India Today Survey: వచ్చే ఎన్నికల్లో మళ్లీ మోదీకే పట్టం.. ఏపీలో వైసీపీకే జై కొట్టిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Today Survey: మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో దేశంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి మోదీకే పట్టం కడతారని స్పష్టమైంది. అయితే 2019లో వచ్చిన సీట్ల కంటే బీజేపీకి మెజారిటీ తగ్గుతుందని ఇండియా టుడే-సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 2019 ఎన్నికల్లో 303 సీట్లు వచ్చాయి. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ 286 సీట్లకే పరిమితం అవుతుందని సర్వే అంచనా వేసింది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరుగుతాయని.. ఆ పార్టీ 146 సీట్లు గెలుచుకుంటుందని.. ఇతర పార్టీలు 111 సీట్లు గెలుచుకుంటాయని వివరించింది. అటు ప్రధానిగా మరోసారి మోదీని 53 శాతం ప్రజలు కోరుకుంటున్నారని.. రాహుల్ గాంధీని ప్రధానిగా 9 శాతం మందే ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది.
Read Also: Emirates Airlines Offer: ఫ్రీగా వస్తుందని ఈ లింక్ క్లిక్ చేస్తే.. మీ ఖాతాలు ఖాళీ..!!
Also Read
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
కాగా ఈ సర్వేను ఈ ఏడాది ఫిబ్రవరి-ఆగస్టు నెలల మధ్య నిర్వహించినట్లు ఇండియాటుడే తెలిపింది. తెలుగు రాష్ట్రాలలో ప్రజల మద్దతు ఎలా ఉందో కూడా ఇండియా టుడే సర్వే వెల్లడించింది. ఏపీలో మరోసారి ప్రజలు వైసీపీకే జై కొడతారని సర్వే తెలిపింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి 18 సీట్లు, టీడీపీకి 7 సీట్లు వస్తాయని.. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఒక్క సీటు కూడా రాదని సర్వే తేల్చి చెప్పింది. తెలంగాణ విషయానికి వస్తే .. 2024 ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంటుందని ఇండియాటుడే-సీ ఓటర్ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం బీజేపీకి తెలంగాణలో 4 ఎంపీ సీట్లు ఉండగా, వచ్చే ఎన్నికల్లో 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వివరించింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి 8, కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు లభించవచ్చని సర్వే అంచనా వేసింది.


తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!