Rajasthan: హిందూ విద్యార్థులతో బలవంతంగా ఇస్లామిక్ శ్లోకం(కల్మా) పాడించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉదయం ప్రార్థన సమయంలో ఇస్లామిక్ శ్లోకాలు (కల్మా) పఠించమని హిందూ విద్యార్థులను ఉపాధ్యాయులు బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కోటలోని బక్షి స్ప్రింగ్డేల్స్ స్కూల్లో జరిగిన ఈ సంఘటన హిందూ సంస్థలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే భారీ నిరసనలు చేపడతామని సంఘాల సభ్యులు హెచ్చరించారు. అయితే, ఆ ఫుటేజ్ చాలా సంవత్సరాల పాతదని పాఠశాల సిబ్బంది తెలిపారు.
READ MORE: Pawan Kalyan : అతనికి పవన్ కల్యాణ్ థాంక్స్.. పోస్ట్ వైరల్..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఈ అంశంపై జిల్లా విద్యా శాఖ దర్యాప్తు ప్రారంభించింది. కోటా చీఫ్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేతృత్వంలోని విచారణ బృందం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడింది. జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణ కుమార్ శర్మ మాట్లాడుతూ.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, శాఖాపరమైన మార్గదర్శకాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. “నిన్న, ఒక పాఠశాలలో ముస్లిం మతపరమైన ప్రార్థనను పఠిస్తున్నట్లు చూపించే వీడియో మా వద్దకు వచ్చింది. ఆ వీడియో అందిన వెంటనే, విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. నివేదిక అందిన తర్వాత, తగిన చర్యలు తీసుకుంటాం. ఇది CBSE-అనుబంధ పాఠశాల కాబట్టి.. నివేదికను బోర్డుకు పంపుతాం” అని శర్మ చెప్పారు.
READ MORE: KCR Health Bulletin: కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా తమ సంస్థలో “సర్వ ధర్మ ప్రార్థన” సంప్రదాయాన్ని అనుసరిస్తోందని, ఇక్కడ అన్ని మతాల ప్రార్థనలు జరుగుతాయని అన్నారు. తాను రిటైర్డ్ నావికాదళ అధికారినని, తన తండ్రి కూడా ఆర్మీలో పనిచేశారని, మూడు యుద్ధాలు చేశారన్నారు. విద్యకు మతం లేదు. మేము అన్ని మతాలను గౌరవిస్తూ సర్వ ధర్మ ప్రార్థన చేస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!