దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు దొంగతనం చేస్తూ దొరికిపోతే దానికంటే అవమానం ఏముంటుంది. పంజాబ్ లోని పతేఘర్ సాహిబ్ టౌన్ లోని ఓ పోలీసు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. రోడ్డుపై పెట్టిన కోడిగుడ్ల బండి వద్దకు వెళ్లిన పోలీస్ అందులోనుంచి కొన్ని గుడ్లను తీసుకొని జేబులో వేసుకున్నాడు. బండి డ్రైవర్ రాగానే తనకేమి తెలియనట్టు అక్కడి నుంచి తప్పుకున్నాడు. అయితే, ఈ తతంగం మొత్తాన్ని ఓ వ్యక్తి మొబైల్ లో వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కోడిగుడ్ల […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య తో పాటుగా పాజిటివిటి రేటు కూడా పెరుగుతున్నది. దీంతో ఏపీలో ప్రస్తుతం ఉదయం, రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చి 18 గంటలపాటు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గక పోవడంతో కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఈరోజు పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈరోజు […]
ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో 24 గంటలపాటు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. రేపు ఉదయం నుంచి కర్ఫ్యూ సమయంలో ఉన్న సడలింపులు అమలు చేయనున్నారు. పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేస్తుండటంతో బస్సులను కనిగిరి డిపోకు పరిమితం […]
ఇజ్రాయిల్ పాలస్తీనా దేశాల మధ్య రగడ తారాస్థాయికి చేరింది. గాజాపట్టిలోని హమాస్ ఉగ్రవాదులు వరస దాడులు చేస్తుండటంతో ఇజ్రాయిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజాపట్టిపై బాంబుల వర్షం కురిపించింది. ఒకవైపు రాకెట్ లాంఛర్లతో క్షిపణులను ప్రయోగిస్తూనే, మరోవైపు యుద్ధవిమానాలతో బాంబుల వర్షం కురిపించింది. శనివారం రోజున పాలస్తీనాపై 160 ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. దీంతో పలు భవనాలు ధ్వంసం కాగా, అనేక మంది పౌరులు మృతి చెందారు. ఈ వైమానిక దాడిలో పాలస్తీనాలోని అసోసియేటెడ్ ప్రెస్, ఆల్ […]
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైన తౌక్టే తుఫానుగా మారింది. ప్రస్తుతం ఈ తుఫాను గోవాకు 222 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం కారణంగా ప్రస్తుతం కేరళలో భారీ వర్షాలు గాలులు వీస్తున్నాయి. కేరళలో 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల ధాటికి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈనెల 18 వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్, నలియా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నది. దీంతో గుజరాత్ లోని […]
రాయలసీమలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇటీవలే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. కర్ణాటక, తమిళనాడు ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి రాయలసీమకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరం అవుతున్నది. అయితే, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రావాల్సిన ఆక్సిజన్ సమయానికి అందటం లేదని, ఫలితంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ […]
కరోనా మహమ్మారి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసింది. కొత్త కొత్త జబ్బులను వెలుగులోకి తీసుకొస్తోంది. ఒకవైపు కరోనాతో అవస్థలు పడుతుంటే దానికి తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఒకటి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కరోనా వైరస్ శరీరం నుంచి ఊపిరి తిత్తులకు చేరి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది. ఊపిరి తీసుకోడం కూడా కష్టమైపోతుంది. ఇలాంటి సమయంలో ఆక్సిజన్ అందించి రోగిని కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇదిలా ఉంటె, కరోనా సోకిన వ్యక్తికి కరోనా కంటే ముందు ఇతర జబ్బులు ఉన్నా, కరోనా […]
కరోనా మహమ్మారి ఉధృతి దేశంలో ఏ మాత్రం తగ్గడం లేదు. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 15 రాష్ట్రాల్లో లాక్ డౌన్, కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించారు. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్న తరుణంలో కొంతమేర పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులు రెమ్ డెసీవర్ మెడిసిన్ వాడుతున్నారు. ఇలా స్వల్ప లక్షణాలు ఉన్న […]
పాలస్తీనా-ఇజ్రాయిల్ దేశాల మద్య గత కొన్ని రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకోన్నది. జెరూసలేం డే రోజున పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో విరుచుకు పడ్డారు. అయితే, జెరూసలేంలో ఏర్పాటు చేసిన ఐరన్ డోమ్ వలన పెద్దగా ప్రమాదం జరగలేదు. ఆ తరువాత, ఇజ్రాయిలో గాజాపట్టిపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా పౌరులు మరణించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రికత్తలు మరింత ఉదృతం అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ రాజధాని […]
ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. లాక్డౌన్ కారణంగా ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను తెలంగాణ బోర్డర్లోనే అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో అత్యవసర చికిత్స అందక రోగులు మృతిచెందుతున్నారు. ఇలా బోర్డర్లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై ఏపీ ప్రభుత్వం మండిపడింది. ఇక, తెలంగాణ బోర్డర్లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ విచారణలో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తరపుప అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు. […]