ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయ నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీని అభివర్ణించిన బీజేపీ.. శుక్రవారం (సెప్టెంబర్ 15) ఆయన నాయకత్వాన్ని కొనియాడింది. జీ-20 సదస్సు ముగిసిన తర్వాత ఈ సర్వే నిర్వహించగా.. ఇందులో ప్రధాని మోడీ అత్యధిక రేటింగ్ పొందారు. మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వేలో.. 76 శాతం మంది ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఆమోదించారని తెలిపింది.
గత కొన్ని వారాలుగా హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే వారి కష్టాలు ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. మండి సహా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
కాంగ్రెస్ ఎంపీ, అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ హయాంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా అని ప్రశ్నించారు.
బీహార్లోని బంకాలో జంట హత్యల ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు మోతిహారిలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. బంకాలోని పొదల మధ్య ఉన్న బావిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం శుక్రవారంతో ముగియనుంది. సంజయ్ కుమార్ మిశ్రా 2018లో ఈడీ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆ తర్వాత పొడిగింపు ఇచ్చారు. అతని పదవీకాలం 2023 నవంబర్ 18 వరకు నిర్ణయించగా.. అతని మూడవ సర్వీసు పొడిగింపు చట్టవిరుద్ధమని జూలై 11న సుప్రీంకోర్టు ప్రకటించింది.
కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలి సమావేశం శనివారం హైదరాబాద్లోని తాజ్కృష్ణాలో నిర్వహించనున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ వ్యూహం, విపక్షాల కూటమి (INDIA), రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా.. 'భారత్ జోడో యాత్ర' రెండో దశపై కూడా ఈ వర్కింగ్ కమిటీలో చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో శుక్రవారం నిపా వైరస్ సోకిన మరో కేసు నిర్ధారించారు. ఓ 39ఏళ్ల వ్యక్తికి నిపా వైరస్ సోకినట్లు నిర్ధారించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కార్యాలయం శుక్రవారం తెలిపింది.
మహాదేవ్ యాప్కు సంబంధించి సుమారు రూ. 5000 కోట్ల మనీ లాండరింగ్పై దర్యాప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. సూత్రధారి సౌరభ్ చంద్రకర్ విషయాలను బట్టబయలు చేశారు. అతను ఏ విధంగా మోసాలకు పాల్పడి ఎలా ఆనందించాడో అని వివరించారు.
లిబియాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచేశాయి. డేనియల్ తుపానుతో వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. వరదల కారణంగా లిబియాలోని డెర్నా నగరంలో దాదాపు పావు వంతు కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలకు IMD హెచ్చరిక జారీ చేసింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.