Supreme Court: మూడోసారి పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం శుక్రవారం (సెప్టెంబర్ 15)తో ముగియనుంది. సంజయ్ కుమార్ మిశ్రా 2018లో ఈడీ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆ తర్వాత పొడిగింపు ఇచ్చారు. సంజయ్ మిశ్రా 1984 బ్యాచ్ IRS అధికారి. అతని పదవీకాలం 2023 నవంబర్ 18 వరకు నిర్ణయించగా.. అతని మూడవ సర్వీసు పొడిగింపు చట్టవిరుద్ధమని జూలై 11న సుప్రీంకోర్టు ప్రకటించింది. అంతేకాకుండా.. జూలై 31లోగా పదవీవిరమణ చేయాలని ఆదేశించింది.
Read Also: Jayalalitha: వ్యాంప్ క్యారెక్టర్స్ చేసే ఆమెకు.. మహేష్ సినిమాలో అలాంటి పాత్రా అన్నారు
Also Read
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
సంజయ్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగించవద్దని 2021లోనే ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టు తెలిపింది. అయినప్పటికీ.. చట్టం తీసుకురావడం ద్వారా అతని పదవీకాలాన్ని పొడిగించారు. ఇది రాజ్యాంగబద్ధంగా జరిగినప్పటికీ.. దీనిని సమర్థించలేమని, ఇది చట్టవిరుద్ధమని కోర్టు తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) ద్వారా జరుగుతున్న అంచనాల ద్వారా దేశాన్ని సమర్థవంతంగా నడిపించడానికి మిశ్రా ఉనికి చాలా ముఖ్యమని పిటిషన్ లో తెలిపారు.
Read Also: MP Margani Bharat: చంద్రబాబు స్కామ్లలో పవన్ కల్యాణ్ పాత్ర.. వైసీపీ ఎంపీ అనుమానాలు..
అక్టోబర్ 15 వరకు సంజయ్ మిశ్రా పదవిలో కొనసాగేందుకు అనుమతించాలని ప్రభుత్వం కోర్టును కోరింది. దీనిపై సుప్రీంకోర్టు జూలై 27న ప్రత్యేక విచారణలో సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని 2023 సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఇంకా ఆ తర్వాత పొడిగింపు కోసం ప్రభుత్వం చేసిన తదుపరి అభ్యర్థనలను అంగీకరించబోమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 15-16 అర్ధరాత్రి సంజయ్ మిశ్రా ఇకపై ఈడీ డైరెక్టర్గా ఉండరని కోర్టు తెలిపింది.
తాజావార్తలు
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
-
Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్పై స్టే ఎత్తివేత.. కానీ..!
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!