసింది. కానీ నాకు ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. నిజంగా మధ్యతరగతికి చెందిన వారు ఎవరు? ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు” అని రెడ్డిట్ యూజర్ రాశాడు. జీతం పొందే ఉద్యోగుల ఖర్చులు, పన్నులు పెరుగుతున్నాయి. కానీ.. అనధికారిక రంగ ఆదాయాలకు పన్ను లేనందున వారి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరిలో మధ్యతరగతికి చెందిన వారు ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!