Ramesh Nalam
Author- NTV Telugu-
CM Jagan: ఏపీలో అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారి నియామకం
CM Jagan Review Meeting on Education Department: ఏపీలో విద్యాశాఖపై అధికారులతో శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలను జారీ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అంతేకాకుండా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాడు-నేడు కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు పాఠశాలల నిర్వహణ కోసం […] -
India Today Survey: వచ్చే ఎన్నికల్లో మళ్లీ మోదీకే పట్టం.. ఏపీలో వైసీపీకే జై కొట్టిన ప్రజలు
India Today Survey: మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో దేశంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి మోదీకే పట్టం కడతారని స్పష్టమైంది. అయితే 2019లో వచ్చిన సీట్ల కంటే బీజేపీకి మెజారిటీ తగ్గుతుందని ఇండియా టుడే-సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 2019 ఎన్నికల్లో 303 సీట్లు వచ్చాయి. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ 286 సీట్లకే పరిమితం అవుతుందని సర్వే అంచనా వేసింది. గత […] -
Emirates Airlines Offer: ఫ్రీగా వస్తుందని ఈ లింక్ క్లిక్ చేస్తే.. మీ ఖాతాలు ఖాళీ..!!
Danger Link: సైబర్ నేరగాళ్ల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. సోషల్ మీడియా ఉంది కదా అని ఫేక్ లింకులను నేరగాళ్లు తెగ సర్క్యులేట్ చేస్తున్నారు. ఇండిపెండెన్స్ డే ఆఫర్ అని.. రీ ఛార్జ్ ఆఫర్ అని.. కంపెనీ వార్షికోత్సవం అంటూ రకరకాలుగా అమాయకులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయం తెలియక ఆఫర్లు అని పొరబడి చాలా మంది ఫేక్ లింకులను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతున్నారు. తాజాగా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ పేరుతో […] -
Asia Cup 2022: టీమిండియా మ్యాచ్ ఎఫెక్ట్.. పాకిస్థాన్ ఆటగాళ్లకు జీతాల పెంపు
Asia Cup 2022: ఈనెల 27 నుంచి దుబాయ్ వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్ను దృష్టిలో పెట్టుకుని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లకు 10 శాతం జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనకు ముందు కొత్త కాంట్రాక్టులు ప్రకటించిన పీసీబీ ఇప్పుడు వేతనాలను పెంచడం గమనించదగ్గ విషయం. మొత్తం 33 మంది పాకిస్థాన్ ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్టులు పొందగా.. పీసీబీ తాజాగా పెంచిన జీతాల […] -
Andhra Pradesh: సీఎం జగన్ను సన్మానించిన ఎంపీడీవోల సంఘం నేతలు
MPDO Association leaders meets cm jagan: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు 25 ఏళ్ళుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య ముఖ్యమంత్రి జగన్ను కలిసి […] -
PaniPuri Effect: పానీపూరి తిని 100 మందికి అస్వస్థత.. డయేరియాగా అనుమానిస్తున్న వైద్యులు
PaniPuri Effect: వర్షాకాలంలో రోడ్లపై విక్రయించే పానీపూరి తినవద్దని వైద్యులు సూచిస్తున్నా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. తాజాగా పానీపూరి తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురైన సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. హుగ్లీ జిల్లా డొగాచియాలోని ఓ స్టాల్ వద్ద పానీపూరీ తిన్నవారిలో చాలామందికి వాంతులు, కడుపులో నొప్పి వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చాలామంది తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు […] -
KL Rahul: కేఎల్ రాహుల్ వచ్చేశాడు.. ధావన్కు ఎసరు పెట్టేశాడు
KL Rahul: టీమిండియాకు శుభవార్త అందింది. ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నీకి ముందు కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చాడు. ఈనెల 18 నుంచి జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు కేఎల్ రాహుల్ను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమైన దృష్ట్యా జింబాబ్వే టూర్కు కేఎల్ రాహుల్ను పంపాలని సెలక్టర్లు భావించారు. దీంతో జింబాబ్వేలో పర్యటించనున్న టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్ను ప్రకటించారు. అయితే గతంలో ఈ టూర్కు కెప్టెన్గా […] -
30 Years Prudhviraj: గోరంట్ల వీడియోతో తెలుగు ఎంపీల చరిత్ర మొత్తం తుడిచిపెట్టుకుపోయింది
30 Years Prudhvi: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వీడియో ఒరిజినల్ కాదంటూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించినా ఈ అంశంపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ స్పందించి ఈ అంశంపై విచారణ చేపట్టి రిపోర్టు ఇవ్వాలని ఏపీ డీజీపీని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు గోరంట్ల మాధవ్ వీడియోపై వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ స్పందించారు. అంగబలంతో పాటు […] -
Team India: టీమిండియాకు షాక్.. టీ20 ప్రపంచకప్కు స్టార్ బౌలర్ దూరం?
Team India: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఆసియా కప్ తరహాలోనే టీ20 ప్రపంచకప్కు కూడా టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. గాయం కారణంగా ఆసియా కప్కు దూరమైన స్టార్ పేసర్ బుమ్రా.. టీ20 ప్రపంచకప్లో కూడా పాల్గొనడం అనుమానంగా మారింది. గతంలోని గాయం తిరగబెట్టడంతో బుమ్రా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్కు జట్టును […] -
Kodali Nani: లింగ పరిశోధనలో టీడీపీ వాళ్లు నిష్ణాతులా? మాధవ్ది పట్టుకుని ఎందుకు వేలాడతారు?
Kodali Nani: గత కొన్నిరోజులుగా ఏపీలో హాట్ టాపిక్గా మారిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే బూతు పదాలతో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఫేక్ అని పోలీసులు చెప్పినా టీడీపీ రాద్ధాంతం చేయడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. లింగ పరిశోధనలో నిష్ణాతులైన టీడీపీ వాళ్లు.. రాష్ట్రంలో ఏది ఎవరిదో కూడా తేల్చి ఐడీ కార్డులు ముద్రిస్తారా అంటూ […]
తాజావార్తలు
-
CM Chandrababu: ఏపీ పెట్టుబడుల గమ్యస్థానం.. అభివృద్ధిపై సీఎం కీలక వ్యాఖ్యలు
-
Shruti Haasan : సొంతంగా ఇల్లు కొని ఒంటరిగా గృహప్రవేశం చేసిన శృతి హాసన్.. అసలేం జరిగింది?
-
Samay Raina: నటుడు సమయ్ రైనాకు సుప్రీంకోర్టు షాక్.. రూ.10 లక్షల జరిమానా
-
Tollywood Sequels : టాలీవుడ్ను ఊపేస్తున్న సీక్వెల్ ఫీవర్.. తారక్, చరణ్, మహేష్’ల నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
-
E20 Fuel: ఈ20 ఇంధనంపై విమర్శలకు గడ్కరీ కౌంటర్.. ఏమన్నారంటే..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!