CWC Meeting: రేపు సీడబ్ల్యూసీ తొలి సమావేశం.. పలు అంశాలపై చర్చ
కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలి సమావేశం శనివారం హైదరాబాద్లోని తాజ్కృష్ణాలో నిర్వహించనున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ వ్యూహం, విపక్షాల కూటమి (INDIA), రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా.. ‘భారత్ జోడో యాత్ర’ రెండో దశపై కూడా ఈ వర్కింగ్ కమిటీలో చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 17న విస్తృత వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులందరితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం తుక్కుగూడలో నిర్వహించే ‘విజయభేరి’ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Nipah Virus: కేరళలో మరో నిపా కేసు.. డేంజర్ అంటున్న వైద్యులు..!
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ఈ సమావేశంలోనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలను చర్చించనున్నారు. ఇండియా కూటమితో అనుసరించే వ్యూహాలు, తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు లేదంటే జమిలి ఎన్నికలు వస్తే ఎలా వ్యవహారించాలనే అంశాలపైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రెండో రోజు ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఏఐసీసీ ప్రధానకార్యదర్శులు, ఏఐసీసీ కార్యదర్శులు, కేంద్ర మాజీ మంత్రుల, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులతో పాటు పార్టీ సీనియర్లు పాల్గొననున్నారు. మొదటి రోజు తీసుకున్న నిర్ణయాలతో పాటు, అదనంగా మరికొన్ని అంశాపై చర్చిస్తారని పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితి, చైనా సరిహద్దులో ఉద్రిక్తత, అవినీతి ఆరోపణలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహంపై కూడా చర్చించవచ్చని పార్టీ వర్గాల సమాచారం.
Mahadev Gambling App: UAEలో పెళ్లి కోసం రూ. 200 కోట్ల ఖర్చు.. బట్టబయలు చేసిన ఈడీ
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీతో సహా పలువురు సీనియర్ నేతలతో పాటు.. కాంగ్రెస్ తన కార్యవర్గాన్ని ఆగస్టు 20న పునర్నిర్మించింది. కార్యవర్గంలో 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులను చేర్చారు. సచిన్ పైలట్, శశిథరూర్ వంటి నేతలకు తొలిసారిగా ఈ వర్కింగ్ కమిటీలో చోటు దక్కింది.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!