నగరంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా మరో చిన్నారిపై దాడికి పాల్పడ్డాయి. అంబర్పేట్లో 19 నెలల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో పాప శ్రీలక్ష్మికి చిన్నారి ముఖం, మెడ, చేతులు, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. చిన్నారిని నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్కు తరలించారు.
ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానుండగా..ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మదీనలోని ఝాన్సీ బజార్లో ఉన్న ఓ హోల్ సేల్ క్లాత్ షోరూంలో మంటలు ఎగసిపడ్డాయి. ఐదంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి.
జలసౌధలో కరీంనగర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇంఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. జిల్లాలో పెండింగ్ పనులు, అభివృద్ధి ప్రతిపాదనలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్-కిష్టారెడ్డిపేట మైత్రి విల్లాస్లోని లక్ష్మీ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపుతోంది. హాస్టల్లో ఉండే విద్యార్థినిలు స్పై కెమెరాను గుర్తించి.. అమీన్ పూర్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో.. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భాగ్యనగర వాసులకు జీహెచ్ఎంసీ (GHMC) శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను చెల్లింపులో వడ్డీపై 90 శాతం డిస్కౌంట్తో ఓటీఎస్ అవకాశం కల్పిస్తుంది. బకాయిదారులకు బల్దియా ఓటీఎస్ అవకాశం కల్పించింది. ఈ నెలాఖరు వరకు పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేవారికి ఈ ఆఫర్ వర్తించనుంది.
సమగ్ర కుటుంబ(ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక, న్యాయ) సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధ్యయనానికి సామాజికవేత్తలతో స్వతంత్ర హోదాతో కమిటీ ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సమగ్ర సర్వే సమాచారాన్ని విశ్లేషణ చేసి చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు మహిళలందరికీ శుభ దినం అని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజా ప్రభుత్వం చేపట్టిన విజయమన్నారు. […]
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలువురు ముఖ్య నేతలను కలవనున్నారు. మరోవైపు.. “ఇండియా టుడే” మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. మీరు కన్ఫ్యూజ్ అయినట్టే మేము మూడు లక్షల కోట్లే అప్పు అనుకున్నాం.. కానీ లెక్కలు చూస్తే రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని అన్నారు.